19 July 2013

Long live with fish eating,చేపల ఆహారం తో దీర్ఘాయుష్షు


  •  


  •  
ఎక్కువకాలం జీవించాలని కోరుకుంటున్నారా? అయితే తరచుగా చేపలను తిని చూడండి. ఎందుకంటే వీటిల్లోని ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు ఆయుష్షు పెరగటానికి దోహదం చేస్తోందని పరిశోధకులు చెబుతున్నారు. రక్తంలో ఒమేగా 3 కొవ్వు ఆమ్లాల మోతాదులు తక్కువగా గలవారితో పోలిస్తే అధికంగా ఉన్నవారు రెండేళ్లకు పైగా ఎక్కువగా జీవిస్తున్నట్టు చేస్తున్నట్టు తాజా అధ్యయనంలో బయటపడింది. అలాగని చేపనూనె మాత్రలు వేసుకుంటే సరిపోతుందిలే అని అనుకుంటే పొరపాటు పడ్డట్టే. ఆహారం ద్వారా లభించ ఒమేగా-3 కొవ్వులతోనే ఈ ప్రయోజనం కనబడుతోందని హార్వర్డ్‌ స్కూల్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌కు చెందిన డాక్టర్‌ దారియష్‌ మొజఫరేయన్‌ చెబుతున్నారు. రక్తంలోని ఒమేగా-3 స్థాయులకూ మరణం ముప్పు.. ముఖ్యంగా గుండెజబ్బు సంబంధ మరణాల ముప్పు తగ్గటానికీ సంబంధం ఉంటోదంటున్నారు. ఈ కొవ్వులు అధికంగా గలవారిలో ఏ కారణంతోనైనా వచ్చే మరణాల ముప్పు 27% తక్కువగా ఉంటుండగా.. గుండెజబ్బు సంబంధ మరణాల ముప్పు 35% తక్కువగా ఉంటోందని తేలింది. చేపల్లో గుండెకు మేలు చేసే ప్రోటీన్‌, కొవ్వు ఆమ్లాలు దండిగా ఉంటాయి. చేపలు అధికంగా గల ఆహారం తీసుకుంటే గుండెజబ్బు మూలంగా వచ్చే మరణం ముప్పు తక్కువగా ఉంటున్నట్టు గత అధ్యయనాల్లోనూ తేలింది. అయితే ఇతర కారణాలతో వచ్చే మరణాలపై వీటి ప్రభావం గురించి స్పష్టత లేదు. అందుకే మొజఫరేయన్‌ బృందం ఈ దిశగానూ అధ్యయనం చేసింది. వ్యక్తులు చెప్పే అంశాలపై కాకుండా నిజంగా రక్తంలో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాల స్థాయులను లెక్కించి మరీ 16 ఏళ్ల పాటు అధ్యయనం చేసింది. అయితే మరణాల ముప్పు తగ్గటానికీ ఒమేగా-3 కొవ్వులకు నేరుగా సంబంధం ఉంటోందా? లేకపోతే ఇది ఆరోగ్యకర జీవనశైలికిది సూచికా? అన్నది మాత్రం నిర్ధరణ కాలేదు. ఎందుకంటే అధ్యయనంలో పాల్గొన్నవారిలో ఒమేగా కొవ్వులు ఎక్కువగా గలవారు పండ్లు, కూరగాయల వంటివీ బాగానే తీసుకునేవారు. అందువల్ల కేవలం చేపనూనె మాత్రలు తీసుకుంటే సరిపోతుందని భావించటం తప్పని, వాటితో ఇలాంటి ఫలితాలే కనబడతాయని చెప్పలేమని పరిశోధకులు అంటున్నారు. సాధారణంగా 100 గ్రాముల చొప్పున వారానికి రెండుసార్లు చేపలను తినాలన్నది నిపుణుల సూచన.
  • =========================== 
 Visit my website at -> Dr.Seshagirirao.com/

Fiber prevents paralysis,పీచుతో పక్షవాతం దూరం.


