19 November 2014

Less sleep leads to more obesity,నిద్రలేమి బరువు ముప్పు

  •  


Less sleep leads to more obesity,నిద్రలేమి బరువు ముప్పు

ఎదిగే వయసులో తగినంత నిద్ర తప్పనిసరి. లేకపోతే ఇది చదువుల పైనా ప్రభావం చూపుతుంది. ఇది మున్ముందు వూబకాయం బారిన పడకుండా కూడా కాపాడుతున్నట్టు తాజాగా బయటపడింది. రాత్రిపూట తగినంత సేపు నిద్రపోని యుక్తవయసు పిల్లలకు వూబకాయం ముప్పు పెరుగుతున్నట్టు తేలింది. ఇటీవల పరిశోధకులు సుమారు 10వేల మంది నుంచి సేకరించిన సమాచారాన్ని విశ్లేషించారు. 16 ఏళ్ల వయసులో ఉండగా వీరిలో ప్రతి ఐదుగురిలో ఒకరు రాత్రిపూట 6 గంటల కన్నా తక్కువసేపు నిద్రపోయినట్టు గుర్తించారు. రాత్రిపూట 8 గంటల కన్నా ఎక్కువసేపు నిద్రపోయినవారితో పోలిస్తే.. వీరికి వూబకాయం ముప్పు 20% ఎక్కువగా ఉంటున్నట్లు, అదీ 21 ఏళ్లు వచ్చేసరికే దీని ప్రభావం కనబడుతున్నట్టు తేలింది. ''యుక్తవయసులో తగినంత నిద్రపోకపోతే మున్ముందు వూబకాయం బారినపడే అవకాశముంది. ఒకసారిబకాయులైతే ఆ తర్వాత బరువు తగ్గించుకోవటం చాలా కష్టమవుతుంది. ఇది గుండెజబ్బు, మధుమేహం, క్యాన్సర్‌ వంటి సమస్యలకూ దారితీస్తుంది'' అని అధ్యయన నేత, కొలంబియా విశ్వవిద్యాలయానికి చెందిన షకీరా సుగిలా హెచ్చరిస్తున్నారు. తల్లిదండ్రులు కూడా ఈ విషయాన్ని గుర్తించి పిల్లలు రాత్రిపూట 8 గంటల కన్నా ఎక్కవసేపు నిద్రపోయేలా జాగ్రత్త తీసుకోవాలని సూచిస్తున్నారు. ఇది చదువులో రాణించటానికే కాదు. పెద్దయ్యాక ఆరోగ్యవంతులుగా ఉండటానికీ తోడ్పడుతుందని వివరిస్తున్నారు. యుక్తవయసు పిల్లలకు రాత్రిపూట దాదాపు 10 గంటల నిద్ర అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. నిద్రలేమితో సతమతమయ్యేవారు కేలరీలు అధికంగా ఉండే ఫాస్ట్‌ఫుడ్‌లను ఎక్కువగా ఇష్టపడుతుంటారు. ఇలాంటి ఆహార అలవాట్లు బరువు పెరగటానికి దోహదం చేసేవే కావటం గమనార్హం.

బకాయులైతే ఆ తర్వాత బరువు తగ్గించుకోవటం చాలా కష్టమవుతుంది. ఇది గుండెజబ్బు, మధుమేహం, క్యాన్సర్‌ వంటి సమస్యలకూ దారితీస్తుంది'' అని అధ్యయన నేత, కొలంబియా విశ్వవిద్యాలయానికి చెందిన షకీరా సుగిలా హెచ్చరిస్తున్నారు. తల్లిదండ్రులు కూడా ఈ విషయాన్ని గుర్తించి పిల్లలు రాత్రిపూట 8 గంటల కన్నా ఎక్కవసేపు నిద్రపోయేలా జాగ్రత్త తీసుకోవాలని సూచిస్తున్నారు. ఇది చదువులో రాణించటానికే కాదు. పెద్దయ్యాక ఆరోగ్యవంతులుగా ఉండటానికీ తోడ్పడుతుందని వివరిస్తున్నారు. యుక్తవయసు పిల్లలకు రాత్రిపూట దాదాపు 10 గంటల నిద్ర అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. నిద్రలేమితో సతమతమయ్యేవారు కేలరీలు అధికంగా ఉండే ఫాస్ట్‌ఫుడ్‌లను ఎక్కువగా ఇష్టపడుతుంటారు. ఇలాంటి ఆహార అలవాట్లు బరువు పెరగటానికి దోహదం చేసేవే కావటం గమనార్హం.

వేపుళ్లతో గర్భిణి మధుమేహం ,Gestational Diabetes with Fried foods

  •  

  • వేపుళ్లతో గర్భిణి మధుమేహం ,Gestational Diabetes with Fried foods

గర్భధారణకు ప్రయత్నిస్తున్నారా? అయితే వేపుళ్లను తినకుండా చూసుకోండి. ఇలాంటి తిండితో గర్భిణి మధుమేహం (జెస్టేషనల్‌ డయాబెటీస్‌) ముప్పు పెరుగుతోందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. గర్భధారణకు ముందు అధికంగా తిన్న మహిళలకు గర్భిణి మధుమేహం ముప్పు 13 రెట్లు ఎక్కువగా ఉంటున్నట్టు తాజా అధ్యయనంలో తేలింది మరి. వారానికి 4-6 సార్లు వేపుళ్లను తినేవారికి ఈ ముప్పు 31% అధికంగా ఉంటుండగా.. 7, అంతకన్నా ఎక్కువసార్లు తినేవారికైతే రెండింతలు ఎక్కువగా ముప్పు పొంచి ఉంటుండటం గమనార్హం. శరీర బరువు, ఎత్తుల నిష్పత్తిని (బాడీమాస్‌ ఇండెక్స్‌) పరిగణనలోకి తీసుకొని చూసినా వేపుళ్లను తినేవారికి గర్భిణి మధుమేహం వచ్చే అవకాశం అధికంగానే ఉంటోందని.. ఇలాంటి ఆహారాన్ని ఇంట్లో వండుకొని తినేవారి కన్నా హోటళ్లలో తినేవారికి ముప్పు మరింత పెరుగుతోందని పరిశోధకులు చెబుతున్నారు. వేపుళ్లు తినటాన్ని అదుపు చేస్తే జెస్టేషనల్‌ డయాబెటీస్‌ ముప్పు తగ్గటానికి తోడ్పడగలదని సూచిస్తున్నారు. కాబట్టి వేపుళ్ల విషయంలో కాస్త జాగ్రత్త గా ఉండటం మంచిది.

Atopic dermatitis treatment with vit.D,అటోపిక్‌ డెర్మటైటిస్‌ (ఎగ్జిమా) విటన్‌'D'తో చికిత్స .

  •  

  • Atopic dermatitis treatment with vit.D,అటోపిక్‌ డెర్మటైటిస్‌ (ఎగ్జిమా) విటన్‌'D'తో చికిత్స .

అటోపిక్‌ డెర్మటైటిస్‌ (ఎగ్జిమా) దీర్ఘకాలం వేధించే సమస్య. ఇది పిల్లల్లో ఎక్కువ. ఒళ్లంతా ఎర్రటి దద్దు, దురదతో బాధపెట్టే ఈ సమస్య చలికాలంలో మరింత ఉద్ధృతం అవుతుంటుంది కూడా. ఇలాంటి పిల్లలకు విటమిన్‌ డి మేలు చేస్తున్నట్టు, ఎగ్జిమా లక్షణాలను గణనీయంగా తగ్గిస్తున్నట్టు తాజాగా బయట పడింది. సాధారణంగా అటోపిక్‌ డెర్మటైటిస్‌కు అల్ట్రావయొలెట్‌ (యూవీ) కాంతి చికిత్స కూడా చేస్తుంటారు. ఇది చర్మంలో విటమిన్‌ డి ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని చలికాలంలో ఎగ్జిమా ఉద్ధృతం కావటానికీ విటమిన్‌ డి లోపానికీ సంబంధం ఉండొచ్చనే అనుమానంతో పరిశోధకులు ఇటీవల మంగోలియాలో ఒక అధ్యయనం చేశారు. ఆ దేశంలో పిల్లల్లో విటమిన్‌ డి లోపం అధికం. కాబట్టి అటోపిక్‌ డెర్మటైటిస్‌తో బాధపడుతున్న 2-17 ఏళ్ల పిల్లలను ఎంచుకొని.. వీరిలో కొందరికి రోజుకి 1,000 ఐయూ మోతాదులో విటమిన్‌ డి మాత్రలను, మరికొందరికి ఎలాంటి మందులేని మాత్రలను (ప్లాసిబో) ఇచ్చారు. నెల తర్వాత పరిశీలించగా.. విటమిన్‌ డి మాత్రలను వేసుకున్నవారిలో 29% మందిలో అటోపిక్‌ డెర్మటైటిస్‌ లక్షణాలు మెరుగుపడినట్టు తేలింది. అందువల్ల పిల్లల్లో చలికాలంలో అటోపిక్‌ డెర్మటైటిస్‌ లక్షణాలు తీవ్రమవుతుంటే కొన్ని వారాల పాటు విటమిన్‌ డి మాత్రలను ఇచ్చి చూసి, ఫలితాలు బాగుంటే మరికొంత కాలం కొనసాగించటం మేలని పరిశోధకులు సూచిస్తున్నారు.

16 November 2014

Running is better than walking?, నడవడం కంటే పరుగు మంచి వ్యాయామమా?

  •  

  •  
Running is better than walking?, నడవడం కంటే పరుగు మంచి వ్యాయామమా?

ఆరోగ్యానికి వ్యాయామం మంచిదని తెలిసిందే. అందుకే చాలామంది ఉదయమో, సాయంత్రమో నడవడం అలవాటు చేసుకున్నారు. అయితే దైనందిన వ్యాయామంతోపాటు వారానికి ఐదురోజులపాటు రోజుకి ఐదు నిమిషాల చొప్పున పరిగెత్తితే ఇంకా ఎక్కువ ఫలితం ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. వూబకాయం, మధుమేహం, హృద్రోగాలు, బీపీ, పక్షవాతం, క్యాన్సర్‌... వంటి వాటిని నియంత్రించవచ్చంటున్నారు.
* పరుగువల్ల ఎండొకెనాబినాయిడ్లు అనే హార్మోన్లు విడుదలవడంతో ఆనందం లభిస్తుందని పరిశోధనలో తేలింది.
* పరిగెత్తితే మోకాళ్ల పనితీరు మరింత మెరుగవుతుంది. ఉదాహరణకు పరుగు ఆపాక కూడా చాలామంది అథ్లెట్లను పరిశీలిస్తే వాళ్లలో ఆస్టియో ఆర్త్థ్రెటిస్‌ రావడం తక్కువని తేలింది.
* రోజూ ఐదు నిమిషాలు పరిగెత్తడంవల్ల జీవితకాలం కనీసం ఓ ఐదేళ్లు పెరుగుతుందన్నది మరో కొత్త పరిశోధన. తెలిసిందిగా మరి... పరిగెత్తండి!

