22 November 2013

Asprin taken night is good, ఆస్ప్రిన్‌ మాత్ర రాత్రిపూటే మేలు

  •  



 Asprin taken night is good, ఆస్ప్రిన్‌ మాత్ర రాత్రిపూటే మేలు

వాషింగ్టన్‌: గుండెజబ్బులు గలవారు ఉదయం పూట కన్నా రాత్రి నిద్రపోవటానికి ముందు ఆస్ప్రిన్‌ వేసుకోవటం మేలని పరిశోధకులు పేర్కొన్నారు. దీంతో గుండెపోటు ముప్పు తగ్గుతున్నట్టు తేలిందని వివరించారు. గుండెజబ్బు గలవారికి తక్కువ మోతాదులో ఆస్ప్రిన్‌ వేసుకోవాలని డాక్టర్లు సూచిస్తుంటారు. ఇది రక్తాన్ని పలుచబరుస్తుంది. రక్తం గడ్డ కట్టకుండా చూస్తుంది. ఆస్ప్రిన్‌ ఎప్పుడు వేసుకుంటే మేలనే దానిపై పరిశోధకులు ఇటీవల ఒక అధ్యయనం చేశారు. రాత్రిపూట ఆస్ప్రిన్‌ మాత్రలు వేసుకున్నవారి రక్తంలో ప్లేట్‌లెట్ల పనితీరు మందగించినట్టు గుర్తించినట్లు లీడెన్‌ విశ్వవిద్యాలయానికి చెందిన టోబియాస్‌ బోంటెన్‌ సూచించారు.

  • =========================== 
Visit my website at -> Dr.Seshagirirao.com/

Cautions before heart-attack,గుండెపోటుకు నెల ముందే హెచ్చరికలు

  •  

 Cautions before heart-attack,గుండెపోటుకు నెల ముందే హెచ్చరికలు

వాషింగ్టన్‌: హఠాత్తుగా గుండెపోటు (సడెన్‌ కార్డియాక్‌ అరెస్ట్‌) సంభవించటానికి నెల ముందు నుంచే శరీరం హెచ్చరికలు అందజేస్తుందని పరిశోధకులు తెలిపారు. గుండెలోని విద్యుత్‌ వ్యవస్థ విఫలం కావటం వల్ల గుండె పనిచేయటం ఆగిపోయి సడెన్‌ కార్డియాక్‌ అరెస్ట్‌కు దారితీస్తుంది. దీని బారినపడ్డ 53% మందిలో చాలాకాలం ముందు నుంచే ఛాతీనొప్పి వంటి లక్షణాలు కనిపిస్తున్నాయని పరిశోధకులు గుర్తించారు. వీరిలో 56% మందిలో ఛాతీనొప్పి, 13% మందిలో శ్వాస సరిగా తీసుకోలేకపోవటం, 4% మందిలో తలతిప్పు, వణుకు, గుండె వేగంగా కొట్టుకోవటం వంటివి ఉన్నట్టు కనుగొన్నారు. అందువల్ల ఛాతీనొప్పి, శ్వాసలో ఇబ్బంది వంటి లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే డాక్టర్‌ను సంప్రదించటం మేలని సీడర్‌-సినై హార్ట్‌ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన సుమీత్‌ చుగ్‌ తెలిపారు.

  • =========================== 
Visit my website at -> Dr.Seshagirirao.com/

15 November 2013

More coffee lessen lifespan,అతి కాఫీ..ఆయుక్షీణం

  •  
  •  More coffee lessen lifespan,అతి కాఫీ..ఆయుక్షీణం

వాషింగ్టన్‌: రోజుకు నాలుగు కప్పులకు మించి కాఫీ తాగితే ఆరోగ్యంపై దుష్ప్రభావం పడుతుందని తాజా అధ్యయనం ఒకటి గుర్తించింది. 55 ఏళ్లలోపు ఉన్నవారిలో రోజులో నాలుగు కంటే ఎక్కువ కప్పుల కాఫీ తాగే వారి ఆరోగ్యంపై ఎక్కువ ప్రభావం చూపుతుందని పరిశోధకులు గుర్తించారు. దక్షిణ కరోలినా విశ్వవిద్యాలయం ఈ అధ్యయనం చేసింది. ఈ అధ్యయనంలో 25 నుంచి 87 ఏళ్లలోపు వయసున్న దాదాపు 40 వేల మందిని 1978 నుంచి 1998 మధ్య పరిశీలించారు. ఈ అధ్యయనంలో అలవాట్లను, జీవనశైలిని గురించి పరిశోధించారు. కాఫీ అధికంగా తాగే అలవాటున్న వారు ధూమపానం చేసేందుకు ఎక్కువగా ఇష్టపడుతున్నారని గుర్తించారు. దీనివల్ల వారి గుండె సామర్థ్యంపై ప్రభావం చూపుతుంది. పరిశోధన జరుగుతున్న సమయంలో 2512 మంది చనిపోయారు. అన్ని రకాల కారణాలతో కలిపి ఈ ముప్పు 56% ఉందని పరిశోధకులు తేల్చారు.
  • =========================== 
Visit my website at -> Dr.Seshagirirao.com/

