Reduction of brain cells with Diabetes,మధుమేహంతో మెదడు కణజాలం క్షీణత!
- వాషింగ్టన్: మధుమేహం దుష్ప్రభావం మెదడుపై బాగా ఉంటుందని తాజా అధ్యయనం హెచ్చరించింది. ఈ వ్యాధి సంక్రమించిన తర్వాత ప్రతి పదేళ్లకోసారి మెదడు అకాల వార్ధక్యానికి చేరువవుతూ కుంచించుకు పోయే ప్రమాదం ఉంది. మెదడు కణజాలం క్షీణిస్తుందని పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయ పరిశోధకులు తెలిపారు. ముఖ్యంగా టైప్-2 మధుమేహం సర్వసాధారణమైనది. ఈ నేపథ్యంలోనే క్లోమగ్రంధి తగిన ఇన్సులిన్ను ఉత్పత్తి చేయలేకపోవచ్చు. సుదీర్ఘకాలం పాటు మధుమేహంతో బాధపడుతున్న వారిలో మెదడు పరిమాణం తరుగుదల తమ పరిశోధనల్లో సుస్పష్టంగా తెలిసిందని పరిశోధకులు వివరించారు.
- ===========================
Visit my website at ->
Dr.Seshagirirao.com/
No comments:
Post a Comment
Thanks for your Comment . Your feedback is important for improvement of this blog.