Bacteria is cause for Obesity?,వూబకాయం కు బ్యాక్టీరియానే కారణమం?

  •  


Bacteria is cause for Obesity?,వూబకాయం కు బ్యాక్టీరియానే కారణమం?

తగిన వ్యాయామం లేకపోవడం, అతిగా తినడం... వల్ల బరువు పెరగడం సాధారణం. అయితే కొందరు అసలేం తినకున్నా కొంచెం తిన్నా వూబకాయంతో బాధపడుతుంటారు. అందుకే దీనిగురించి నిరంతరం పరిశోధనలు చేస్తూనే ఉన్నారు నిపుణులు. ఇటీవల లండన్‌లోని కింగ్స్‌ కాలేజ్‌కి చెందిన 'డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ట్విన్‌ రిసెర్చ్‌' చేసిన ఓ పరిశోధనలో ఓ కొత్తవిషయం తెలిసింది. తక్కువ బరువున్నవారి పొట్టలో క్రిస్టెన్‌సెనెల్లేసే కుటుంబానికి చెందిన ఒక రకమైన బ్యాక్టీరియా ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. ఈ బ్యాక్టీరియా తక్కువగా ఉన్నవాళ్లు ఎక్కువ బరువున్నట్లు తెలిసింది. దీన్నిబట్టి ఈ బ్యాక్టీరియా ఎంత ఎక్కువ ఉంటే వాళ్లు అంత సన్నగా ఉంటారని తేలింది. అయితే బ్యాక్టీరియా ఎక్కువ ఉండటం, తక్కువ ఉండటం అనేది మాత్రం జన్యుప్రభావమే. అంటే అది వంశపారంపర్యంగానే సంక్రమిస్తుంది. అయినప్పటికీ ఈ బ్యాక్టీరియాను కొన్ని ఎలుకల పొట్టలోకి ఇంజెక్ట్‌ చేయగా అవి సన్నబడ్డాయట. దాంతో ఈ పరిశో ధన ఆధారంగా వూబకాయాన్ని నిరోధించే కొత్త చికిత్సావిధానాలమీద దృష్టిపెట్టబోతున్నారు పరిశోధకులు.

New treatment for Anxeity,ఆందోళనకు కొత్త చికిత్స

  •  


  •  
వాషింగ్టన్‌: ఆందోళన తదితర మానసిక రుగ్మతలకు సమర్థమైన రీతిలో కొత్త తరహా చికిత్స మార్గాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ బృందంలో భారత సంతతికి చెందిన శాస్త్రవేత్త పటేల్‌ కూడా ఉన్నారు. రసాయనాలతో మెరుగుపరిచిన కాక్స్‌-2 ఎంజైమ్‌ ఇన్‌హిబిటర్లు ఆందోళన లక్షణాల నుంచి ఉపశమనం కలిగిస్తాయని గుర్తించారు. సహజసిద్ధమైన ఎండోకానాబినాయిడ్స్‌ను ప్రేరేపించడం ద్వారా ఇవి ఉపశమనాన్ని కలుగజేస్తాయని పరిశోధకులు పేర్కొన్నారు. ఆందోళన, మానసిక రుగ్మతల చికిత్సల్లో ఇవి కొత్త తరహా పద్ధతులకు నాంది పలుకుతాయని భావిస్తున్నారు. వీటికి సంబంధించిన క్లినికల్‌ ట్రయల్స్‌ రాబోయే కొన్నేళ్లలో మొదలవుతాయని పరిశోధకులు లారెన్స్‌ మార్నెట్‌ పేర్కొన్నారు.

  • ===========================
 Visit my website at -> Dr.Seshagirirao.com/

creation of biological heart, జీవగుండె సృష్టి


 

    మార్పిడి చేయటానికి వీలయ్యే గుండెను జీవసాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించే ప్రక్రియను పరిశోధకులు ఆవిష్కరించారు. గ్రహీత మూలకణాల్ని ఉపయోగించే గుండెను తయారు చేసే ఈ పరిశోధన కీలకమైన పరీక్షా దశలన్నింటినీ అధిగమించింది.

'హోల్‌ ఆర్గాన్‌ డీసెల్యులరైజేషన్‌'గా పిలిచే సరికొత్త ప్రక్రియలో గుండె కణజాలాన్ని రూపొందించినట్లు మినెసోటా యూనివర్సిటీ పరిశోధకులు పేర్కొన్నారు. ఈ ప్రక్రియలో భాగంగా పరిశోధకులు ఎలుక, పంది గుండెలోని కణాలన్నింటినీ పలురకాల రసాయనాల్ని ఉపయోగించి తొలగించారు. చివరికి జిగిబిగి అల్లికలాగా వాటిలోని రక్తనాళాలు మాత్రమే మిగిలాయి. ఆ నాళాల మీదకు మూలకణాల్ని ఇంజెక్ట్‌ చేశారు. వాటికి అవసరమైన పోషకాల్ని కూడా అందజేసి కొత్త అవయవం ఎదిగేలా చేశారు. ఎనిమిది రోజుల వ్యవధిలో ఆ గుండె పంపింగ్‌ చేసే సామర్థ్యాన్ని సంతరించుకుంది. ఇందులోని ప్రాథమిక పరిజ్ఞానం కొత్తదేమీ కాదు. గుండె కవాటాల్ని తయారుచేసే ప్రక్రియలో ఈ పద్ధతినే అనుసరిస్తున్నారు. కాకపోతే.. గుండెతో పోలిస్తే ఈ కవాటాలు చాలా చిన్నవిగా ఉంటాయి. తాము మానవ గుండె పరిమాణంతో సమంగా ఉండే పంది గుండెను ఎంచుకుని ఈ ప్రయోగానికి పూనుకున్నట్లు పరిశోధకులు డాక్టర్‌ డారిస్‌ టేలర్‌ పేర్కొన్నారు. తర్వాతి దశలో మానవ గుండెనే ఇలా పునర్నిర్మించాలనే లక్ష్యంతో ఉన్నామని పేర్కొన్నారు. ప్రస్తుతం అవయవంలోని కణాల్ని తొలగించే ప్రక్రియలో ఉపయోగించే రసాయనాలు, అవయవం ఎదగటానికి ఉపయోగించే పోషకాల విషయంలో పేటెంట్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. మొత్తం గుండెనే ఈ ప్రక్రియలో నిర్మించి, గుండె మార్పిడి చికిత్స చేయాలనేది తమ లక్ష్యమని, ఈ తరహాలో తయారు చేసిన గుండె జీవనకాలం కూడా ఎక్కువేనని పేర్కొన్నారు.

జీవసాంకేతిక పరిజ్ఞానం సాయంతో గ్రహీత మూలకణాల్నే ఉపయోగించి అవయవాన్ని రూపొందించి అమర్చటం వల్ల గ్రహీత రోగనిరోధక వ్యవస్థ కొత్త అవయవాన్ని తిరస్కరించే అవకాశాలు ఉండవన్నారు. అంటే.. ఎవరికి గుండె అవసరమైతే, వారి శరీరానికి తగిన గుండెను వారి మూలకణాలతోనే తయారుచేసి ఇవ్వగలమని పరిశోధకులు వివరించారు. మామూలుగా మూలకణాలు తమ చుట్టూ ఉండే వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా ప్రతిస్పందిస్తుంటాయనీ, అందుకని, మూలకణాల్ని గుండెలోకి ఇంజెక్ట్‌ చేయటం వల్ల గుండె కణాలుగా, కణజాలంగా రూపొందే అవకాశాలు ఎక్కువని పేర్కొన్నారు. ఇప్పటికైతే ఈ ప్రయోగం ప్రాథమిక స్థాయిలోనే ఉన్నా, సమీప భవిష్యత్తులోనే ఈ తరహా గుండెను తయారుచేసి మానవ శరీరంలోకి విజయవంతంగా మార్పిడి చేసే విజయాన్ని సాధిస్తామని ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశారు.

source : sukhibhava@eenadu news paper 23-11-2012

  • =========================== 
Visit my website at -> Dr.Seshagirirao.com/

Test for stress by saliva,ఒత్తిడిని కనిపెట్టే లాలాజలం



  •  Test for stress by saliva,ఒత్తిడిని కనిపెట్టే లాలాజలం
మానసిక ఒత్తిడిని గుర్తించే సరికొత్త తరహా పరీక్ష పద్ధతి ఇది.--లాలాజలం గుండా లేజర్‌ కిరణాలను ప్రసరింపజేయటం ద్వారా ఒత్తిడి స్థాయుల్ని అంచనా వేయవచ్చని పరిశోధకులు గుర్తించారు. నోటి నుంచి సేకరించే లాలాజలం గుండా ఆల్ట్రాఫాస్ట్‌ లేజర్లను పంపించటం ద్వారా ఒత్తిడి స్థాయుల్ని నిక్కచ్చిగా గుర్తించవచ్చని మణిపాల్‌ జీవశాస్త్ర కేంద్రం పరిశోధకులు మాథుర్‌ సంతోష్‌ పేర్కొన్నారు. ఈ పద్ధతిలో ప్రస్తుతం అనుసరిస్తున్న రక్త పరీక్షలకన్నా మంచి ఫలితాలు వెలువడుతాయని స్పష్టం చేస్తున్నారు. లాలాజలంలో ఉండే ప్రొటీన్‌ శారీరక, మానసిక ఒత్తిడును నిర్దిష్టంగా గుర్తిస్తుంది. దీని సాయంతో ఒత్తిడిని గుర్తించేందుకు లేజర్లను తాము మొట్టమొదటిసారిగా ఉపయోగించినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం ఇది ప్రయోగాత్మక దశలోనే ఉందన్నారు.

ఒత్తిడిని గుర్తించే మరో పద్ధతి.. కాంతి పరీక్ష. ఇందులో.. కాంతిని లాలాజలం ద్వారా ప్రసరింపజేసినప్పుడు కాంతికి సంబంధించిన వర్ణాలు కుచించినట్లుగా ఏర్పడతాయి. ఇవెంతగా తక్కువగా ఏర్పడితే ఒత్తిడి స్థాయులు అంతగా ఎక్కువ ఉన్నట్లు గుర్తించాలి. ఈ తరహా పరీక్షపై కూడా మణిపాల్‌ కేంద్రంలో ప్రయోగాలు జరుగుతున్నాయి.
  • ===========================

Can we stop oldage?,వృద్ధాప్యాన్ని ఆపగలమా?