13 November 2013

New medicine for dimentia,మందమతికో 'ఐన్‌స్టీన్‌' పరీక్ష



వాషింగ్టన్‌: వృద్ధాప్యంలో రాబోయే మతిమరుపు (డైమెన్షియా) జబ్బును ముందుగానే గుర్తించగలిగేందుకు 'ఐన్‌స్టిన్‌' అనే చిన్న పరీక్ష ఎంతగానో దోహదపడుతుందని షికాగోకు చెందిన పరిశోధకులు అంటున్నారు. 40 నుంచి 65 ఏళ్ల ప్రాయంలో ఈ పరీక్ష ద్వారా ఈ వ్యాధి లక్షణాలను ముందే గుర్తించవచ్చట. ఇందుకోసం వీరికి ఆల్‌బర్ట్‌ ఐన్‌స్టీన్‌, బరాక్‌ ఒబామా, బిల్‌గేట్స్‌, ఓప్రా విన్‌ఫ్రే, ప్రిన్సెస్‌ డయాన, జాన్‌ ఎఫ్‌ కెన్నడీ, మార్టిన్‌ లూథర్‌ కింగ్‌ లాంటి 20 మంది ప్రముఖుల నలుపు తెలుపు చిత్రాలను ముద్రించి వారిని గుర్తించే పరీక్ష ఇది. 62ఏళ్ల ప్రాయంలో ఉన్నవారిపై ఈ పరీక్ష నిర్వహించి అధ్యయనం చేశారు. ఈ పరీక్ష కోసం మందమతి జబ్బు ఉన్నవారు ఆ చిత్రాల్లో ఉన్నవారి పేర్లు ఎంతమంది గుర్తు పడతారు, గుర్తు పట్టకపోతే, ఆ వ్యక్తులకు సంబంధించి వారికేం తెలుసో రాయమని చెప్పి పరిశీలించినట్లు షికాగోలోని నార్త్‌వెస్ట్‌ యూనివర్సిటీ ఫీన్‌బెర్గ్‌ స్కూల్‌ ఆఫ్‌ మెడిసిన్‌ పరిశోధకుడు టామర్‌ జెఫెన్‌ తెలిపారు. పేరు గుర్తించడంలో ఇబ్బంది పడ్డవారు ఎడమ టెంపోరల్‌ లోబ్‌లోని మెదడు కణజాలం కోల్పోయినట్లు, ముఖాలను గుర్తించడంలో ఇబ్బంది పడ్డవారిలో ఈ మెదడు కణజాలం రెండువైపులా కోల్పోయినట్లు ఎంఆర్‌ఐ స్కాన్‌లో గుర్తించామని, దీని ఆధారంగా ముందస్తుగానే ఈ జబ్బును కనుగొనగలమని తెలిపారు.=========================== Visit my website at -> Dr.Seshagirirao.com/ http://dr.seshagirirao.tripod.com/

Medicine to kill stomach cancer cells, జీర్ణాశయ క్యాన్సర్‌ కణాలను చంపే మందు



జీర్ణాశయ క్యాన్సర్‌ కణాలను సమర్థవంతంగా చంపే ఎల్‌ఎఫ్‌సిన్‌బీ25-ఆవు పాల నుంచి తీసిన ఎల్‌ఎఫ్‌సిన్‌బీ25 అనే పెప్త్టెడ్‌ జీర్ణాశయ క్యాన్సర్‌ కణాలను సమర్థవంతంగా చంపుతున్నట్టు తైవాన్‌ పరిశోధకుల అధ్యయనంలో బయటపడింది=========================== Visit my website at -> Dr.Seshagirirao.com/ http://dr.seshagirirao.tripod.com/

Eye fore-telling paralysis, పక్షవాతాన్ని పట్టిచ్చే కంటిపాప



వాషింగ్టన్‌ : అధిక రక్తపోటు వల్ల పక్షవాతం వచ్చే ప్రమాదం ఎక్కువని చెబుతుంటారు. అయితే ప్రతి రక్తపోటూ పక్షవాతానికి దారితీయకపోవచ్చు. కొన్నిరకాల అధిక రక్తపోటుకు మాత్రమే ఆ ప్రమాదం. ముఖ్యంగా కంట్లో 'హైపర్‌టెన్సివ్‌ రెటినోపతి' వంటి సమస్యలు కలిగించే రక్తపోటుతో ఈ ప్రమాదం ఎక్కువని చెబుతున్నారు సింగపూర్‌ జాతీయ విశ్వవిద్యాలయానికి చెందిన ఆచార్యుడు మొహమ్మద్‌ కమ్రాన్‌ ఇక్రామ్‌. అందుకు కంటిపాపను ముందుగానే ఛాయాచిత్రం తీయడం ఎంతగానో ఉపయోగపడుతుందనిఆయన అంటున్నారు. కంటిపాపలోని రెటినా మెదడులోని నరాల ఆరోగ్యాన్ని ఇట్టే పట్టిచ్చేస్తుందని ఆయన చెబుతున్నారు. కమ్రాన్‌ ఇక్రామ్‌ 13 ఏళ్లపాటు 2,907 మంది రోగులపై పరిశోధన చేశారు. ముందుగా వారి కంటిపాపలోని రెటినా ఛాయాచిత్రాలు తీసుకున్నారు. ఛాయాచిత్రాల ద్వారా 'హైపర్‌టెన్సివ్‌ రెటినోపతి'ని పసిగట్టిన రోగుల్లో పక్షవాతం వచ్చే ప్రమాదం 35 నుంచి 137 శాతం వరకు నమోదైందని ఇక్రామ్‌ చెబుతున్నారు.=========================== Visit my website at -> Dr.Seshagirirao.com/ http://dr.seshagirirao.tripod.com/