  •  
  •  
పీచుతో మలబద్ధకం తగ్గటం వంటి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయన్నది తెలిసిందే. ఇది పక్షవాతం ముప్పు తగ్గటానికీ దోహదం చేస్తున్నట్టు తాజాగా బయటపడింది. పీచు మోతాదు పెరిగినకొద్దీ పక్షవాతం ముప్పూ తగ్గుతుండటం గమనార్హం. రోజూ తినే పీచు పదార్థంలో ప్రతి 7 గ్రాముల మోతాదుకూ పక్షవాతం ముప్పు 7% వరకు తగ్గుతున్నట్టు తేలింది. బ్రిటన్‌ పరిశోధకులు 20 ఏళ్ల పాటు అధ్యయనం చేసి ఈ విషయాన్ని గుర్తించారు. మనలో చాలామంది పీచుతో కూడిన పదార్థాలు తగినంతగా తీసుకోవటం లేదు. ఈ నేపథ్యంలో తాజా పరిశోధన ప్రాధాన్యం సంతరించుకుందని లీడ్స్‌ విశ్వవిద్యాలయానికి చెందిన విక్టోరియా బూర్లే పేర్కొంటున్నారు. మనకు రోజుకి 25-30 గ్రాముల పీచు అవసరం. కానీ చాలామంది ఇందులో సగం కూడా తీసుకోవటం లేదు. రోజుకి 7 గ్రాముల పీచు అందించే పదార్థాలనైనా తినటం లేదని పరిశోధకులు చెబుతున్నారు. పండ్లు, గింజపప్పులు, కూరగాయలు, ముడిధాన్యాల వంటి వృక్ష సంబంధ పీచు.. పక్షవాతాన్ని తెచ్చిపెట్టే అధిక రక్తపోటు, ఎల్‌డీఎల్‌ కొలెస్ట్రాల్‌ వంటి ముప్పులను తగ్గిస్తున్నట్టు ఇంతకుముందే వెల్లడైంది. తాజా అధ్యయనం దీన్ని మరింత బలపరిచింది. మెదడుకు రక్తసరఫరా చేసే రక్తనాళాల్లో అడ్డంకులు ఏర్పడటం లేదా మెదడులోని రక్తనాళాలు చిట్లటం వల్ల పక్షవాతం వస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మరణాలకు కారణమవుతున్న జబ్బుల్లో ఇది రెండోది. ఏటా సుమారు 60 లక్షల మంది పక్షవాతం మూలంగా చనిపోతున్నారని అంచనా. అందువల్ల దీన్ని నివారించుకునేందుకు పీచును కాస్త ఎక్కువగా తీసుకోవటం వంటి చిన్న విధానాలైనా సరే.. పాటించటం ఎంతో మంచిదని పరిశోధకులు సూచిస్తున్నారు. ముఖ్యంగా పక్షవాతం ముప్పు పొంచున్న పొగ అలవాటు గలవారు, ఊబకాయులు, అధిక రక్తపోటు బాధితులకు ఇదెంతో అవసరమని వివరిస్తున్నారు. పీచు మోతాదు పెంచుకోవటానికి మొత్తం ఆహారాన్ని మార్చుకోవాల్సిన పనేమీ లేదు. మైదా పిండికి బదులు గోధుమలను మర పట్టించి వాడుకోవటం, మరీ తెల్లటి బియ్యానికి బదులు దంపుడు బియ్యం తీసుకోవటం వంటివి చేయొచ్చు. తాజా పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు కూడా ఎక్కువగా తీసుకోవాలి.