  •  

  •  Can we stop oldage?,వృద్ధాప్యాన్ని ఆపగలమా?
గాబి విలియమ్స్‌... ఎనిమిదేళ్ల అమ్మాయి. కానీ నెలల పాపలా కనిపిస్తుంది. బరువు ఐదు కిలోలకు మించదు. ఉయ్యాలలోంచి లేవలేదు. పాలు పట్టడం, డైపర్లు మార్చడం... పసిపాపని చూసినట్లే చూడాలి. ఫ్లోరిడాకి చెందిన 29 సంవత్సరాల ఓ యువకుడు కూడా ఇంతే. పదేళ్ల పిల్లాడిలానే ఉంటాడు. బ్రెజిల్‌కి చెందిన 31 సంవత్సరాల ఓ మహిళ అయితే రెండేళ్ల పాపలానే ఉంటుంది. ఎంత వయసు వచ్చినా వీళ్లింతే. పిల్లల మాదిరిగానే ఉండిపోతారు. అంటే వయసుతోపాటు పెరగడమూ, వయసుకు తగ్గ మార్పులు రావడమూ అనే సహజ ప్రక్రియ వీళ్లలో మందగించింది. శాస్త్రపరిభాషలో చెప్పాలంటే 'డెవలప్‌మెంటల్‌ ఇనర్షియా' అనే ప్రక్రియ ఆగిపోయింది. అంటే ఈ ప్రక్రియకు కారణమైన జన్యులోపంతో వీళ్లు బాధపడుతున్నారన్నమాట. అందుకే 'దీనికి కారణమైన జన్యువుని కనుగొని, మనిషి పూర్తిగా అభివృద్ధి చెందాక- అంటే 30 సంవత్సరాల వయసులో ఉండగా ఆ జన్యువుని పనిచేయకుండా ఆపివేయగలిగితే ఎప్పటికీ అలాగే ఉండిపోవచ్చు' అని ఈ విషయం మీద పరిశోధన చేస్తోన్న రిచర్డ్‌ ఎఫ్‌ వాకర్‌ పేర్కొంటున్నారు. అప్పుడు ఏ ప్రమాదవశాత్తో లేదా వ్యాధుల కారణంగానో మరణం సంభవించాల్సిందే తప్ప సహజమైన వృద్ధాప్యంతో ఎవరూ చనిపోరన్నది ఆయన విశ్లేషణ.

18 September 2014

తల్లిపాలు తో ఎలర్జీలు దూరము

  •  


  •  
తల్లిపాలు చేసే మేలు అంతా ఇంతా కాదు. ఇది పిల్లల్లో ఆహార సంబంధ అలర్జీలు రాకుండానూ కాపాడుతున్నట్టు తాజాగా బయపడింది. పిల్లలకు ఘనాహారం తినిపించటం మొదలుపెట్టిన సమయంలో తల్లిపాలు ఇవ్వటమూ కొనసాగిస్తే.. అలర్జీల ముప్పు తగ్గుతున్నట్టు పరిశోధకులు గుర్తించారు. రెండేళ్ల వయసు వచ్చేసరికి ఆహార అలర్జీలతో బారినపడ్డ 41 మంది పిల్లలను, అలర్జీలేవీ లేని 82 మంది పిల్లలను పోల్చి ఈ విషయాన్ని గుర్తించారు. ఘనాహారాన్ని తట్టుకునే ప్రక్రియలను తల్లిపాలు ప్రోత్సహిస్తాయని, అందువల్ల రోగ నిరోధకవ్యవస్థకు మేలు కలుగుతోందని పరిశోధకులు చెబుతున్నారు. ఆరు నెలల్లోపు పిల్లల పేగులు ఇంకా అభివృద్ధి చెందుతున్న దశలోనే ఉంటాయి. కాబట్టి ఆలోపు ఘనాహారాన్ని ఆరంభిస్తే వాళ్లు తట్టుకోలేరు. ఇది ఆహార అలర్జీలకూ దారితీయొచ్చు. కాబట్టి ఆరు నెలల తర్వాతే పిల్లలకు ఘనాహారాన్ని మొదలుపెట్టాలి. అప్పటివరకు పూర్తిగా తల్లిపాలే ఇవ్వాలని నిపుణులు సూచిస్తున్నారు.

  • ===========================
 Visit my website at -> Dr.Seshagirirao.com/

15 September 2014

Male contraceptive injection,పురుషులకు గర్భనిరోధక ఇంజక్షన్‌




  •  
Male contraceptive injection,పురుషులకు గర్భనిరోధక ఇంజక్షన్‌
లండన్‌: పురుషులకు ఇవ్వగలిగే గర్భనిరోధక ఇంజక్షన్‌ను పరిశోధకులు అభివృద్ధి చేస్తున్నారు. ఇది 2017 నాటికి అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయి. వసాల్జెల్‌ అనే పదార్థాన్ని ఇంజక్షన్‌ రూపంలో ఇవ్వడం ద్వారా వృషణాల నుంచి నాళాల్లోకి వీర్యం చేరుకోకుండా అడ్డుకోవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. వేసక్టమీ చేయించుకున్న తరహాలోనే ఇదీ పనిచేస్తుంది. కాకపోతే ఇది దానిలా శాశ్వతమైనది కాదు.

Injectable contraception for men is not yet available in Australia, but clinical studies suggest that the combination of the hormones testosterone and progesterone may provide a safe, effective and reversible method of male contraception in the future.

  • =========================== 
Visit my website at -> Dr.Seshagirirao.com/

30 August 2014

Sugar is bad to heart,గుండెకు చక్కెర ముప్పు

  •  
  •  
మధుమేహంపై చక్కెర ప్రభావం ఉంటుందన్నది తెలిసిందే. ఇది గుండెపైనా ప్రభావం చూపుతుందా? అవుననే అంటున్నారు ఒటాగో విశ్వవిద్యాలయ పరిశోధకులు. గుండెజబ్బును తెచ్చిపెట్టే కారకాలపై చక్కెర నేరుగా ప్రభావం చూపుతున్నట్టు తేలటమే దీనికి నిదర్శనం. గుండెజబ్బు ముప్పు కారకాల్లో అధిక రక్తపోటు, రక్తంలో కొలెస్ట్రాల్‌ స్థాయులదే అగ్రస్థానం. చక్కెరను కలిపి తయారుచేసే పదార్థాలు, పానీయాలు ఇలాంటి ముప్పు కారకాల మీద ఎలాంటి ప్రభావం చూపుతాయనేదానిపై అంతర్జాతీయంగా చాలా అధ్యయనాలు సాగాయి. ఒటాగా విశ్వవిద్యాలయ పరిశోధకులు ఇటీవల వీటిన్నింటినీ క్రోడీకరించి విశ్లేషించారు. గుండెజబ్బు ముప్పునకు చక్కెర దోహదం చేస్తున్నట్టు ఇందులో బయటపడింది. ఇది రక్తపోటు, కొలెస్ట్రాల్‌పై ఒక మాదిరిగా ప్రభావం చూపుతున్నప్పటికీ.. బరువు పెరగటంలో మాత్రం గణనీయమైన పాత్ర పోషిస్తున్నట్టు వెల్లడైంది. అందువల్ల ఆహార పదార్థాల్లో కలిపే చక్కెర మోతాదులను తగ్గించాల్సిన అవసరముందని అధ్యయన నేత టె మోరెంగా సూచిస్తున్నారు. ఇది ప్రపంచవ్యాప్తంగా గుండెజబ్బుల భారాన్ని తగ్గించటానికి తోడ్పడగలదని వివరిస్తున్నారు. పిండి పదార్థాలు, కేలరీల మోతాదులు సమానంగా ఉన్నప్పుడు ఆహార పదార్థాల్లో చక్కెర స్థాయిలు ఎక్కువున్నా, తక్కువున్నా బరువు పెరగటంపై ప్రత్యేకమైన ప్రభావం చూపటం లేదని గత అధ్యయనాలు కొన్ని సూచిస్తున్నాయి. కానీ ఇది నిజం కాదని ఇప్పుడు గుర్తించారు.
  • ===========================
 Visit my website at -> Dr.Seshagirirao.com/

29 August 2014

saliva of cancer causing organism cure ulcers-క్యాన్సర్‌ కారక జీవి ఉమ్మితో మొండి పుండ్లు మాయం

  •  
  •  

saliva of cancer causing organism cure ulcers-క్యాన్సర్‌ కారక జీవి ఉమ్మితో మొండి పుండ్లు మాయం!
మెల్‌బోర్న్‌: కాలేయ క్యాన్సర్‌ కారక పరాన్నజీవి ఉమ్మిలో ఎంతకీ మానని పుండ్లను నయం చేసే గుణముందని జేమ్స్‌ కుక్‌ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్త మైఖేల్‌ స్మౌట్‌ పేర్కొన్నారు. 'లివర్‌ ఫ్లూక్‌' అనే పరాన్నజీవి కాలేయ క్యాన్సర్‌కు ఎలా దారితీస్తుందో? మానని పుండ్లకు చికిత్సలను రూపొందించటానికి ఎలా తోడ్పడుతుందో? అనే అంశాలను ఆయన తన తాజా అధ్యయనంలో వివరించారు. లివర్‌ ఫ్లూక్‌ పరాన్నజీవి ఉమ్మిలోని గ్రాన్యులిన్‌ అనే అణువు అధిక సంఖ్యలో కణాలు వృద్ధి అయ్యేలా చేస్తుంది. అయితే ఇది గాయాలు మానటాన్నీ ప్రోత్సహిస్తున్నట్టు స్మౌట్‌ గుర్తించారు. ''ఇదెలా పనిచేస్తుందో తెలియదు. కానీ కాలేయంలో దాని మూలంగా పుట్టుకొచ్చే గాయాలనూ అదే నయం చేస్తుంది. నిజానికి ఇది మనిషికి మేలు చేసేదే. కానీ తరచుగా గాయాలు అవుతూ.. మానుతూ.. ఇలా చాలాకాలం కొనసాగితే మాత్రం క్యాన్సర్‌కు దారితీస్తుంది'' అని ఆయన వివరించారు.


===========================
 Visit my website at -> Dr.Seshagirirao.com/

Old age speedup with cigarete smoking-సిగరెట్‌ పొగతో త్వరగా వృద్ధాప్యం

  •  


  • Old age speedup with cigarete smoking-సిగరెట్‌ పొగతో త్వరగా వృద్ధాప్యం
వాషింగ్టన్‌: కొందరు తమ వయసు కన్నా చిన్నగా కనబడితే.. మరికొందరు పెద్దగా కనబడుతుంటారు కదా. దీనికి కారణమేంటో తెలుసా? మన చుట్టూరా వాతావరణంలో ఉండే 'వయో కారకాల' ప్రభావానికి గురికావటమేనని పరిశోధకులు గుర్తించారు. వాతావరణంలోని బెంజీన్‌ వంటి రసాయనాలు, సిగరెట్‌ పొగ వంటి హానికర పదార్థాలతో పాటు ఒత్తిడి కూడా త్వరగా వృద్ధాప్యం బారిన పడటానికి కారణమవుతున్నట్టు తాజా అధ్యయనంలో బయటపడింది. ఇలాంటి 'వయో కారకాలు' వ్యక్తుల్లో శారీరక వయసుపై ప్రభావం చూపుతున్నాయని నార్త్‌ కరోలినా విశ్వవిద్యాలయానికి చెందిన నార్మన్‌ షార్ప్‌లెస్‌ పేర్కొన్నారు. పర్యావరణంలోని వయో కారకాలను గుర్తించివాటికి దూరంగా ఉండటం వల్ల జీవనకాలాన్ని పెంచుకునే అవకాశముందని వివరించారు. సిగరెట్‌ అన్నింటికన్నా ముఖ్యమైన వయో కారకమని షార్ప్‌లెస్‌ తెలిపారు. సిగరెట్ల మూలంగా క్యాన్సర్‌ వస్తుందని తెలుసు. అయితే రక్తనాళాలు గట్టిపడటం, వూపిరితిత్తులు గట్టిపడటం వంటి ఇతరత్రా సమస్యలకూ వీటితో సంబంధం ఉంటోందని వివరించారు.