App.to break heart stroke, యాప్‌తో స్ట్రోక్‌కి బ్రేక్‌



మెల్బోర్న్‌: హృదయ స్పందనలో తేడాలను సకాలంలో గుర్తించి.. స్ట్రోక్‌ రాకుండా కాపాడే యాప్‌ను అభివృద్ధి చేశారు సిడ్నీ విశ్వవిద్యాలయ పరిశోధకులు. అలివ్‌కార్‌ హార్ట్‌ మానిటర్‌ పేరిట పిలిచే ఈ ఐఫోన్‌ యాప్‌ ఆట్రియల్‌(Atrial fibrillation) ఫిబ్రిల్లేషన్‌ (ఏఎఫ్‌)ను గుర్తిస్తుంది. దీనికి చికిత్స తీసుకుంటే స్ట్రోక్‌ రాకుండా జాగ్రత్తపడొచ్చు. ఏఎఫ్‌ అనేది వృద్ధుల్లో సాధారణంగా వచ్చే సమస్య. ఈ సమస్య కలిగిన వారిలో ప్రతి ముగ్గురిలో ఒకరికి స్ట్రోక్‌ వచ్చే అవకాశం ఉంటుంది.

=========================== Visit my website at -> Dr.Seshagirirao.com/ http://dr.seshagirirao.tripod.com/

Fish to cure joint pains,కీళ్ల నొప్పుల్ని తగ్గించే చేపలు





లండన్‌: చేపలు తినడం వల్ల దక్కే ప్రయోజనాల్లో మరొకటి వచ్చి చేరింది. సాల్మొన్‌ రకం చేపల్ని చేపల్ని కనీసం వారానికొకసారైనా తినడం వల్ల రుమటాయిడ్‌ ఆర్త్థ్రెటిస్‌ వంటి కీళ్లనొప్పుల ముప్పు సగందాకా తగ్గుతుందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. 32 వేల మందికిపైగా స్వీడన్‌ మహిళలపై చేపట్టిన అధ్యయనం ద్వారా ఈ విషయాన్ని తేల్చారు. స్వీడన్‌కు చెందిన కరోలిన్‌స్కా ఇనిస్టిట్యూట్‌కు చెందిన పరిశోధకుల బృందం 32 వేల మంది మహిళల ఆహార అలవాట్లను విశ్లేషించింది. ఒమెగా-3 కొవ్వు ఆమ్లాలను అధికంగా తీసుకున్న వారిలో కీళ్లనొప్పుల ముప్పు తక్కువగా ఉన్నట్లు తేల్చారు. సాల్మొన్‌, తాజా ట్యూనా వంటి చేపల్లో అధికంగా లభ్యమవుతుంది. రుమటాయిడ్‌ ఆర్థ్రైటిస్‌తో బాధపడుతున్న 27 శాతం మందిలో రోజుకు ఒమెగా-3 కొవ్వు ఆమ్లాలు తక్కువగా తీసుకుంటున్నట్లు గుర్తించారు. మొత్తానికి మహిళలు వారానికి ఒకసారైనా నూనెతో కూడిన చేపల్ని తినాలని పరిశోధకులు ప్రొఫెసర్‌ అలన్‌ సిల్మాన్‌ సూచిస్తున్నారు
=========================== Visit my website at -> Dr.Seshagirirao.com/ http://dr.seshagirirao.tripod.com/

pre-mature born baby suffer heart diseases, నెలలు నిండని బిడ్డలకు గుండె జబ్బు ముప్పు







వాషింగ్టన్‌: నెలలు నిండకుండానే జన్మించిన శిశువుల్లో గుండె నిర్మాణ సంబంధ లోపాలు తలెత్తే ప్రమాదం ఉందని తాజా అధ్యయనంలో తేలింది. ఇవి.. భవిష్యత్‌లో హృద్రోగాలకు దారితీయొచ్చని వెల్లడైంది. లండన్‌లోని ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయానికి చెందిన కార్డియోవాస్క్యులర్‌ క్లినికల్‌ రీసెర్చ్‌ ఫెసిలిటీకి చెందిన శాస్త్రవేత్తలు ఈ పరిశోధన నిర్వహించారు.

