ఆరోగ్యకరమైన వ్యక్తిలో రాబోయే మూడేళ్లలో స్వల్పస్థాయిలో మెదడుపరమైన క్షీణతగానీ, అల్జీమర్స్ వ్యాధిగానీ తలెత్తే అవకాశాన్ని అంచనా వేసే సాధారణ రక్తపరీక్షను శాస్త్రవేత్తలు రూపొందించారు. ఈ రక్తపరీక్ష 10 రకాల కొవ్వులను గుర్తించి, విశ్లేషించడం ద్వారా అల్జీమర్స్ వచ్చే అవకాశాల్ని అంచనా వేస్తుంది. రెండేళ్లలో ఈ పరీక్ష అందరూ ఉపయోగించుకునే స్థాయిలో అందుబాటులోకి వస్తుందని జార్జిటౌన్ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ హోవార్డ్ ఫెడెరాఫ్ పేర్కొన్నారు. ముందస్తుగానే వ్యాధిని గుర్తించడం వల్ల సరైన సమయంలో దానిని ఎదుర్కొనే అవకాశం కలుగుతుందన్నారు. తమ అధ్యయనంలో భాగంగా.. ఐదేళ్లపాటు 525 మంది ఆరోగ్యకరమైన వాలంటీర్లపై పరిశోధన చేపట్టినట్లు వివరించారు.
- ===========================
Visit my website at ->
Dr.Seshagirirao.com/
No comments:
Post a Comment
Thanks for your Comment . Your feedback is important for improvement of this blog.