  • =========================== 
 Visit my website at -> Dr.Seshagirirao.com/

17 August 2014

Cancer controle hunting cells, క్యాన్సర్‌ పనిపట్టే హంతక కణాలు

  •  


  •  
Cancer controle hunting cells, క్యాన్సర్‌ పనిపట్టే హంతక కణాలు

మెల్‌బోర్న్‌: సహజ హంతక కణాలుగా పేరు పొందిన ప్రత్యేకమైన రోగ నిరోధక కణాలు మెలనోమా అనే క్యాన్సర్‌ కణాలను తుదముట్టించడంలో కీలక పాత్ర పోషిస్తాయని తాజా అధ్యయనంలో తేలింది. శరీరంలో విస్తరించిన క్యాన్సర్లను వీటి సాయంతో చంపేయవచ్చని పరిశోధకులు తెలిపారు. ఎముక మజ్జ మార్పిళ్లను శరీరం తిరస్కరించేలా చేయడంలోనూ ఈ హంతక కణాలు కీలక పాత్ర పోషిస్తున్నట్లు తేల్చారు. ఆస్ట్రేలియాలోని వాల్టర్‌ అండ్‌ ఎలీజా హాల్‌ ఇన్‌స్టిట్యూట్‌ శాస్త్రవేత్తలు ఈ పరిశోధన నిర్వహించారు. ఈ హంతక కణాలు శరీరాన్ని ఆసాంతం పరిశీలిస్తూ, వైరస్‌ వంటి చొరబాటుదారులను పసిగడతాయి. క్యాన్సర్‌ కారణంగా కణాల్లో వస్తున్న మార్పులను కూడా గుర్తిస్తాయి. ఒక చోట నుంచి మరో చోటుకు విస్తరిస్తున్న క్యాన్సర్‌ కణాలపై పోరాడటానికి ఇవి అవసరమని పరిశోధనలో పాల్గొన్న నిక్‌ హంటింగ్‌టన్‌ చెప్పారు. . ఎంసీఎల్‌-1ను లక్ష్యంగా చేసుకొని, శరీరంలో హంతక కణాలను వృద్ధి చేసుకోవచ్చని, తద్వారా క్యాన్సర్‌పై పోరును తీవ్రం చేయవచ్చని తెలిపారు.

  • =========================== 
Visit my website at -> Dr.Seshagirirao.com/

Mercury in beauty products,సౌందర్య లేపనాలలో పాదరసం




  •  
  •  
  • Mercury in beauty creams and products,సౌందర్య లేపనాలలో పాదరసం

వేగంగా గుర్తించేందుకు ఇప్పుడు సరికొత్త విధానం--వాషింగ్టన్‌: హానికారక పాదరసం కలిగిన సౌందర్య లేపనాలను కొంతమంది ముఖానికి పులుముకోవడం, చర్మం కిందకు చొప్పించుకోవడం వంటివి చేస్తున్నారని అమెరికా పరిశోధకులు పేర్కొన్నారు. దీనివల్ల చర్మం నిగారింపు పెరుగుతుందని భావిస్తున్నారని తెలిపారు. అయితే దానివల్ల తీవ్రమైన ఆనారోగ్య సమస్యలు వస్తాయని హెచ్చరించారు. సౌందర్య ఉత్పత్తుల్లో పాదరసం స్థాయిని 1 పార్ట్స్‌ పర్‌ మిలియన్‌ (పీపీఎం) మించకూడదని అమెరికాలో ప్రమాణాలు నిర్దేశించారు. అయితే కొన్ని ఉత్పత్తుల్లో 2.10 లక్షల పీపీఎం మేర కూడా ఈ రసాయనం ఉంటోంది. ఆ ఉత్పత్తిని నిత్యం వాడితే మన చేతి మీద అది ఉండిపోతుందని, తద్వారా ఆహారంలోకి, చిన్నారులు నిద్రించే షీట్లపైకి పాదరసం చేరుతుందని కాలిఫోర్నియా ప్రజారోగ్యశాఖకు చెందిన గోర్డాన్‌ పేర్కొన్నారు. పైపెచ్చు దీనివల్ల మెదడు పనితీరుపై ప్రభావం పడటం, మూత్రపిండాలు దెబ్బతినడం, తలనొప్పి, అలసట, చేతులు వణకడం వంటి ఇబ్బందులు తలెత్తుతాయని చెప్పారు.

  • =========================== 
 Visit my website at -> Dr.Seshagirirao.com/

Asprin can controle progress of breastcance,ఆస్ప్రిన్‌తో రొమ్ము క్యాన్సర్‌ అదుపు(controle)చేయవచ్చును

  •  

  •  
రోగం తిరిగి తలెత్తే ప్రమాదం తగ్గుతుంది: శాస్త్రవేత్తలు---వాషింగ్టన్‌: మెనోపాజ్‌ తర్వాత రొమ్ము క్యాన్సర్‌కు గురైన వూబకాయ మహిళలకు ఆస్ప్రిన్‌, ఇబుప్రొఫెన్‌ వంటి వాపు నివారణ మందులు మేలు చేస్తాయని అమెరికా శాస్త్రవేత్తలు తేల్చారు. వారిలో ఆ జబ్బు తిరిగి తలెత్తే ప్రమాదం తగ్గుతుందని వివరించారు.
టెక్సాస్‌ విశ్వవిద్యాలయానికి చెందిన క్యాన్సర్‌ థెరపీ అండ్‌ రీసెర్చ్‌ సెంటర్‌ (సీటీఆర్‌సీ) శాస్త్రవేత్తలు రొమ్ము క్యాన్సర్‌ రోగుల్లో రక్త సీరంను పరిశీలించారు. వీరు కొవ్వు కణాల కల్చర్‌లో ఈ సీరంను ఉంచారు. ఆ తర్వాత దాన్ని రొమ్ము క్యాన్సర్‌ కణాలపై ఉంచారు. మిగతా రోగులతో పోలిస్తే వూబకాయమున్న రోగుల సీరం.. క్యాన్సర్‌ కణాలను మరింత వేగంగా వృద్ధి చెందిస్తున్నట్లు పరిశోధకులు తేల్చారు. వూబకాయమున్న రోగుల సీరంలో ప్రోస్టాగ్లాండిన్స్‌ ఎక్కువగా ఉందని పరిశోధనలో పాలుపంచుకున్న ఆండ్రూ బ్రెన్నర్‌ తెలిపారు. వాపులో దీనికి పాత్ర ఉంటుందన్నారు. ఈ ఫలితాల ఆధారంగా రోగుల్లో సీవోఎక్స్‌2 ఇన్హిబిటర్లు (ఆస్ప్రిన్‌ లేదా ఇబుప్రొఫెన్‌) వాడుతున్న రోగులను వేరుచేసి, పరిశీలించారు. వారిలో క్యాన్సర్‌ తిరగబెట్టే ప్రమాదం 50 శాతం మేర తగ్గుతోందని గుర్తించారు. ఈ మందుల వల్ల వారిలో క్యాన్సర్‌రహిత కాలం రెండేళ్లకు పెరిగిందని బ్రెన్నర్‌ తెలిపారు.

  • =========================== 
 Visit my website at -> Dr.Seshagirirao.com/

13 August 2014

Treatment for cancer cells,క్యాన్సర్‌ కణాల చికిత్స



 Treatment for cancer cells,క్యాన్సర్‌ కణాల చికిత్స
లండన్‌: క్యాన్సర్‌ కణాలు తమంతటతామే ధ్వంసమయ్యే ఒక సరికొత్త చికిత్సకు అమెరికా శాస్త్రవేత్తలు నాందిపలికారు. దీంట్లో భాగంగా వీరు ఒక వినూత్నమైన అణువుకు రూపకల్పన చేశారు. ఇది క్యాన్సర్‌ కణాల్లోకి సోడియం, క్లోరైడ్‌ అయాన్లను తీసుకెళ్తుంది. ఈ అయాన్లు క్యాన్సర్‌ కణాలు స్వయంగా ధ్వంసమయ్యేలా చేస్తాయి. సాధారణంగా మనశరీరంలో అయాన్లు ఒక నిర్దిష్టమైన సమతుల్యతతో ఉంటాయి. కణాలు ఈ సమతుల్యతను ఎప్పటికప్పుడు కాపాడుకుంటాయి. ఎప్పుడైనా అది దెబ్బతిన్నప్పుడు.. కణాలు 'ఆత్మహత్య'కు పాల్పడుతుంటాయి. ఈ ప్రక్రియ ద్వారా ప్రమాదకరమైన, దెబ్బతిన్న కణాలను శరీరం వదిలించుకుంటుంది. సహజసిద్ధమైన ఈ ప్రక్రియను ఉపయోగించుకోవటం ద్వారా క్యాన్సర్‌ వ్యాధికి మెరుగైన చికిత్సను అభివృద్ధి చేయవచ్చని టెక్సాస్‌ యూనివర్సిటీ పరిశోధకులు భావించారు. ఈ మేరకు వీరు అయాన్ల రవాణాకు ఒక కృత్రిమ అణువును రూపొందించి.. దానిద్వారా క్యాన్సర్‌ కణాలకు సోడియం, క్లోరైడ్‌ అయాన్లను పంపించారు. ప్రయోగశాలలో వీరు జరిపిన పరీక్షలు విజయవంతమయ్యాయి.