పరిశోధనలో భాగంగా శాస్త్రవేత్తలు.. నెలలు నిండని 102 మంది శిశువులను వారు జన్మించినప్పటి నుంచి 20లలోకి అడుగుపెట్టేవరకూ పరిశీలించారు. గర్భం దాల్చాక 37వ వారంలోగా పుట్టినవారిని ఈ తరగతి కిందకి వర్గీకరించారు. నెలలు నిండాక జన్మించిన 132 మందితో వీరిని పోల్చి చూశారు. నెలలు నిండకుండా పుట్టినవారి గుండెలోని కుడివైపు దిగువ విభాగం చాలా చిన్నగా, బరువుగా ఉన్నట్లు గుర్తించారు. వీటి గోడలు మందంగా ఉండి, తక్కువ పంపింగ్‌ సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయని తేల్చారు. శిశువు ఎంత ముందుగా పుడితే అంత ఎక్కువగా గుండెలోని ఈ భాగంపై ప్రభావం పడుతున్నట్లు ఇందులో వెల్లడైంది. నేటి యువతలో దాదాపు 10 శాతం మంది నెలలు నిండకుండానే జన్మించారని పరిశోధనకు నాయకత్వం వహించిన ప్రొఫెసర్‌ పాల్‌ లీసన్‌ తెలిపారు. 
=========================== Visit my website at -> Dr.Seshagirirao.com/ http://dr.seshagirirao.tripod.com/

Mother milk lessen obesity,తల్లిపాలతో వూబకాయం దూరం



టోక్యో: తల్లిపాలతో పెరిగిన పిల్లల్లో వూబకాయం ప్రమాదం తగ్గుతుందని జపాన్‌లో జరిగిన అధ్యయనం వెల్లడించింది. ఓకయోమ విశ్వవిద్యాలయానికి చెందిన

గ్రాడ్యుయేట్‌ స్కూల్‌ ఆఫ్‌ మెడిసిన్‌ అక్కడ 43,367 మంది పాఠశాల చిన్నారులపై అధ్యయనం చేసింది. వీరిలో ఆరు నుంచి ఏడు నెలల పాటు తల్లి పాలు

తాగిన పిల్లల్లో వూబకాయం ప్రమాదం చాలా తక్కువగా కనిపించిందట. సీసా పాలు తాగిన పిల్లల్లో మాత్రం వూబకాయం చాలా ఎక్కువగా కనిపించిందని

అధ్యయన బృందం తెలిపింది. పిల్లలు కంప్యూటర్‌, వీడియో గేమ్‌ ఆడే సమయాన్ని కూడా పరిగణనలోకి తీసుకుని ఈ అధ్యయనం చేశారు.

=========================== Visit my website at -> Dr.Seshagirirao.com/ http://dr.seshagirirao.tripod.com/

11 November 2013

Treatment for disease with patch,ప్యాచ్‌తో వ్యాధికి చికిత్స

  •  
  •  
లండన్‌: పలు అనారోగ్య సమస్యలకు చికిత్స అందించే విప్లవాత్మకమైన ప్యాచ్‌ను పరిశోధకులు రూపొందించారు. అధిక రక్తపోటు, గుండెపోటు, పక్షవాతం వంటి సమస్యలకు ఈ ప్యాచ్‌ చికిత్స అందజేస్తుంది. జపాన్‌ సంస్థ అభివృద్ధి చేసిన ఈ ప్యాచ్‌లో నుంచి ఔషధం నెమ్మదిగా చర్మం ద్వారా రక్తప్రసరణ వ్యవస్థలోకి కలుస్తుంటుంది. దీనిని బాధితులు భుజానికి, ఛాతీ, వీపు వద్ద అమర్చుకోవాల్సి ఉంటుంది. ప్రతిరోజూ మార్చుకోవాల్సి ఉంటుంది. ఓ బీటాబ్లాకర్‌ రకానికి చెందిన ఔషధం 'బైసోప్రొలాల్‌'ను క్రమబద్ధంగా అందజేస్తుంది. క్రమపద్ధతిలో నిరంతరంగా ఔషధం అందడం వల్ల గుండెపోటు, పక్షవాతం వంటి సమస్యలు తగ్గుతాయని పరిశోధకులు పేర్కొన్నారు. దీనిని ఉపయోగించేందుకు ఇప్పటికే జపాన్‌లో అనుమతి లభించగా, రెండుమూడేళ్లలో బ్రిటన్‌లోనూ అందుబాటులోకి రానుంది. ప్రతి ప్యాచ్‌లోనూ నాలుగు లేదా ఎనిమిది మిల్లీగ్రాముల మోతాదులో ఔషధం ఉంటుంది. అధిక రక్తపోటు, గుండెపోటు, గుండె వైఫల్యం, ఆందోళన, పార్శ్వనొప్పి వంటి వ్యాధుల్లో బీటా బ్లాకర్లను 50 ఏళ్లుగా వాడుతున్నారు. ఈ ప్యాచ్‌తో రక్తపోటు నియంత్రణ మెరుగవుతుందని వీటిని తయారు చేసిన జపాన్‌ సంస్థ నిటోడెంకో పేర్కొంది. ప్యాచ్‌ను ఉపయోగించినప్పుడు రక్తపోటు 24 గంటలపాటు స్థిరంగా ఉన్నట్లు క్లినికల్‌ ట్రయల్స్‌లో వెల్లడైంది.
===========================
 Visit my website at -> Dr.Seshagirirao.com/

