14 September 2013

High blood gulucose increase alzheimer, గ్లూకోజు పెరిగితే అల్జీమర్స్‌ ముప్పు

  •  
  •  
 alzheimer's disease increase with high blood gulucose-గ్లూకోజు పెరిగితే అల్జీమర్స్‌ ముప్పు!
తీవ్ర మతిమరుపు, తికమక పడటం, ఏం చేస్తున్నామో, ఎందుకు చేస్తున్నామో తెలుసుకోలేకపోవటం.. ఇలాంటి లక్షణాలతోనే మొదలవుతుంది అల్జీమర్స్‌ వ్యాధి. ఇది వృద్ధాప్యంలో వచ్చేదే అయినా దీని బీజాలు మాత్రం చాలా ముందుగానే పడతాయి. అల్జీమర్స్‌కు వయసు, జన్యుపరమైన అంశాలు దోహదం చేస్తాయి. కానీ అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్‌, మధుమేహం కూడా దీని ముప్పును పెంచుతాయని పరిశోధకులు భావిస్తున్నారు. మధుమేహం మూలంగా అల్జీమర్స్‌ రావొచ్చని గత అధ్యయనాల్లోనూ తేలింది. అయితే మధుమేహం స్థాయిలో కాకపోయినా రక్తంలో గ్లూకోజు మోతాదు అధికంగా ఉండేవారికీ అల్జీమర్స్‌ ముప్పు పొంచి ఉంటున్నట్టు తాజాగా బయటపడింది. అరిజోనా విశ్వవిద్యాలయం పరిశోధకులు ఇటీవల ఒక అధ్యయనం చేశారు. మధుమేహం బారినపడని, గతంలో అల్జీమర్స్‌ బాధితుల కుటుంబాలకు చెందిన వారిని ఎంచుకొని పరీక్షించారు. వీరి మెదళ్లను స్కాన్‌ చేసి జీవక్రియ చర్య తీరుతెన్నులను పరిశీలించారు. సాధారణంగా అల్జీమర్స్‌ బాధితుల మెదళ్లలోని కొన్ని భాగాల్లో జీవక్రియ చర్య తగ్గిపోతుంటుంది. గ్లూకోజు మోతాదు ఎక్కువగా గలవారిలోనూ ఇలాంటి మార్పే కనబడినట్టు పరిశోధకులు గుర్తించారు. కాబట్టి మధుమేహం బారినపడకుండా జీవనశైలి మార్పులు చేసుకుంటే అల్జీమర్స్‌నూ దూరంగా ఉంచుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
  • ===========================
 Visit my website at -> Dr.Seshagirirao.com/

01 September 2013

perfluorinated chemicals bad to Thyroid,థైరాయిడ్‌కు పర్‌ఫ్లోరినేటెడ్‌ కెమికల్స్‌ ముప్పు

  •  




గొంతు ముందుభాగాన సీతాకోకచిలుక ఆకారంలో కరచుకొని ఉండే థైరాయిడ్‌ గ్రంథి స్రవించే థైరాక్సిన్‌ హార్మోన్‌ శరీరానికి ఎంతో అవసరం. ఇది శరీర ఎదుగుదలకు తోడ్పడటం దగ్గర్నుంచి గుండె వేగం, శరీర ఉష్ణోగ్రతలను నియంత్రణలో ఉంచటం వరకు చాలా పనులు చేస్తుంది. కణాల్లో శక్తి విడుదలయ్యే ప్రక్రియలోనూ పాలు పంచుకుంటుంది. అయితే ఇంతటి కీలకమైన థైరాయిడ్‌ గ్రంథికి మనం రోజూ వాడే కొన్ని వస్తువుల్లోని పర్‌ఫ్లోరినేటెడ్‌ కెమికల్స్‌ (పీఎఫ్‌సీ) హాని చేస్తున్నట్టు తాజా అధ్యయనంలో బయటపడింది. వస్త్రాలు, తివాచీలు, సౌందర్య సాధనాలు, కాగితాలపై పూసే పొరల తయారీలో ఈ పీఎఫ్‌సీలను ఉపయోగిస్తుంటారు. ఇవి శరీరంలోకి చేరుకుంటే ఒకపట్టాన జీర్ణం కావు. లోపల చాలాకాలం నిల్వ ఉండిపోతాయి. రక్తంలో పీఎఫ్‌సీల మోతాదులు ఎక్కువగా గలవారిలో థైరాయిడ్‌ పనితీరు దెబ్బతింటున్నట్టు తాజాగా బయటపడింది. ముఖ్యంగా వీటి మూలంగా మహిళల్లో థైరాయిడ్‌ హార్మోన్‌ ఉత్పత్తి తగ్గుతుండటం (హైపోథైరాయిడిజమ్‌) గమనార్హం. దీని మూలంగా నిస్సత్తువ, మానసిక కుంగుబాటు, బరువు పెరగటం, చర్మంతో పాటు వెంట్రుకలు పొడిబారటం, ఒళ్లు చల్లగా ఉన్నట్టు అనిపించటం, మలబద్ధకం, నెలసరి అస్తవ్యస్తం కావటం వంటి లక్షణాలు కనబడతాయి. రక్తంలో పీఎఫ్‌సీల మోతాదులకు థైరాయిడ్‌ పనితీరుకు మధ్య సంబంధం ఉంటున్నట్టు తేలటం ఇదే తొలిసారని సహ అధ్యయనకర్త డాక్టర్‌ చీన్‌-యు లిన్‌ పేర్కొంటున్నారు. ఈ పీఎఫ్‌సీలు దీర్ఘకాలం శరీరంలో ఉండిపోతాయి కాబట్టి వీటి విషయంలో జాగ్రత్తగా ఉండటం అవసరమని సూచిస్తున్నారు
  • =========================== 
Visit my website at -> Dr.Seshagirirao.com/

