తాజా అధ్యయనంలో వెల్లడి--మెల్బోర్న్: నొప్పుల చికిత్స విషయంలో స్త్రీ...పురుషులకు విడివిడిగా మందులు ఉండాలనీ...చికిత్సా విధానాలు సైతం వేర్వేరుగా ఉండటం తప్పనిసరని ఆస్ట్రేలియాకు చెందిన పరిశోధకులు అభిప్రాయపడ్డారు. ఎందుకంటే, నొప్పుల తీవ్రత...ప్రభావం విషయంలో స్త్రీ...పురుషుల మధ్య స్పష్టమైన వ్యత్యాసం గోచరించినట్లు వారు పేర్కొన్నారు. తీవ్రమైన నొప్పులతో బాధపడే మహిళలకు సంక్లిష్ట చికిత్స అవసరం పడుతుంది. వారితో పోలిస్తే పురుషులకు కాస్త సులువైన చికిత్సతో పరిస్థితి మెరుగు పడుతుందని తమ అధ్యయనంలో వెల్లడైందన్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే నొప్పుల చికిత్స విషయంలో స్త్రీ...పురుష బేధం తప్పనిసరిగా పాటించాల్సిందేనన్నారు. ప్రాధమికంగా నొప్పుల తీవ్రత...బాధ మహిళల్లో విపరీతంగా ఉంటుంది. ఇందుకు కారణం 'గ్లియల్ కణాల'(మెదడులోని రోగనిరోధక కణాలు) పనితీరు స్త్రీ...పురుషుల్లో వేర్వేరుగా ఉండటమేనని పరిశోధకులు విశ్లేషించారు.
- ===========================
Visit my website at ->
Dr.Seshagirirao.com/
No comments:
Post a Comment
Thanks for your Comment . Your feedback is important for improvement of this blog.