10 November 2013

New treatment for Anxeity,ఆందోళనకు కొత్త చికిత్స

  •  


  •  
వాషింగ్టన్‌: ఆందోళన తదితర మానసిక రుగ్మతలకు సమర్థమైన రీతిలో కొత్త తరహా చికిత్స మార్గాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ బృందంలో భారత సంతతికి చెందిన శాస్త్రవేత్త పటేల్‌ కూడా ఉన్నారు. రసాయనాలతో మెరుగుపరిచిన కాక్స్‌-2 ఎంజైమ్‌ ఇన్‌హిబిటర్లు ఆందోళన లక్షణాల నుంచి ఉపశమనం కలిగిస్తాయని గుర్తించారు. సహజసిద్ధమైన ఎండోకానాబినాయిడ్స్‌ను ప్రేరేపించడం ద్వారా ఇవి ఉపశమనాన్ని కలుగజేస్తాయని పరిశోధకులు పేర్కొన్నారు. ఆందోళన, మానసిక రుగ్మతల చికిత్సల్లో ఇవి కొత్త తరహా పద్ధతులకు నాంది పలుకుతాయని భావిస్తున్నారు. వీటికి సంబంధించిన క్లినికల్‌ ట్రయల్స్‌ రాబోయే కొన్నేళ్లలో మొదలవుతాయని పరిశోధకులు లారెన్స్‌ మార్నెట్‌ పేర్కొన్నారు.

  • ===========================
 Visit my website at -> Dr.Seshagirirao.com/

New treatment for Anxeity,ఆందోళనకు కొత్త చికిత్స

  •  


  •  
వాషింగ్టన్‌: ఆందోళన తదితర మానసిక రుగ్మతలకు సమర్థమైన రీతిలో కొత్త తరహా చికిత్స మార్గాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ బృందంలో భారత సంతతికి చెందిన శాస్త్రవేత్త పటేల్‌ కూడా ఉన్నారు. రసాయనాలతో మెరుగుపరిచిన కాక్స్‌-2 ఎంజైమ్‌ ఇన్‌హిబిటర్లు ఆందోళన లక్షణాల నుంచి ఉపశమనం కలిగిస్తాయని గుర్తించారు. సహజసిద్ధమైన ఎండోకానాబినాయిడ్స్‌ను ప్రేరేపించడం ద్వారా ఇవి ఉపశమనాన్ని కలుగజేస్తాయని పరిశోధకులు పేర్కొన్నారు. ఆందోళన, మానసిక రుగ్మతల చికిత్సల్లో ఇవి కొత్త తరహా పద్ధతులకు నాంది పలుకుతాయని భావిస్తున్నారు. వీటికి సంబంధించిన క్లినికల్‌ ట్రయల్స్‌ రాబోయే కొన్నేళ్లలో మొదలవుతాయని పరిశోధకులు లారెన్స్‌ మార్నెట్‌ పేర్కొన్నారు.

  • ===========================
 Visit my website at -> Dr.Seshagirirao.com/

New treatment for Anxeity,ఆందోళనకు కొత్త చికిత్స

  •  


  •  
వాషింగ్టన్‌: ఆందోళన తదితర మానసిక రుగ్మతలకు సమర్థమైన రీతిలో కొత్త తరహా చికిత్స మార్గాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ బృందంలో భారత సంతతికి చెందిన శాస్త్రవేత్త పటేల్‌ కూడా ఉన్నారు. రసాయనాలతో మెరుగుపరిచిన కాక్స్‌-2 ఎంజైమ్‌ ఇన్‌హిబిటర్లు ఆందోళన లక్షణాల నుంచి ఉపశమనం కలిగిస్తాయని గుర్తించారు. సహజసిద్ధమైన ఎండోకానాబినాయిడ్స్‌ను ప్రేరేపించడం ద్వారా ఇవి ఉపశమనాన్ని కలుగజేస్తాయని పరిశోధకులు పేర్కొన్నారు. ఆందోళన, మానసిక రుగ్మతల చికిత్సల్లో ఇవి కొత్త తరహా పద్ధతులకు నాంది పలుకుతాయని భావిస్తున్నారు. వీటికి సంబంధించిన క్లినికల్‌ ట్రయల్స్‌ రాబోయే కొన్నేళ్లలో మొదలవుతాయని పరిశోధకులు లారెన్స్‌ మార్నెట్‌ పేర్కొన్నారు.