Sleep-apnia in Gestational Diabetes,గర్భిణి మధుమేహం-నిద్రలో శ్వాస సమస్య

  •  

  •  
 Sleep-apnia in Gestational Diabetes,గర్భిణి మధుమేహం-నిద్రలో శ్వాస సమస్య (1st .Sept.2013)

గర్భం దాల్చిన సమయంలో కొందరు స్త్రీలకు రక్తంలో గ్లూకోజు మోతాదు పెరుగుతుంటుంది. ముఖ్యంగా మూడో నెలలో ఈ సమస్య మొదలవుతుంది. కాన్పు తర్వాత గ్లూకోజు తిరిగి మామూలు స్థాయికి వస్తుంది. అయితే ఇలా గర్భిణి మధుమేహం బారినపడ్డవారికి నిద్రలో శ్వాస సమస్య (స్లీప్‌ అప్నియా) ముప్పు ఏడు రెట్లు ఎక్కువగా ఉంటున్నట్టు తాజాగా బయటపడింది. గర్భిణి మధుమేహం గలవారిలో 75% మంది స్లీప్‌ అప్నియాతోనూ బాధపడుతున్నట్టు షికాగోలోని రష్‌ విశ్వవిద్యాలయం పరిశోధకులు గుర్తించారు. స్లీప్‌ అప్నియా మూలంగా నిద్రలో శ్వాస సరిగా ఆడక తరచుగా మెలకువ వస్తూ.. ఇబ్బందికర పరిస్థితులు తలెత్తొచ్చు.
  • =========================== 
Visit my website at -> Dr.Seshagirirao.com/

Pancreas cancer with infection,ఇన్‌ఫెక్షన్లతో క్లోమ క్యాన్సర్‌

  •  
  •  

 Pancreas cancer with infection,ఇన్‌ఫెక్షన్లతో క్లోమ క్యాన్సర్‌ (1st sept.2013)

అన్ని క్యాన్సర్లలో క్లోమగ్రంథికి (పాంక్రియాస్‌కు) వచ్చే క్యాన్సర్‌ చాలా తీవ్రమైంది. దీనికి చికిత్స చేయటం కష్టం. అందువల్ల పాంక్రియాటిక్‌ క్యాన్సర్‌ బారినపడ్డవారిలో సుమారు 96% మంది మరణించే అవకాశముంది. నిజానికి ఇది రావటానికి ప్రధాన కారణమేంటో ఇప్పటికీ తెలియదు. పొగ తాగటం, వూబకాయం, మధుమేహం, మద్యం అలవాటు, దీర్ఘకాలం క్లోమం వాపు వంటివి దీనికి దారితీస్తాయి. తాజాగా పాంక్రియాటిక్‌ క్యాన్సర్‌లో బ్యాక్టీరియా ఇన్‌ఫెక్షన్లు.. ముఖ్యంగా పేగుల్లో, దంతాల్లో తలెత్తే ఇన్‌ఫెక్షన్ల పాత్రా ఉంటున్నట్టు బయటపడింది. జీర్ణాశయ క్యాన్సర్‌, పెప్టిక్‌ అల్సర్‌తో సంబంధం గల హెలికోబ్యాక్టర్‌ పైలోరీ.. దంతాలు, చిగుళ్లను దెబ్బతీసే పార్ఫీర్మోమోనస్‌ జింజివలిస్‌ బ్యాక్టీరియా ఇన్‌ఫెక్షన్లు గలవారికి పాంక్రియాటిక్‌ క్యాన్సర్‌ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటున్నట్టు తేలింది. ఈ ఇన్‌ఫెక్షన్లు శరీరమంతటా వాపును ప్రేరేపిస్తాయని, ఇది పాంక్రియాటిక్‌ క్యాన్సర్‌కు దోహదం చేస్తుండొచ్చని పరిశోధకులు అనుమానిస్తున్నారు. అంతేకాదు ఈ ఇన్‌ఫెక్షన్లు రోగనిరోధక వ్యవస్థలో మార్పులకూ దారితీస్తాయి. రోగనిరోధక వ్యవస్థ బలహీనమైతే శరీరం క్యాన్సర్‌ను సమర్థంగా ఎదుర్కోలేదు. ఇలాంటి పరిస్థితికి పొగ అలవాటు, వూబకాయం, మధుమేహం వంటి ముప్పు కారకాలూ తోడైతే.. రోగ నిరోధక ప్రతిస్పందన బలహీనపడి, మరిన్ని ఇన్‌ఫెక్షన్లూ దాడిచేస్తాయి. క్లోమగ్రంథిలో కణితి వృద్ధికి తోడ్పడే వ్యవస్థలనూ ఈ బ్యాక్టీరియా ఇన్‌ఫెక్షన్లు నేరుగా ప్రేరేపిస్తున్నాయని పరిశోధకులు భావిస్తున్నారు.