===========================
 Visit my website at -> Dr.Seshagirirao.com/

11 July 2013

Neem leaves for cancer treatment,క్యాన్సర్‌ పై వేప ప్రభావము

  •  


కణితి కణాల వృద్ధిని అడ్డుకునే ప్రోటీన్‌ గుర్తింపు---భారతీయ శాస్త్రవేత్తల ఘనత

కోల్‌కతా: వేపలోని ఔషధ గుణాలు అన్నీఇన్నీ కావు. ఇది క్రిమి, కీటక సంహారిణిగానే కాదు.. క్యాన్సర్‌తోనూ పోరాడగలదని మీకు తెలుసా? వేప ఆకుల నుంచి తీసిన ీనీమ్‌ లీఫ్‌ గ్త్లెకోప్రోటీన్‌- ఎన్‌ఎల్‌జీపీ' అనే ప్రోటీన్‌.. క్యాన్సర్‌ కణాల వృద్ధిని అడ్డుకుంటున్నట్టు తాజాగా బయటపడింది. చిత్తరంజన్‌ నేషనల్‌ క్యాన్సర్‌ ఇన్‌స్టిట్యూట్‌(సీఎన్‌సీఐ)కు చెందిన పరిశోధకుల బృందం ఈ విషయాన్ని గుర్తించింది. ఈ ప్రోటీన్‌ నేరుగా క్యాన్సర్‌ కణాలను లక్ష్యంగా చేసుకోవటం కన్నా కణితిలోని రోగ నిరోధక కణాలను బలోపేతం చేస్తుండటం విశేషం. అలాగే కణితి చుట్టుపక్కల గల రక్తం వంటి ఇతర వ్యవస్థలనూ మారుస్తున్నట్టు పరిశోధకులు గుర్తించారు. ఇలా అది క్యాన్సర్‌ కణాలు బలహీనమయ్యేలా చేస్తుందన్నమాట. కణితి సూక్ష్మవాతావరణం(టీఎంఈ)లో రోగనిరోధక కణాలతో పాటు వివిధ రకాల కణాలు కూడా ఉంటాయి. క్యాన్సర్‌ కణాల వృద్ధికి తోడ్పడే కారకాలూ ఉంటాయి. అయితే ఎన్‌ఎల్‌జీపీ.. క్యాన్సర్‌ కణాలను తుదముట్టించే టీ కణాలు బాగా వృద్ధి చెందేలా కణితి లోపల, చుట్టూ ఉండే సూక్ష్మ వాతావరణాన్ని మారుస్తున్నట్టు తేలింది. ఇలా అది కణితి పెరుగుదలను అడ్డుకుంటున్నట్టు గుర్తించారు. ీుఎలుకలపై చేసిన అధ్యయనంలో ప్రాథమిక ఫలితాలు ప్రోత్సాహకరంగా ఉన్నాయి. ఎలాంటి పెద్ద దుష్ప్రభావాలు లేకుండానే ఎన్‌ఎల్‌జీపీ క్యాన్సర్‌ కణాల వృద్ధిని అడ్డుకుంటున్నట్టు తేలింది'' అని సీఎన్‌సీఐకి చెందిన రతీంద్రనాథ్‌ బరాల్‌ తెలిపారు.
  • ===========================
 Visit my website at -> Dr.Seshagirirao.com/