  • ===========================
 Visit my website at -> Dr.Seshagirirao.com/

New treatment for Anxeity,ఆందోళనకు కొత్త చికిత్స

  •  


  •  
వాషింగ్టన్‌: ఆందోళన తదితర మానసిక రుగ్మతలకు సమర్థమైన రీతిలో కొత్త తరహా చికిత్స మార్గాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ బృందంలో భారత సంతతికి చెందిన శాస్త్రవేత్త పటేల్‌ కూడా ఉన్నారు. రసాయనాలతో మెరుగుపరిచిన కాక్స్‌-2 ఎంజైమ్‌ ఇన్‌హిబిటర్లు ఆందోళన లక్షణాల నుంచి ఉపశమనం కలిగిస్తాయని గుర్తించారు. సహజసిద్ధమైన ఎండోకానాబినాయిడ్స్‌ను ప్రేరేపించడం ద్వారా ఇవి ఉపశమనాన్ని కలుగజేస్తాయని పరిశోధకులు పేర్కొన్నారు. ఆందోళన, మానసిక రుగ్మతల చికిత్సల్లో ఇవి కొత్త తరహా పద్ధతులకు నాంది పలుకుతాయని భావిస్తున్నారు. వీటికి సంబంధించిన క్లినికల్‌ ట్రయల్స్‌ రాబోయే కొన్నేళ్లలో మొదలవుతాయని పరిశోధకులు లారెన్స్‌ మార్నెట్‌ పేర్కొన్నారు.

  • ===========================
 Visit my website at -> Dr.Seshagirirao.com/

New treatment for Anxeity,ఆందోళనకు కొత్త చికిత్స

  •  


  •  
వాషింగ్టన్‌: ఆందోళన తదితర మానసిక రుగ్మతలకు సమర్థమైన రీతిలో కొత్త తరహా చికిత్స మార్గాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ బృందంలో భారత సంతతికి చెందిన శాస్త్రవేత్త పటేల్‌ కూడా ఉన్నారు. రసాయనాలతో మెరుగుపరిచిన కాక్స్‌-2 ఎంజైమ్‌ ఇన్‌హిబిటర్లు ఆందోళన లక్షణాల నుంచి ఉపశమనం కలిగిస్తాయని గుర్తించారు. సహజసిద్ధమైన ఎండోకానాబినాయిడ్స్‌ను ప్రేరేపించడం ద్వారా ఇవి ఉపశమనాన్ని కలుగజేస్తాయని పరిశోధకులు పేర్కొన్నారు. ఆందోళన, మానసిక రుగ్మతల చికిత్సల్లో ఇవి కొత్త తరహా పద్ధతులకు నాంది పలుకుతాయని భావిస్తున్నారు. వీటికి సంబంధించిన క్లినికల్‌ ట్రయల్స్‌ రాబోయే కొన్నేళ్లలో మొదలవుతాయని పరిశోధకులు లారెన్స్‌ మార్నెట్‌ పేర్కొన్నారు.

  • ===========================
 Visit my website at -> Dr.Seshagirirao.com/

07 November 2013

Early sleeping in children is a solution,త్వరగా నిద్రపోవడం పిల్లల్లో వూబకాయానికి పరిష్కారం

  •  

  •  
వాషింగ్టన్‌: త్వరగా నిద్రపుచ్చడం వల్ల పిల్లల్లో వూబకాయం సమస్య తగ్గుతుందని తాజా పరిశోధనల్లో తేలింది. వూబకాయులైన చిన్నారులకు పెందలాడే నిద్రపోవడం అలవాటు చేస్తే....సత్ఫలితాలు కనిపించినట్లు వారు తెలిపారు. పిల్లల ఆహారపుటలవాట్లపై నిద్రవేళల ప్రభావం అధికంగా ఉన్నట్లు తేలింది. పరిశోధకులు తమ అధ్యయనం నిమిత్తం 8-11 సంవత్సరాల వయసు పిల్లలను ఎంపిక చేసుకున్నారు. ఇందులో అధికబరువున్న వారూ ఉన్నారు. వీరిని మొదట వారం రోజుల పాటు వారెలాంటి సమయాల్లో నిద్రపోతారో అదే వేళలను పాటించారు. ఆ తర్వాత రెండోవారంలో వారి నిద్రవేళలను కాస్త పెంచారు. దీంతో, వారి ఆహారం స్వీకరించే తీరులో తేడా కనిపించింది. ఆకలికి కారణమయ్యే 'లెప్టిన్‌' స్థాయులూ తగ్గినట్లు తేలింది.

  • ===========================
 Visit my website at -> Dr.Seshagirirao.com/

New medicine for Lung cancer,వూపిరితిత్తుల క్యాన్సర్‌ చికిత్సకు కొత్త ఔషధం

  •  
  •  
లాస్‌ఏంజెల్స్‌: చర్మసంబంధ క్యాన్సర్‌ వైద్యానికి ఉపయోగిస్తున్న ఓ ప్రయోగాత్మ ఔషధాన్ని వూపిరితిత్తుల క్యాన్సర్‌ చికిత్సలోనూ వాడొచ్చని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఎం.కె.3475గా వ్యవహరించే ఈ కొత్త ఔషధానికి సంబంధించిన పరిశోధనల ప్రాథమిక ఫలితాలను కాలిఫోర్నియా విశ్వవిద్యాలయ ఛాతీక్యాన్సర్‌ అధ్యయన విభాగ సంచాలకుడు ఎడ్వర్డ్‌ గారన్‌ వెల్లడించారు. ప్రాథమిక ఫలితాలను ఆధారంగా చేసుకుని మెరుగైన ఫలితాల కోసం మందు మోతాదు మార్చి పరిశోధనలు కొనసాగించేందుకు వీరు సిద్ధమవుతున్నారు.