నిజానికి క్యాన్సర్లకూ ఇన్‌ఫెక్షన్లకూ సంబంధం ఉన్నట్టు గుర్తించటం కొత్త విషయమేమీ కాదు. హెపటైటిస్‌ బి, సి వైరస్‌ల మూలంగా కాలేయ క్యాన్సర్‌.. హ్యూమన్‌ పాపిలోమా వైరస్‌తో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌.. ఎప్‌స్త్టెన్‌-బార్‌ వైరస్‌తో ముక్కు, గొంతు పైభాగంలో క్యాన్సర్‌ వస్తున్నట్టు ఇప్పటికే తేలింది. అందువల్ల పాంక్రియాటిక్‌ క్యాన్సర్‌లో బ్యాక్టీరియా ఇన్‌ఫెక్షన్ల పాత్రను మరింత బాగా అర్థం చేసుకుంటే తొలిదశలోనే దీన్ని గుర్తించి, చికిత్స చేయటానికి అవకాశముంటుందని పరిశోధకులు ఆశిస్తున్నారు.
  • ===========================
 Visit my website at -> Dr.Seshagirirao.com/

IncreaseLongivity on stoping smoking,పొగమానేస్తే దీర్ఘాయుష్షు

  •  


  •  
పొగ తాగేవారికి జబ్బుల ముప్పు ఎక్కువ. ముఖ్యంగా గుండెజబ్బుల బారిన పడే అవకాశం మరీ అధికం. దీంతో ఆయుష్షు కూడా తగ్గుతుంది. అయితే మంచి విషయం ఏటంటే.. పొగ అలవాటును ఎప్పుడు మానేస్తే అప్పట్నుంచే దాని దుష్ప్రభావాలు తగ్గటం మొదలవుతాయి. గుండెజబ్బులు గలవారిపై ఇటీవల చేసిన అధ్యయనంలోనూ ఇది మరోసారి బయటపడింది. బెలూన్‌ యాంజియోప్లాస్టీ చేయించుకున్న తర్వాత సిగరెట్లు తాగటం మానేసినవారిలో గుండెకు రక్త సరఫరా మెరుగుపడుతోందని, ఫలితంగా రెండేళ్ల పాటు ఎక్కువగా బతుకుతున్నారని పరిశోధకులు గుర్తించారు. సగటున 50 ఏళ్ల వయసులో యాంజియోప్లాస్టీ చేయించుకున్నవారిపై అధ్యయనం చేసి ఈ విషయాన్ని కనుగొన్నారు. యాంజియోప్లాస్టీ అనంతరం ఏడాదిలోపు పొగ అలవాటు మానేసినవారు 18.5 ఏళ్ల పాటు జీవించగా.. పొగ మాననివారు 16.4 సంవత్సరాలు మాత్రమే జీవించినట్టు తేలింది. చాలామంది యువకులుగా ఉన్నప్పుడే పొగ అలవాటును ప్రారంభిస్తుంటారు. అది అలా అలా కొనసాగుతూనే వస్తుంది. మధ్యవయసులో మానేయమంటే 'ఇక ఇప్పుడేం మానేస్తాం. ఇప్పటికే చాలా ఆలస్యమైపోయింది' అని అంటుంటారు. కానీ పొగ ఎప్పుడు మానేసినా మంచి ఫలితాలే కనబడతాయనటానికి తాజా అధ్యయనమే నిదర్శనమని నెదర్లాండ్స్‌కు చెందిన పరిశోధకుడు రాన్‌ వ్యాన్‌ డాంబర్గ్‌ అంటున్నారు. ''మీ కోసం కాకపోయినా.. మీ మనవలు, మనవరాళ్ల కోసమైనా పొగ మానెయ్యండి. వాళ్లు మరో రెండేళ్లు అదనంగా తాతయ్యతో ఆనందంగా ఆడుకునే అవకాశం కల్పించినవారవుతారు'' అని సూచిస్తున్నారు.
  • =========================== 
Visit my website at -> Dr.Seshagirirao.com/