===========================
 Visit my website at -> Dr.Seshagirirao.com/

12 August 2014

cancer treatment with vascular gene-రక్తనాళాల జన్యువుతో క్యాన్సర్‌కు చికిత్స

  •  

లండన్‌: రక్తనాళాలను సృష్టించే ఒక జన్యువును శాస్త్రవేత్తలు గుర్తించారు. దీనివల్ల క్యాన్సర్‌, గుండెజబ్బులు, పక్షవాతానికి సమర్థవంతమైన చికిత్సను అందించవచ్చని భావిస్తున్నారు. లీడ్స్‌ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు ఈ పరిశోధన జరిపారు. 'పీజోల్‌' అనే జన్యువు రక్తనాళాల ఏర్పాటులో కీలకపాత్ర పోషించే శరీరంలోని సెన్సర్లకు ఆదేశాలు జారీ చేస్తుందని వీరి పరిశీలనలో తేలింది. ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన ప్రొఫెసర్‌ డేవిడ్‌ బీచ్‌ మాట్లాడుతూ.. శరీరంలోని రక్తనాళాల వ్యవస్థ అనేది ముందుగానే ఏర్పాటయ్యేది కాదు. రక్తప్రవాహాన్ని బట్టి ఎప్పటికప్పుడు ఈ వ్యవస్థ రూపొందుతుంది. ఈ క్రమంలో పీజోల్‌ జన్యువు అత్యంత కీలకం. రక్తప్రవాహానికి అనుగుణంగా రక్తనాళాలను ఏర్పాటుచేసే ప్రోటీన్‌కు పీజోల్‌ నుంచే ఆదేశాలు వెళ్తాయి'' అని తెలిపారు. ఈ పరిశోధన నేపథ్యంలో.. క్యాన్సర్‌ బాధితుల్లో పీజోల్‌ జన్యువును నియంత్రించటం ద్వారా క్యాన్సర్‌ కణాలకు రక్తసరఫరా జరగకుండా చూడవచ్చని, తద్వారా ఆ కణాలను నిర్మూలించవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. రక్తసరఫరాలో తలెత్తే అడ్డంకుల వల్ల సంభవించే గుండెజబ్బుల వంటి ఇతర వ్యాధులను కూడా కొత్తకోణంలో అర్థం చేసుకొని, నూతన చికిత్సలను అభివృద్ధి చేయటానికి ఈ పరిశోధన ఉపయోగపడుతుందని భావిస్తున్నారు.
  • ===========================
 Visit my website at -> Dr.Seshagirirao.com/

30 July 2014

Reduction of brain cells with Diabetes,మధుమేహంతో మెదడు కణజాలం క్షీణత!

  •  

  • వాషింగ్టన్‌: మధుమేహం దుష్ప్రభావం మెదడుపై బాగా ఉంటుందని తాజా అధ్యయనం హెచ్చరించింది. ఈ వ్యాధి సంక్రమించిన తర్వాత ప్రతి పదేళ్లకోసారి మెదడు అకాల వార్ధక్యానికి చేరువవుతూ కుంచించుకు పోయే ప్రమాదం ఉంది. మెదడు కణజాలం క్షీణిస్తుందని పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయ పరిశోధకులు తెలిపారు. ముఖ్యంగా టైప్‌-2 మధుమేహం సర్వసాధారణమైనది. ఈ నేపథ్యంలోనే క్లోమగ్రంధి తగిన ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేయలేకపోవచ్చు. సుదీర్ఘకాలం పాటు మధుమేహంతో బాధపడుతున్న వారిలో మెదడు పరిమాణం తరుగుదల తమ పరిశోధనల్లో సుస్పష్టంగా తెలిసిందని పరిశోధకులు వివరించారు.
  • =========================== 
Visit my website at -> Dr.Seshagirirao.com/

29 July 2014

Correction of vision without lences or glasses, కళ్లద్దాలు, లెన్సులు లేకుండానే కంటిచూపు

  •  
  •  
వాషింగ్టన్‌: కళ్లద్దాలుగానీ, కాంటాక్టు లెన్సులుగానీ లేకుండానే కంటిచూపు సమస్యలను అధిగమించవచ్చని కొత్త టెక్నాలజీ నిరూపిస్తోంది. అల్గారిథమ్స్‌ ఆధారంగా ఇది పని చేస్తుంది. కాలిఫోర్నియా యూనివర్సిటీ, మసాచూసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ, మైక్రోసాఫ్ట్‌ సంయుక్తంగా ఈ పరిజ్ఞానాన్ని రూపొందించాయి. దీనిని సెల్‌ఫోన్‌, కంప్యూటర్‌ వంటి పరికరాలకు అనుసంధానించినప్పుడు అవి.. వ్యక్తి చూపును బట్టి దృశ్యంలో స్పష్టతను మార్చుకుంటాయి. దీనివల్ల ఒకవ్యక్తి కంటిచూపు ఎంత మందగించినా ఎదుటనున్న తెరపై ఉన్న దానిని స్పష్టంగా చూడటానికి వీలవుతుంది. అద్దాలు, కాంటాక్ట్‌ లెన్సుల వంటివాటితో మెరుగుపడటానికి సాధ్యంకాని స్థాయిలో కంటిచూపును కోల్పోయిన వారికి ఇదో వరం.
  • =========================== 
 Visit my website at -> Dr.Seshagirirao.com/

19 March 2014

Anaemia with Proton pump inhibitor ,ఛాతీమంట మందులతో రక్తహీనత


  •  
 

  •   
ఛాతీలో మంటను తగ్గించే మందులను దీర్ఘకాలం పాటు వాడితే విటమిన్‌ బి12 లోపం ముప్పు పొంచి ఉంటున్నట్టు తాజాగా బయటపడింది. ఈ విషయాన్ని సకాలంలో గుర్తించి చికిత్స తీసుకోకపోతే రక్తహీనతకు దారి తీస్తుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. అంతేకాదు.. నాడులు దెబ్బతినటం, మతిమరుపు సైతం రావొచ్చని చెబుతున్నారు. ఛాతీ మంటను తగ్గించే ప్రోటాన్‌ పంప్‌ ఇన్‌హిబిటార్స్‌ (ఒమిప్రెజోల్‌ వంటివి) మందులను రెండు సంవత్సరాలు, అంతకన్నా ఎక్కువకాలం వాడినవారికి విటమిన్‌ బి12 లోపం 65% ఎక్కువగా ఉంటున్నట్టు అమెరికా పరిశోధకులు గుర్తించారు. ముఖ్యంగా రోజుకి ఒకటిన్నర మాత్రలు వేసుకునేవారికి ఈ ముప్పు మరింత ఎక్కువగా ఉండటం గమనార్హం. ఇక హిస్టమిన్‌ 2 రిసెప్టర్‌ యాంటగోనిస్ట్స్‌ (సిమెటిడిన్‌, రాంటిడిన్‌ వంటివి) మందులు వాడేవారికి బి12 లోపం ముప్పు 25% అధికమవుతున్నట్టు తేలింది. అందువల్ల ఈ మందులను తప్పకుండా వేసుకోవాల్సినవారికి తక్కువ మోతాదులో ఇవ్వటం మంచిదని పరిశోధకులు సూచిస్తున్నారు. ఈ విషయంలో విటమిన్‌ బి12 లోపంతో తలెత్తే సమస్యలను దృష్టిలో ఉంచుకోవాలని చెబుతున్నారు. జీర్ణాశయంలోని ఆమ్లం పైకి ఎగదన్నుకొని, అన్నవాహికలోకి రావటం వల్ల ఛాతీ మంట వస్తుంది. మసాలాలు, కారం, తదితర ఆహార పదార్థాలు.. మద్యం, కొన్నిరకాల మందులు, గర్భం ధరించటం వంటివి ఈ సమస్యను తెచ్చిపెట్టొచ్చు.



  • =========================== 
Visit my website at -> Dr.Seshagirirao.com/

Diseases in children with tension,ఒత్తిడితో పిల్లలకు జబ్బులు

  •  
  •  

ఒత్తిడి ఆరోగ్యానికి హాని కలిగిస్తుందనటంలో ఎలాంటి సందేహం లేదు. ఇది పెద్దల్లోనే కాదు.. పిల్లలపైనా గణనీయమైన ప్రభావం చూపుతుంది. చిన్నప్పుడు ఒత్తిడితో బాధపడే పిల్లలకు పెద్దయ్యాక వూబకాయం, ఇతరత్రా సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటున్నాయని అధ్యయనాలు పేర్కొంటున్నాయి. అయితే దీని ప్రభావం మరింత ఎక్కువగానూ.. వూహిస్తున్నదానికన్నా ఇంకా ముందుగానే కనబడుతున్నట్టూ తాజాగా బయటపడింది. వేధింపులకు, హింసకు గురికావటం.. తల్లిదండ్రులు విడిపోవటం.. ఆర్థిక సమస్యల వంటి అనుభవాలను ఎదుర్కొన్న పిల్లలు గ్రహణలోపం, మానసిక, శారీరక, సమస్యల వంటి ఏదో ఒక ఇబ్బందితో బాధపడుతున్నట్టు పరిశోధకులు గుర్తించారు. మరికొందరిలో ఈ మూడు సమస్యలు కలిసి ఉండటమూ గమనార్హం. ఇవన్నీ దీర్ఘకాల ఒత్తిడి ప్రభావంతో తలెత్తుతున్నవేనని ఫ్లోరిడా విశ్వవిద్యాలయ పరిశోధకులు చెబుతున్నారు. ఈ దీర్ఘకాల ఒత్తిడి మనసుకూ శరీరానికీ హాని కలిగిస్తుందని, ఇది నాడీసంబంధ హార్మోన్ల వ్యవస్థలోనూ, రోగనిరోధక వ్యవస్థలోనూ మార్పులు తీసుకొస్తోందని వివరిస్తున్నారు. దీంతో జబ్బుల బారినపడే ముప్పూ పెరుగుతోందని హెచ్చరిస్తున్నారు. నిజానికి ఒత్తిడి అనేది జీవితంలో ఒక భాగం. ఎవరైనా దీన్ని ఎదుర్కోవాల్సిందే. ఇది కొత్త విషయాలు నేర్చుకోవటానికి, ఇబ్బందులను అధిగమించటానికి పిల్లలకు తోడ్పడుతుంది కూడా. కానీ ఒత్తిడి తీవ్రమైతే, దీన్ని ఎదుర్కొనే సామర్థ్యం లోపిస్తే మాత్రం దుష్ప్రభావాలకు దారితీస్తుంది. దీర్ఘకాల ఒత్తిడి మూలంగా బాల్యంలో మెదడు అభివృద్ధి అస్తవ్యస్తమవుతుంది. నాడీ, రోగనిరోధక వ్యవస్థలు మందగిస్తాయి. అంతేనా? పెద్దయ్యాక మద్యపానానికి అలవాటు పడటం, కుంగుబాటు, తిండి సమస్యలు, గుండెజబ్బు, క్యాన్సర్‌ వంటి సమస్యలకూ దారితీస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. అందువల్ల పిల్లలకు ఒత్తిడికి గురవుతున్నట్టు గమనిస్తే వెంటనే జాగ్రత్త పడటం మంచిదని సూచిస్తున్నారు.
  • ==========================
Visit my website at -> Dr.Seshagirirao.com/

14 March 2014

Bowel and Rectal Cancer with Obesity, వూబకాయం వలన పెద్దపేగు క్యాన్సర్

  •  
  •  
క్యాన్సర్లన్నింటిలోకీ పెద్దపేగు, మలాశయ క్యాన్సర్లను తేలికగా నివారించుకునే అవకాశముంది. ఇవి ముందుగా క్యాన్సర్‌ రహిత బుడిపెల (పాలిప్స్‌) రూపంలోనే మొదలవుతాయి. చివరికి క్యాన్సర్‌గా మారతాయి. ఇందుకు దాదాపు పదేళ్ల సమయం పడుతుంది. అందువల్ల 50 ఏళ్లు పైబడిన తర్వాత తరచుగా కొలనోస్కోపీ పరీక్ష చేయించుకోవటం మంచిదని వైద్యులు చెబుతుంటారు. ఒకవేళ బుడిపెలు కనబడితే వాటిని తొలగించటం ద్వారా క్యాన్సర్‌ బారిన పడకుండా చూసుకోవచ్చు. వూబకాయులకు.. ముఖ్యంగా పురుషులకు కొలనోస్కోపీ పరీక్ష తప్పనిసరని మిషిగన్‌ స్టేట్‌ విశ్వవిద్యాలయ అధ్యయనం సూచిస్తోంది. ఎందుకంటే కొవ్వు హార్మోన్‌ అయిన లెప్టిన్‌ స్థాయులు, శరీర బరువు ఎత్తుల నిష్పత్తి, నడుము చుట్టుకొలత అధికంగా గల మగవారికి పెద్దపేగులో బుడిపెలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటున్నట్టు బయపడింది మరి. ఫలితంగా వీరికి పెద్దపేగు, మలాశయ క్యాన్సర్లు వచ్చే ముప్పూ ఎక్కువే ఉంటోంది.