  • =========================== 
Visit my website at -> Dr.Seshagirirao.com/

patch to Support to heart muscle,దెబ్బతిన్న గుండెకు పట్టీ అండ




వాషింగ్టన్‌: దెబ్బతిన్న గుండె కండరం వేగంగా కోలుకోవటానికి తోడ్పడే కొత్తరకం పట్టీని పరిశోధకులు సృష్టించారు. కండరాల్లో ఉండే ప్రోటీన్‌(కొలాజెన్‌)ను మార్పుచేసి కూర్చి దీనిని తయారుచేశారు. గుండె కండరం మీద అతికిస్తే దెబ్బతిన్న భాగం త్వరగా బాగవటానికిది తోడ్పడుతుంది. మన గుండె కండరం దెబ్బతింటే దానికి త్వరగా కోలుకునే సామర్థ్యం లేదు. అందువల్ల ఈ ప్రక్రియను ప్రోత్సహించటంపై పరిశోధకులు దృష్టి పెట్టారు. ఆ ప్రయత్నంలో భాగంగానే స్టాన్‌ఫోర్డ్‌ విశ్వవిద్యాలయం, ల్యూసైల్‌ పకార్డ్‌ చిల్డ్రన్స్‌ హాస్పిటల్‌ పరిశోధకులు మార్పుచేసిన కొలాజెన్‌తో కూడిన కొత్తరకం పట్టీని రూపొందించారు. దీన్ని ఎలుకల్లో దెబ్బతిన్న గుండె కండరంపై అతికించగా.. కొత్త కణాల పుట్టుక పుంజుకోవటమే కాదు, దెబ్బతిన్న భాగంలో రక్తనాళాలు కూడా పుట్టుకొచ్చినట్టు తేలింది. ఈ పట్టీ గుండె కండరంలో చనిపోయిన కణాల స్థానాన్ని భర్తీ చేయటానికి బదులు.. గుండె కణజాలం పైపొర స్థానాన్ని ఆక్రమిస్తుంది. కండర కణజాలం కాకపోయినప్పటికీ ఈ పొర గుండె కండరానికి దన్నుగా నిలుస్తుంది. దాన్ని కాపాడుతుంది.

  • =========================== 
Visit my website at -> Dr.Seshagirirao.com/

increase lifespan with gene change ,జన్యుమార్పుతో 20 శాతం అధిక ఆయుష్షు

  •  


  •  
వాషింగ్టన్‌ : జన్యుమార్పుతో మానవుల ఆయుష్షును పెంచుకోవడం సాధ్యమేనని చెబుతున్నారు అమెరికా నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్స్‌ ఆఫ్‌ హెల్త్‌కి చెందిన పరిశోధకులు. ఆ లక్ష్యంగా సాగిన తమ పరిశోధనలతో చిట్టెలుక ఆయుష్షును 20 శాతం పెంచామని అంటున్నారు. ఈ ప్రయోగం మానవుల్లోనూ విజయవంతమైతే మామూలు కన్నా 16 ఏళ్లపాటు ఆయుష్షు పెరగవచ్చని చెబుతున్నారు. ముందుగా శాస్త్రవేత్తలు చిట్టెలుక జీవక్రియకు తోడ్పడే 'ఎం-టీఓఆర్‌' అనే జన్యువు 'వ్యక్తీకరణను' తగ్గించి దాని శక్తిని మందగించారు. మామూలు ఆడచిట్టెలుకలు 26.5 నెలలు జీవిస్తే.. జన్యుమార్పిడికి లోనైనవి 31.5 నెలలు జీవించాయట. వృద్ధాప్యంలోనూ మిగతావాటికంటే ఎక్కువ మేధస్సుతో, చురుగ్గానే ఉన్నాయట. అయితే.. జన్యుమార్పిడితో సమస్యలు లేకపోలేదు. సాధారణ చిట్టెలుకలకంటే వీటి ఆకారం కొద్దిగా చిన్నగానే ఉందట. వృద్ధాప్యంలో మేధోపరంగా మంచి చురుకుదనం ఉన్నా.. వీటి ఎముకలు తొందరగా క్షీణించాయని పరిశోధకులు చెబుతున్నారు.