Usefull bacteria through Mother milk,తల్లిపాల ద్వారా మంచి బ్యాక్టీరియా

  •  

  •  
శిశువులకు తల్లిపాలు చేసే మేలు అంతా ఇంతా కాదు. ఇవి పిల్లలకు అవసరమైన పోషణ అందించటతో పాటు రోగనిరోధకశక్తిని పెంచి రకరకాల జబ్బుల బారినపడకుండానూ కాపాడతాయి. తల్లిపాలు చేసే మేలు గురించి ఇప్పుడు మరో కొత్త సంగతి బయటపడింది. ఇవి తల్లి నుంచి పిల్లలకు మంచి బ్యాక్టీరియానూ చేరవేస్తున్నట్టు వెల్లడైంది. తల్లిపాలలోని బ్యాక్టీరియా రకాలు.. తల్లీ శిశువుల మలంలోని బ్యాక్టీరియా రకాలు ఒకేరకంగా ఉంటున్నట్టు స్విట్జర్లాండ్‌ పరిశోధకులు గుర్తించారు. శిశువుల పేగుల్లో కీలకమైన పోషకాల సమతుల్యతకు ఈ బ్యాక్టీరియా దోహదం చేస్తుండొచ్చని పరిశోధకులు భావిస్తున్నారు. పేగుల్లో తలెత్తే సమస్యలను నివారించటానికి ఇది ఎంతగానో తోడ్పడుతుందని అనుకుంటున్నారు. ''తల్లి పేగుల్లోని బ్యాక్టీరియా తల్లిపాల నుంచి శిశువులకు చేరుకుంటున్నట్టు బయటపడటం చాలా ఆసక్తిని రేకెత్తించింది'' అని జ్యూరిచ్‌లోని ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ ఫుడ్‌, న్యూట్రిషన్‌ అండ్‌ హెల్త్‌కు చెందిన క్రిస్టోఫ్‌ లాక్రాయిక్స్‌ అంటున్నారు. శిశువుల పేగుల ఆరోగ్యం, రోగనిరోధక వ్యవస్థ బాగుండటానికి తల్లి, పిల్లల పేగుల్లోని మంచి బ్యాక్టీరియా చాలా కీలకమని చెబుతున్నారు. అయితే ఈ బ్యాక్టీరియా పేగుల్లోంచి తల్లి పాలలోకి ఎలా చేరుతోందనేది మాత్రం బయటపడలేదు. 

శిశువులను ఘనాహారానికి సన్నద్ధపరిచే తల్లిపాలు--తాజా అధ్యయనంలో వెల్లడి
వాషింగ్టన్‌: తల్లిపాల ద్వారా చిన్నారుల్లోకి ప్రవేశించే సూక్ష్మజీవులు వారికి మేలు చేస్తాయని తాజా అధ్యయనంలో తేలింది. ఘనాహారం తీసుకునేందుకు వీలుగా వారిని మరింత త్వరగా సంసిద్ధులు చేసేందుకు ఈ సూక్ష్మజీవులు తోడ్పడతాయని పేర్కొంది. శిశువులు జన్మించిన తొలినాళ్లలో తీసుకునే తల్లిపాలు.. పేగుల్లో ఉండే సూక్ష్మజీవుల రకాల విభిన్నత, స్థిరత్వంపై ప్రభావం చూపుతాయని ఉత్తర కరోలినా విశ్వవిద్యాలయం చేపట్టిన పరిశోధన వెల్లడించింది. తల్లిపాల నుంచి ఘనాహారానికి శిశువులు మారే సామర్థ్యాన్ని కూడా ప్రభావితం చేస్తాయంది. అదేవిధంగా దీర్ఘకాలంలోనూ వారి ఆరోగ్యపరిస్థితిపై ప్రభావం చూపుతాయని తెలిపింది------09/Feb/2015

  • ===========================
 Visit my website at -> Dr.Seshagirirao.com/