ప్రస్తుతం కొలనోస్కోపీ పరీక్ష చేసే విషయంలో వయసు, కుటుంబ చరిత్రను పరిగణనలోకి తీసుకుంటున్నారు. దీనికి అధిక బరువునూ జోడించాల్సిన అవసరముందని పరిశోధకులు పేర్కొంటున్నారు. అధ్యయనంలో భాగంగా కొందరు వూబకాయులకు కొలనోస్కోపీ పరీక్ష చేయగా.. 30% మందిలో ఒకటి కన్నా ఎక్కువ బుడిపెలు ఉంటున్నట్టు తేలిందని పరిశోధకులు చెబుతున్నారు. మరి కాస్త ఎక్కువ వూబకాయులకైతే మూడు బుడిపెలుండే అవకాశం 6.5 రెట్లు ఎక్కువగా ఉంటోందనీ వివరిస్తున్నారు. లెప్టిన్‌ మోతాదులు ఎక్కువగా ఉండటం మూలంగా పెద్దపేగులోని క్యాన్సర్‌ ముందస్తుదశ కణాలకు రక్తసరఫరా పెరిగి, అవి వృద్ధి చెందటానికి దోహదం చేస్తోందని పేర్కొంటున్నారు. వూబకాయుల సంఖ్య నానాటికీ పెరుగుతున్న నేపథ్యంలో ఈ అధ్యయన ఫలితాలు మరింత ప్రాధాన్యం సంతరించుకున్నాయి.


  • =========================== 
 Visit my website at -> Dr.Seshagirirao.com/

11 March 2014

New blood test detection of Alzimer disease ,అల్జీమర్స్‌ను అంచనా వేసే కొత్త రక్తపరీక్ష

  •  
  •  
ఆరోగ్యకరమైన వ్యక్తిలో రాబోయే మూడేళ్లలో స్వల్పస్థాయిలో మెదడుపరమైన క్షీణతగానీ, అల్జీమర్స్‌ వ్యాధిగానీ తలెత్తే అవకాశాన్ని అంచనా వేసే సాధారణ రక్తపరీక్షను శాస్త్రవేత్తలు రూపొందించారు. ఈ రక్తపరీక్ష 10 రకాల కొవ్వులను గుర్తించి, విశ్లేషించడం ద్వారా అల్జీమర్స్‌ వచ్చే అవకాశాల్ని అంచనా వేస్తుంది. రెండేళ్లలో ఈ పరీక్ష అందరూ ఉపయోగించుకునే స్థాయిలో అందుబాటులోకి వస్తుందని జార్జిటౌన్‌ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్‌ హోవార్డ్‌ ఫెడెరాఫ్‌ పేర్కొన్నారు. ముందస్తుగానే వ్యాధిని గుర్తించడం వల్ల సరైన సమయంలో దానిని ఎదుర్కొనే అవకాశం కలుగుతుందన్నారు. తమ అధ్యయనంలో భాగంగా.. ఐదేళ్లపాటు 525 మంది ఆరోగ్యకరమైన వాలంటీర్లపై పరిశోధన చేపట్టినట్లు వివరించారు.

  • =========================== 
Visit my website at -> Dr.Seshagirirao.com/

Cancer is less in mothers of more children,ఎక్కువమంది పిల్లలను కన్న తల్లులకు కేన్సర్‌ దూరం

  •  
  •  

పది మంది లేదా అంతకన్నా ఎక్కువమంది పిల్లలను కన్న తల్లులకు కేన్సర్‌ వచ్చే ప్రమాదం చాలాతక్కువని ఫిన్లండ్‌ శాస్త్రవేత్తలు తేల్చారు. పరిశోధనలో భాగంగా.. ఫిన్లండ్‌కు చెందిన 5,000 మంది మహిళలపై వీరు అధ్యయనం నిర్వహించారు. ఈ మహిళలందరూ 2010కన్నా ముందు కనీసం పదిమంది పిల్లలకు జన్మనిచ్చిన వాళ్లే. వీరంతా లూథరిన్‌ చర్చికి చెందిన లీస్టడియన్‌ వర్గ సభ్యులు. వీరి దైనందినజీవితం సాధారణ మహిళల్లాగే ఉన్నప్పటికీ.. గర్భనిరోధక సాధనాలను ఉపయోగించటం వీరి మతంలో నిషిద్ధం. ఈ నేపథ్యంలోనే, వీరిలో పదిమంది సంతానాన్ని కలిగి ఉండటం సాధారణ విషయం. ఈ మతానికి చెందిన ఐదువేలమందిపై శాస్త్రవేత్తలు సర్వే జరిపినప్పుడు.. మూడుదశాబ్దాల వ్యవధిలో 656 మంది కేన్సర్‌ వ్యాధిని ఎదుర్కొన్నట్లు తేలింది. ఫిన్లండ్‌లో కేన్సర్‌ బాధిత స్త్రీలకు సంబంధించిన గణాంకాల ఆధారంగా చూస్తే.. 5,000 మందిలో సగటున 856 మంది కేన్సర్‌ బారిన పడుతున్నారు. అంటే, పదిమందికన్నా ఎక్కువమంది పిల్లలున్న తల్లుల విషయంలో ఈ సంఖ్య 200 తక్కువగా ఉందని తేలింది. అదే విధంగా కేన్సర్‌ వ్యాధిని కొత్తగా ఎదుర్కొంటున్న వాళ్లు కూడా ఈ మహిళల్లో తక్కువేనని, సాధారణం కంటే వీరి సంఖ్య 24 శాతం తక్కువగా ఉందని వెల్లడైంది. చిన్నవయసులో తల్లి కావటం వల్ల రొమ్ముకేన్సర్‌ నుంచి రక్షణ లభిస్తుందని ఇంతకుముందే పలు పరిశోధనల్లో రుజువైంది. కానీ, ఎక్కువమంది పిల్లలను కన్న తల్లులకు కూడా కేన్సర్‌ దూరంగా ఉంటుందని ఇప్పుడే తెలిసింది.

  • ===========================
 Visit my website at -> Dr.Seshagirirao.com/

26 February 2014

Do not sit continusly ,అతిగా కూచోవద్దు





టీవీల ముందు, కంప్యూటర్ల ముందు గంటల తరబడి కూచుంటున్నారా? అయితే కాస్త జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే దీర్ఘకాలం కూచునేవారికి పెద్దపేగులో బొడిపెలు (పాలిప్స్‌) తిరగబెట్టే అవకాశం ఎక్కువగా ఉంటోందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. నడక, పరుగు వంటి వ్యాయామాలు చేసినా ఇలాంటివారికి ఈ ముప్పు తప్పటం లేదనీ చెబుతున్నారు. సాధారణంగా పెద్దపేగు క్యాన్సర్‌ను గుర్తించేందుకు కొలనోస్కోపీ పరీక్ష చేసేటప్పుడు ఇలాంటివాటిని గుర్తిస్తుంటారు. ఆ సమయంలోనే వాటిని తొలగిస్తుంటారు కూడా. అయితే దీర్ఘకాలం కూచోవటం వల్ల ఇవి తిరిగి ఏర్పడే ప్రమాదం అధికమవుతున్నట్టు అమెరికా పరిశోధకులు గుర్తించారు. రోజుకి 7 గంటల కన్నా తక్కువసేపు కూచునేవారితో పోలిస్తే.. 11 గంటలు, అంతకన్నా ఎక్కువసేపు కూచునేవారికి ఈ ముప్పు 45% అధికంగా ఉంటున్నట్టు తేలింది. ఇది కేవలం పురుషుల్లోనే కనబడుతుండటం గమనార్హం. నిజానికి ఈ పాలిప్స్‌ క్యాన్సర్‌ రహితమే అయినప్పటికీ.. వీటితో మున్ముందు పెద్దపేగు క్యాన్సర్‌ వచ్చే ముప్పూ పెరుగుతుంది. అందుకే ఇవి ఏర్పడకుండా చూసుకోవటం ఉత్తమం. ''రోజూ నిర్ణీత సమయం మేరకు వ్యాయామంచేసినా.. దీర్ఘకాలం కూచోవటం వల్ల ముందుగానే జబ్బుల బారినపడే అవకాశం పెరుగుతోంది'' అని కొలంబియా విశ్వవిద్యాలయానికి చెందిన క్రిస్త్టెన్‌ మోల్‌మెంటీ చెబుతున్నారు. అందువల్ల ప్రజారోగ్య సిఫారసుల్లో కూచోవటం తగ్గించాలనే అంశాన్నీ చేర్చాలని సూచిస్తున్నారు
  • =========================== 
 Visit my website at -> Dr.Seshagirirao.com/

01 February 2014

Childhood depression leads to heart diseases,బాల్యంలో కుంగుబాటుతో గుండెజబ్బులు




వాషింగ్టన్‌: బాల్యంలో మానసిక కుంగుబాటుకు గురయ్యే పిల్ల్లలకు టీనేజీదశలోనే (20 ఏళ్లలోపే) గుండెజబ్బులు వచ్చే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు తెలియజేశారు. స్థూలకాయం, చురుకుదనం లోపించటం వంటి లక్షణాలతో మొదలై.. చివరికి గుండెసంబంధ సమస్యలకు దారితీసే అవకాశం ఉందని పేర్కొన్నారు. దక్షిణ ఫ్లోరిడా, వాషింగ్టన్‌, పిట్స్‌బర్గ్‌ విశ్వవిద్యాలయాలకు చెందిన శాస్త్రవేత్తలు ఈ పరిశోధన జరిపారు. మానసిక వ్యాకులతకు, గుండెజబ్బులకు మధ్య సంబంధం ఉందని గతంలో జరిగిన పలు అధ్యయనాల్లో వెల్లడైనప్పటికీ.. ఈ రెండింటి మధ్య సంబంధం జీవితంలో ఏ దశలో మొదలవుతుంది? దానిని ఎలా గుర్తించాలి? అన్నవి మాత్రం శేషప్రశ్నలుగానే మిగిలిపోయాయి. తాజాగా జరిగిన పరిశోధన ద్వారా వీటికి సమాధానం లభించింది. చిన్నతనంలో మొదలయ్యే కుంగుబాటుతో గుండెజబ్బుల ప్రమాదం పెరుగుతుందని, చిన్నప్పుడే సరైన చికిత్సను అందిస్తే ఈ ప్రమాదాన్ని గణనీయంగా తగ్గించవచ్చని శాస్త్రవేత్తలు కనుగొన్నారు.