05 July 2013

Creation of liver with Stemcells,మూలకణాలతో కాలేయం సృష్టి



  •  
టోక్యో: ప్రపంచంలోనే తొలిసారిగా మూలకణాలతో మానవ కాలేయ కణజాలాన్ని సృష్టించటంలో జపాన్‌ శాస్త్రవేత్తలు విజయం సాధించారు. కాలేయ దాతల కొరతను అధిగమించటానికి ఇది దారితీయగలదని భావిస్తున్నారు. హ్యూమన్‌ ఇండ్యూస్‌డ్‌ ప్లూరీపోటెంట్‌ స్టెమ్‌సెల్స్‌ (హైపీఎస్‌సీ) నుంచి రక్తనాళాలతో కూడిన, పూర్తిస్థాయిలో పనిచేసే మానవ కాలేయాన్ని సృష్టించొచ్చని యోకోహామా సిటీ విశ్వవిద్యాలయానికి చెందిన టకనోరీ టకేబే, హిడేకి టనిగుచి నిరూపించారు. అవయవాల వైఫల్యంతో బాధపడేవారికి అవయవ బుడిపెలను (ప్రాథమిక దశలోని అవయవాలు) మార్పిడి చేయటం ప్రత్యామ్నాయ విధానంగా ఉపయోగపడగలదని విజయవంతంగా ప్రదర్శించారు. సాధారణంగా కాలేయం ఏర్పడే తొలిదశలో కాలేయం మూలకణాలు.. పేగుల పైభాగం నుంచి విడిపోయి కాలేయం ఆకారంలో బుడిపెగా రూపుదిద్దుకుంటాయి. అనంతరం ఇందులో రక్తనాళాలు పుట్టుకొస్తాయి. దీని ఆధారంగానే పరిశోధకులు హైపీఎస్‌సీలతో కాలేయాన్ని సృష్టించారు. హైపీఎస్‌సీ కాలేయ బుడిపెను మార్పిడి చేసిన 48 గంటల్లోనే రక్తనాళాలతో కూడిన కాలేయ బుడిపెగా మారటం గమనార్హం. (Eenadu 05/July/2013)

  • =========================== 
Visit my website at -> Dr.Seshagirirao.com/

03 July 2013

HCMV is cause for Hypertension, హ్యూమన్‌ సైటోమెగాలోవైరస్‌ (హెచ్‌సీఎంవీ)అధికరక్తపోటుకు కారణమా?

updates for Hypertension : 

 
 
అధిక రక్తపోటుకు వైరస్సే కారణం?--Eeandu newspaper 16/08/2011

గట్టి ఆధారాలు సేకరించాం: చైనా శాస్త్రవేత్తలు--నలభై ఏళ్ల వయస్సు వారందరికీ తప్పదీ సమస్య--

వాషింగ్టన్‌: గుండె జబ్బులు, పక్షవాతానికి, మూత్రపిండాల వ్యాధికి దారితీస్తున్న అధిక రక్తపోటుకు కారణం సాధారణ వైరస్‌ అని తాజా పరిశోధనలో తేలింది. హ్యూమన్‌ సైటోమెగాలోవైరస్‌ (హెచ్‌సీఎంవీ)కు అధికరక్తపోటుకు మధ్య లంకెపై గట్టి ఆధారాలను సేకరించినట్లు చైనా వైద్యుల బృందం తెలిపింది. ఈ వైరస్‌.. ప్రపంచ వ్యాప్తంగా అందరిలోనూ సోకుతుంది. ఇది హెర్పెస్‌ వైరస్‌ కుటుంబానికి చెందింది. అన్ని వయస్సుల వారికీ సోకుతుంది. పుట్టుకతోవచ్చే ఇన్‌ఫెక్షన్లకు ఇది ప్రధాన కారణం. అవయవ మార్పిడి చేయించుకున్న రోగుల్లో తీవ్రమైన ఇన్‌ఫెక్షన్లను ఇది కలిగిస్తుంది. 40 ఏళ్లు వచ్చేసరికి దాదాపు అందరూ ఈ వైరస్‌ బారినపడతారు. అయితే చాలా మందిలో ఎలాంటి రోగలక్షణాలు కనిపించవు. ఒకసారి ఇది శరీరంలోకి ప్రవేశిస్తే.. ఇది శరీరంలోనే అచేతనంగా ఉంటుంది. శరీర రోగ నిరోధక వ్యవస్థ సామర్థ్యం తగ్గాక ఇది పునరుత్తేజం పొందుతుంది. తాజా పరిశోధన.. పెను మార్పులకు శ్రీకారం చుడుతుందని భావిస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) అంచనా ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 100 కోట్ల మంది అధికరక్తపోటుతో బాధపడుతున్నారు.

  • ====================

Visit my website at : Dr.Seshagirirao.com