  • =========================== 
Visit my website at -> Dr.Seshagirirao.com/

poverty may decrease intellicence,పేదరికం మేధోసామర్థ్యాన్ని తగ్గిస్తుంది

  •  
  •  
భారత్‌, అమెరికా అధ్యయనంలో వెల్లడి--
వాషింగ్టన్‌: సొమ్ములు తక్కువగా ఉంటే మేధోసామర్థ్యం కూడా తగ్గిపోతుందని తాజా అధ్యయనం చెబుతోంది. న్యూజెర్సీలోని ఓ షాపింగ్‌ మాల్‌కి వచ్చేవారు, భారత్‌లోని రైతులపై నిర్వహించిన ఓ సర్వేలో ఈ విషయం వెల్లడైనట్లు అంతర్జాతీయ పరిశోధక బృందం తెలిపింది. ఆర్థిక ఒత్తిడి వల్ల ఆలోచనలు నెమ్మదిస్తాయని చివరికి నిద్రలేని రాత్రులు గడుపుతుంటారని చెప్పింది. ''మా పరిశోధన పేదరికం గురించి కాదు. అనుకున్న లక్ష్యాలు చేరుకోవడంలో ప్రజలు ఎంత ఆందోళన చెందుతున్నారనేది'' అని హార్వర్డ్‌ ఆర్థికవేత్త, పరిశోధక బృందం సభ్యుడు సెంథిల్‌ ముల్త్లెనాథన్‌ తెలిపారు. ఆర్థిక ఒత్తిడిలో ఉన్న వారు సొమ్ములు లేవన్న బాధతో ఉంటారని భావించాం.. కానీ వారిలో మేధో సామర్థ్యం తగ్గడం గుర్తించాం అని ఆయన వివరించారు. గడువు దాటిన చెల్లింపులు, అద్దె, రుణాలు వంటి వాటి గురించి అదే పనిగా ఆలోచించే వారి ఆలోచనలు ఇతర అంశాల మీదకు మళ్లుతున్నాయన్నారు. అధ్యయనంలో వేర్వేరు అంశాలపై వీరి ఐక్యూ పరీక్షించగా 13గా తేలిందని యూనివర్సిటీ ఆఫ్‌ కొలంబియా ప్రొఫెసర్‌ జియెంగ్‌ జావో తెలిపారు. అధ్యయనంలో భాగంగా సెంట్రల్‌ న్యూజెర్సీలోని క్వాకెర్‌ బ్రిడ్జ్‌ మాల్‌లో 400 మంది వినియోగదారులు, భారత్‌లోని 464 మంది చెరకు రైతులను పరిశీలించారు. ''న్యూజెర్సీలో 20వేల డాలర్లు ఆర్జించేవారిని 70వేల డాలర్లు ఆర్జించేవారితో పోల్చితే కారు మరమ్మత్తు బిల్లు చెల్లించడానికి పేద వర్గాలు ఎంతో ఆందోళన వ్యక్తంచేశాయి. భారత్‌లోని చెరకు రైతులు పంట వేయక ముందు పేదలుగా చేతికొచ్చాక ధనవంతులుగా భావించారు'' అని అధ్యయనంలో గుర్తించినట్లు జియెంగ్‌ పేర్కొన్నారు.

  • =========================== 
Visit my website at -> Dr.Seshagirirao.com/

Second language is good at older age,రెండోభాష... మలిదశలోనే మేలు!

  •  


  •  
టొరంటో : పిల్లలకు మాతృభాష కాకుండా రెండో భాషను శైశవదశలో కంటే మలిబాల్యదశలో నేర్పించడం మంచిదని కెనడా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇది వారి మేధోశక్తిని పెంచుతుందని... ఇందుకు అనుగుణంగా వారి మెదడు నిర్మాణం కూడా మారుతుందని వివరిస్తున్నారు. కెనడా మాంట్రియల్‌లోని న్యూరోలాజికల్‌ ఇన్‌స్టిట్యూట్‌ అండ్‌ హాస్పిటల్‌, మెక్‌గిల్‌ విశ్వవిద్యాలయంలోని ది న్యూరో, ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు సంయుక్తంగా ఈ అధ్యయనం చేశారు. రెండు భాషలు నేర్చిన 66 మంది, ఒక్క భాష మాత్రమే తెలిసిన 22 మంది మెదడును ఎంఆర్‌ఐ స్కాన్‌ తీశారు. వాటిని విశ్లేషించేందుకు 'ది న్యూరో' సంస్థ రూపొందించిన సరికొత్త సాఫ్ట్‌వేర్‌ వాడారు. మొదట మాతృభాష నేర్చుకుని.. కొన్నేళ్ల తర్వాత ఇతర భాషలు నేర్చుకున్న పిల్లల మెదడులోని ఎడమపక్క ఇన్‌ఫీరియర్‌ ఫ్రంటల్‌ కార్టెక్స్‌ దళసరిగా మారడం గమనించారట. కుడిపక్క కార్టెక్స్‌ పలుచనవడం చూశారట. ఇటువంటి 'నిర్మాణం' పిల్లల్లో ఒకేసారి విభిన్నపనులు చేయగల సామర్థ్యం పెంచుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.


  • ===========================
 Visit my website at -> Dr.Seshagirirao.com/