వాషింగ్టన్: పాంక్రియాస్ క్యాన్సర్ తొలి లక్షణాలను గుర్తించేందుకు జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు తేలికైన రక్తపరీక్షను రూపొందించారు. వీరిలో భారత సంతతి శాస్త్రవేత్త కూడా ఉన్నారు. పాంక్రియాస్ క్యాన్సర్ను తొలిదశలో గుర్తించటం కష్టం. అందువల్ల ఇది చాలాసార్లు ప్రాణాంతకంగా పరిణమిస్తుంది. కొత్తగా రూపొందించిన ఈ రక్తపరీక్ష.. బీఎన్సీ1, ఏడీఏఎమటీఎస్1 జన్యువుల పైభాగంలో తలెత్తే మార్పుల ఆధారంగా క్యాన్సర్ను పసిగడుతుంది. దీంతో తొలిదశలోనే పాంక్రియాస్ క్యాన్సర్ను గుర్తించి, చికిత్స చేయటానికి వీలవుతుందని పరిశోధకుల్లో ఒకరైన నీతా అహుజా తెలిపారు.
source : eenadu news paper 25-Oct.-2013
- ===========================
Visit my website at ->
Dr.Seshagirirao.com/
No comments:
Post a Comment
Thanks for your Comment . Your feedback is important for improvement of this blog.