  • ===========================
Visit my website at -> Dr.Seshagirirao.com/

Protein treatment for porotic bones, పెళుసు ఎముకలకు ప్రోటీన్‌ చికిత్స

  •  

  •  

వాషింగ్టన్‌: కణంలో ఒక ప్రోటీన్‌ పని చేసే విధానాన్ని, అది పయనించే మార్గాన్ని ఉత్తేజితం చేయటం ద్వారా ఎముకల దృఢత్వాన్ని పెంచవచ్చని, తద్వారా 'ఆస్టియోపొరోసిస్‌'కు సమర్థవంతమైన చికిత్సను అందించవచ్చని వాషింగ్టన్‌ విశ్వవిద్యాలయం వైద్యవిభాగం శాస్త్రవేత్తలు అంటున్నారు. వీరు ఎలుకలపై పరిశోధనలు జరిపి.. ఎముకల తయారీ క్రమంలో జరిగే ప్రక్రియలను పరిశీలించారు. డబ్ల్యూఎన్‌టీ అనే రకం ప్రోటీన్లు కణం లోపలికి వచ్చి పలురకాల దారులను ఉత్తేజితం చేస్తాయని వీరు గుర్తించారు. ముఖ్యంగా, డబ్ల్యూఎన్‌టీ 7 బీ అనే రకం ప్రోటీన్‌.. కీలకపాత్ర పోషిస్తోందని వెల్లడైంది. వీటివల్ల, ఎముకల తయారీకణాలు భారీసంఖ్యలో ఉత్పత్తి అవుతున్నాయని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. అదేసమయంలో ఎముకలు పెళుసుబారే ప్రక్రియపై ఈ ప్రోటీన్‌ ప్రభావం ఏమీ లేదని తెలిపారు. అంటే, వీటివల్ల ఉపయోగమే కానీ.. నష్టం లేదు. ఈ నేపథ్యంలో, డబ్ల్యూఎన్‌టీ 7 బీ మోతాదును కృత్రిమంగా పెంచినప్పుడు.. ఎలుకలు సాధారణ ఎలుకలకన్నా ఎక్కువస్థాయిలో ఎముకలను వృద్ధి చేసుకుంటున్నాయని తెలిసింది. ముఖ్యంగా, కణంలోని ఎంటీఓఆర్‌ అనే మార్గాన్ని ఉత్తేజితం చేసినప్పుడు.. డబ్ల్యూఎన్‌టీ 7 బీ పూర్తిస్థాయిలో పని చేస్తోందని వెల్లడైంది. ఈ పరిశోధన ద్వారా.. పెళుసు ఎముకలతో బాధపడేవారికి సమర్థవంతమైన చికిత్సను అందించటం సాధ్యమవుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు.
  • =========================== 
Visit my website at -> Dr.Seshagirirao.com/

28 January 2014

Low blood glucose improve and increase memory,గ్లూకోజ్‌ తగ్గితే పెరిగే జ్ఞాపకశక్తి

  •  
  •  

బెర్లిన్‌: రక్తంలో గ్లూకోజ్‌ తక్కువగా ఉండేవారిలో జ్ఞాపకశక్తి మెరుగ్గా ఉంటుందని తాజా అధ్యయనంలో గుర్తించారు. మధుమేహం లేకపోయినా రక్తంలో గ్లూకోజ్‌ ఎక్కువగా ఉంటే, జ్ఞాపకశక్తికి సంబంధించిన సమస్యలు ఎదుర్కొంటారని పరిశోధకులు తెలిపారు. ఈ అధ్యయనంలో భాగంగా.. సగటున 63 ఏళ్ల వయసులో ఉన్న 141 మంది జ్ఞాపకశక్తి నైపుణ్యాలను, రక్తంలో గ్లూకోజ్‌ స్థాయులను పరిశీలించారు. జ్ఞాపకశక్తి విషయంలో కీలకంగా వ్యవహరించే మెదడులోని హిపోక్యాంపస్‌ పరిమాణాన్ని తెలుసుకునేందుకు స్కానింగ్‌ చేశారు. రక్తంలో తక్కువ గ్లూకోజ్‌ ఉన్నవారు జ్ఞాపకశక్తి పరీక్షలో మంచి నైపుణ్యం ప్రదర్శించినట్లు తేలింది. అధిక గ్లూకోజ్‌ ఉండేవారు తక్కువ పదాలను జ్ఞాపకం ఉంచుకున్నట్లు గుర్తించారు. రక్తంలో గ్లూకోజ్‌ సాధారణ స్థితిలో ఉన్నవారూ, చక్కెర స్థాయిని తగ్గించుకోవడం ద్వారా జ్ఞాపకశక్తి సమస్యల్ని తగ్గించుకోవచ్చనీ, వయసు పెరుగుతున్న కొద్దీ కాగ్నిటివ్‌ సామర్థ్యం తగ్గడాన్ని నివారించుకోవచ్చని బెర్లిన్‌లోని వైద్య విశ్వవిద్యాలయ పరిశోధకులు యాగ్నెస్‌ ఫ్లోయెల్‌ పేర్కొన్నారు.

  • =========================== 
Visit my website at -> Dr.Seshagirirao.com/

Pain intensity is more in females,నొప్పి తీవ్రత స్త్రీలలోనే అధికం



తాజా అధ్యయనంలో వెల్లడి--మెల్‌బోర్న్‌: నొప్పుల చికిత్స విషయంలో స్త్రీ...పురుషులకు విడివిడిగా మందులు ఉండాలనీ...చికిత్సా విధానాలు సైతం వేర్వేరుగా ఉండటం తప్పనిసరని ఆస్ట్రేలియాకు చెందిన పరిశోధకులు అభిప్రాయపడ్డారు. ఎందుకంటే, నొప్పుల తీవ్రత...ప్రభావం విషయంలో స్త్రీ...పురుషుల మధ్య స్పష్టమైన వ్యత్యాసం గోచరించినట్లు వారు పేర్కొన్నారు. తీవ్రమైన నొప్పులతో బాధపడే మహిళలకు సంక్లిష్ట చికిత్స అవసరం పడుతుంది. వారితో పోలిస్తే పురుషులకు కాస్త సులువైన చికిత్సతో పరిస్థితి మెరుగు పడుతుందని తమ అధ్యయనంలో వెల్లడైందన్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే నొప్పుల చికిత్స విషయంలో స్త్రీ...పురుష బేధం తప్పనిసరిగా పాటించాల్సిందేనన్నారు. ప్రాధమికంగా నొప్పుల తీవ్రత...బాధ మహిళల్లో విపరీతంగా ఉంటుంది. ఇందుకు కారణం 'గ్లియల్‌ కణాల'(మెదడులోని రోగనిరోధక కణాలు) పనితీరు స్త్రీ...పురుషుల్లో వేర్వేరుగా ఉండటమేనని పరిశోధకులు విశ్లేషించారు.
  • ===========================
 Visit my website at -> Dr.Seshagirirao.com/

Test to detect pancreas cancer,పాంక్రియాస్‌ క్యాన్సర్‌ను పసిగట్టే రక్తపరీక్ష

  •  
  •  
వాషింగ్టన్‌: పాంక్రియాస్‌ క్యాన్సర్‌ తొలి లక్షణాలను గుర్తించేందుకు జాన్స్‌ హాప్‌కిన్స్‌ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు తేలికైన రక్తపరీక్షను రూపొందించారు. వీరిలో భారత సంతతి శాస్త్రవేత్త కూడా ఉన్నారు. పాంక్రియాస్‌ క్యాన్సర్‌ను తొలిదశలో గుర్తించటం కష్టం. అందువల్ల ఇది చాలాసార్లు ప్రాణాంతకంగా పరిణమిస్తుంది. కొత్తగా రూపొందించిన ఈ రక్తపరీక్ష.. బీఎన్‌సీ1, ఏడీఏఎమటీఎస్‌1 జన్యువుల పైభాగంలో తలెత్తే మార్పుల ఆధారంగా క్యాన్సర్‌ను పసిగడుతుంది. దీంతో తొలిదశలోనే పాంక్రియాస్‌ క్యాన్సర్‌ను గుర్తించి, చికిత్స చేయటానికి వీలవుతుందని పరిశోధకుల్లో ఒకరైన నీతా అహుజా తెలిపారు.
source : eenadu news paper 25-Oct.-2013
  • ===========================
 Visit my website at -> Dr.Seshagirirao.com/

Recognition of Alzheimer's disease Bioindicators,అల్జీమర్స్‌ జీవసూచికల గుర్తింపు

  •  

  • అల్జీమర్స్‌ జీవసూచికల గుర్తింపు
లండన్‌: వెన్నుపాము ద్రవంలో ఉండే ఆరు ప్రోటీన్లను శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇవి తొలిదశ అల్జీమర్స్‌ను గుర్తించటానికి జీవసూచికలుగా ఉపయోగపడగలవని పేర్కొన్నారు. మన మెదడులో బీటా అమిలాయిడ్‌ ప్రోటీన్‌తో కూడిన గార పోగుపడటం మూలంగా అల్జీమర్స్‌ వస్తుంది. సాధారణంగా లైసోసమ్స్‌ అనేవి ఈ ప్రోటీన్‌ పోగపడకుండా ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తుంటాయి. కానీ అల్జీమర్స్‌ బాధితుల్లో ఈ లైసోసోమ్స్‌ పని చేయవని లింకోపింగ్‌ విశ్వవిద్యాలయానికి చెందిన కటరినా కగెడల్‌ తెలిపారు. ఈ మార్పులు వెన్నుపాము ద్రవంలో కనిపించొచ్చనే అనుమానంతో పరిశోధకులు అధ్యయనం చేయగా.. ఆరు ప్రోటీన్లకు లైసోసమ్‌ వ్యవస్థతో స్పష్టంగా సంబంధం ఉన్నట్టు గుర్తించారు.

  • ===========================
 Visit my website at -> Dr.Seshagirirao.com/

17 January 2014

Brain cleaned during sleep ,మంచినిద్రతో మెదడు పరిశుభ్రం

  •  
  •  Brain cleaned during sleep ,మంచినిద్రతో మెదడు పరిశుభ్రం

వాషింగ్టన్‌: మంచి నిద్ర మెదడును పరిశుభ్రపరిచేస్తుంది అని న్యూయార్క్‌కు చెందిన శాస్త్రవేత్తలు నిర్వహించిన పరిశోధనల్లో వెల్లడైంది. బాగా నిద్రపోయే సమయంలో మెదడు కణాల మధ్య దూరం పెరుగుతుంది... తద్వారా కలుషితాలన్నీ కూడా కొట్టుకుపోతాయని శాస్త్రవేత్తలు వెల్లడించారు. నిద్రపోయేటప్పుడు మెదడులో 'లింఫాటిక్‌ సిస్టమ్‌' అనేది చురుగ్గా పనిచేయడంతో మెదడు పరిశుభ్రమౌతుందని శాస్త్రవేత్తలు విశ్లేషించారు.

source : Eeandu news paper 19-10-2013
  • =========================== 
 Visit my website at -> Dr.Seshagirirao.com/

Cancer causing gene detection,క్యాన్సర్‌ కారక జన్యువుల గుర్తింపు

  •  
  •  
 Cancer causing gene detection,క్యాన్సర్‌ కారక జన్యువుల గుర్తింపు

వాషింగ్టన్‌: క్యాన్సర్ల వృద్ధికి తోడ్పడుతున్న 127 జన్యువులను శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇది కొత్త నిర్ధరణ పరికరాలను తయారుచేయటానికి, వ్యక్తులకు అనుగుణంగా చికిత్సలను రూపొందించటానికి ఉపయోగపడగలదని భావిస్తున్నారు. కొన్ని రకాల క్యాన్సర్లలో తరచుగా మార్పు చెందే జన్యువులు ఇతర రకాల కణితుల్లోనూ కనిపిస్తున్నట్టు వాషింగ్టన్‌ విశ్వవిద్యాలయం అధ్యయనంలో బయటపడింది. ''ఇది ఆరంభం మాత్రమే. మనుషుల్లో వచ్చే అన్నిరకాల క్యాన్సర్లకు కారణమయ్యే జన్యువుల జాబితాను రూపొందించే అవకాశంపై శాస్త్రవేత్తలు, క్యాన్సర్‌ నిపుణులు ఇప్పుడు ఎంతో ఆసక్తి చూపుతున్నారు. దానికి మనం చేరువ అవుతున్నామనే అనుకుంటున్నా'' అని అధ్యయన నేత లి డింగ్‌ వ్యాఖ్యానించారు.

source : Eenadu news paper 19-10-2013

  • =========================== 
Visit my website at -> Dr.Seshagirirao.com/

15 January 2014

Alzimers Test in 15 minutes,15 నిమిషాల్లో అల్జీమర్స్‌ పరీక్ష

  •  
  •  

-15 నిమిషాల్లో అల్జీమర్స్‌ పరీక్ష-
వాషింగ్టన్‌: అల్జీమర్స్‌ ప్రాథమిక లక్షణాలను 15 నిమిషాల్లో గుర్తించే పరీక్షావిధానాన్ని అమెరికా శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈ పరీక్షను ఇంటి వద్దే చేసుకోవచ్చని పేర్కొన్నారు. 'ఎస్‌ఏజీఈ-సేజ్‌ టెస్ట్‌'.. సొంతంగా ఎవరికివారే చేసుకోవచ్చని, లక్షణాల ఆధారంగా వైద్యులు ఓ నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంటుందని ఓహియో స్టేట్‌ వర్సిటీ పరిశోధకులు వెల్లడించారు.

  • =========================== 
Visit my website at -> Dr.Seshagirirao.com/

Memory power in the in dental cleaness,తళతళ జ్ఞాపకశక్తికి దంతాల చిగుళ్ల శుభ్రత

  •  
  •  


చిరునవ్వుకు తెల్లగా మెరిసే దంతాలు మరింత అందాన్ని తెచ్చిపెడతాయి కదా. అంతేకాదు. ఇవి జ్ఞాపకశక్తిని కాపాడటానికీ తోడ్పడతాయని పరిశోధకులు చెబుతున్నారు. దంతాల, చిగుళ్ల శుభ్రతకూ అల్జీమర్స్‌ జబ్బుకూ సంబంధం ఉంటోందని తేలటమే దీనికి నిదర్శనం. తీవ్ర మతిమరుపు (డిమెన్షియా) బారినపడ్డవారు చనిపోయిన తర్వాత వారి మెదడు కణజాలంపై పరిశోధకులు ఇటీవల ఒక అధ్యయనం చేశారు. డిమెన్షియా బాధితుల మెదళ్లలో పి.జింజివలిస్‌ బ్యాక్టీరియా ఆనవాళ్లు ఉన్నట్టు ఇందులో తేలటం గమనార్హం. తీవ్ర చిగుళ్లవాపు జబ్బుకు దోహదం చేసే పి.జింజివలిస్‌ బ్యాక్టీరియా.. మనం భోజనం చేసినప్పుడో, పళ్లు తోముకుంటున్నప్పుడో రక్త ప్రవాహంలో కలుస్తుంది. అక్కడ్నుంచి అది మెదడుకు చేరుకుంటున్నట్టు పరిశోధకులు అనుమానిస్తున్నారు. ఈ బ్యాక్టీరియా మెదడుకు చేరుకున్న ప్రతీసారీ అక్కడ రోగనిరోధక ప్రతిస్పందనను ప్రేరేపిస్తోందని భావిస్తున్నారు. దీంతో మెదడు కణాల నుంచి విడుదలయ్యే రసాయనాలు బ్యాక్టీరియా మీదనే కాదు.. నాడీ కణాలు మీదా దాడిచేసి వాటిని దెబ్బతీస్తాయన్నమాట. ఇది చివరికి డిమెన్షియాకు దారితీస్తుంది.

   
 source : Medical Trends and updates magazine
  • ===========================
 Visit my website at -> Dr.Seshagirirao.com/

14 January 2014

Uterus transplantation,గర్భాశయం మార్పిడి




9 మంది గర్భసంచి మార్పిడి
స్టాక్‌హోం: స్వీడన్‌ వైద్యులు.. 9 మంది మహిళలకు గర్భాశయాన్ని అమర్చారు. బంధువుల నుంచి సేకరించి, వీరి శరీరంలోకి ప్రవేశపెట్టారు. గర్భం దాల్చేందుకు కూడా వారు ప్రయత్నిస్తారని ప్రాజెక్టులో పాలుపంచుకున్న వైద్యులు తెలిపారు. మహిళల్లో గర్భాశయ మార్పిడి సాధ్యమేనా అన్నది పరిశీలించేందుకు దీన్ని చేపట్టారు. ఈ మహిళలు గర్భాశయం లేకుండా జన్మించడమో, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ కారణంగా వాటిని తొలగించడమో జరిగింది. వీరంతా 30లలో ఉన్నారు. ప్రాణాధారమైన గుండె, కాలేయం, మూత్రపిండాల మార్పిడిని వైద్యులు కొన్ని దశాబ్దాలుగా చేపడుతున్నారు. ఇప్పుడు రోగి చేతులు, ముఖం, ఇతర భాగాల మార్పిడి కూడా జరుగుతోంది. గర్భాశయ మార్పిడి మాత్రం విజయవంతం కాలేదు. లోగడ టర్కీ, సౌదీ అరేబియాల్లో ప్రయోగాలు జరిగాయి. అయితే ప్రయోగార్థులకు సంతానప్రాప్తి కలగలేదు. బ్రిటన్‌, హంగేరి, అమెరికాల్లో ఇలాంటి శస్త్రచికిత్సలు చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. వీటన్నింటి కన్నా అత్యాధునిక పద్ధతిలో స్వీడన్‌ పరిశోధకులు ఆపరేషన్‌ చేపట్టారు. గోథెన్‌బర్గ్‌ వర్సిటీకిచెందిన మాట్స్‌ బ్రాన్‌స్ట్రామ్‌ నేతృత్వంలోని నిపుణుల బృందం దీన్ని నిర్వహించింది.

  • ===========================
 Visit my website at -> Dr.Seshagirirao.com/

03 January 2014

TV effect on Sperm,వీర్యంపై టీవీ ప్రభావం

  •  
  •  

శారీరక శ్రమ లేకపోవటం, చాలాసేపు టీవీ చూడటం వల్ల వీర్యం చిక్కదనం, వీర్యకణాల సంఖ్య తగ్గుతున్నట్టు తాజా అధ్యయనంలో బయటపడింది. హార్వర్డ్‌ స్కూల్‌ ఆఫ్‌ పబ్లిక్‌హెల్త్‌కు చెందిన ఆడ్రే గాస్కిన్స్‌ చాలాకాలంగా వీర్యంపై ఆహారం, వ్యాయామం చూపే ప్రభావాలపై అధ్యయనం చేస్తున్నారు. శారీరక శ్రమ మూలంగా ఆక్సిడేటివ్‌ స్ట్రెస్‌ (విశృంఖల కణాలను తొలగించుకునే సమయంలో శరీరంపై పడే ఒత్తిడి) తగ్గుతున్నట్టు.. ఇది వీర్య కణాల రక్షణకు తోడ్పడుతున్నట్టు గత అధ్యయనాల్లో గుర్తించారు. ఈ ఫలితాల ఆధారంగా ఆమె యువకులపై తాజాగా అధ్యయనం చేశారు. వారానికి 15 గంటల పాటు ఒక మాదిరి నుంచి తీవ్ర వ్యాయామం చేసినవారిలో వీర్యం చిక్కదనం చాలా ఎక్కువగా ఉంటున్నట్టు బయటపడింది. అలాగే టీవీ చూడని వారితో పోలిస్తే వారానికి 20 గంటల పాటు టీవీ ముందు గడిపే యువకుల్లో వీర్యకణాల సంఖ్య సుమారు సగం వరకు తక్కువగా ఉంటున్నట్టు తేలింది. వీర్యకణాల చురుకుదనం, వాటి ఆకారం విషయంలో మాత్రం మార్పులేవీ కనబడలేదని వివరిస్తున్నారు. కేవలం ఈ ఫలితాల ఆధారంగా వ్యాయామంతో సంతాన సామర్థ్యం మెరుగుపడుతుందని కచ్చితంగా చెప్పలేమంటున్నారు. ఇతరత్రా లాభాలు చాలా ఉంటాయి కాబట్టి వేగంగా నడవటం, పరుగు, సైకిల్‌ తొక్కటం, ఈత వంటివి చేయటం మంచిదని సూచిస్తున్నారు.

  • ===========================
 Visit my website at -> Dr.Seshagirirao.com/