వాషింగ్టన్ : జన్యుమార్పుతో మానవుల ఆయుష్షును పెంచుకోవడం సాధ్యమేనని చెబుతున్నారు అమెరికా నేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ హెల్త్కి చెందిన పరిశోధకులు. ఆ లక్ష్యంగా సాగిన తమ పరిశోధనలతో చిట్టెలుక ఆయుష్షును 20 శాతం పెంచామని అంటున్నారు. ఈ ప్రయోగం మానవుల్లోనూ విజయవంతమైతే మామూలు కన్నా 16 ఏళ్లపాటు ఆయుష్షు పెరగవచ్చని చెబుతున్నారు. ముందుగా శాస్త్రవేత్తలు చిట్టెలుక జీవక్రియకు తోడ్పడే 'ఎం-టీఓఆర్' అనే జన్యువు 'వ్యక్తీకరణను' తగ్గించి దాని శక్తిని మందగించారు. మామూలు ఆడచిట్టెలుకలు 26.5 నెలలు జీవిస్తే.. జన్యుమార్పిడికి లోనైనవి 31.5 నెలలు జీవించాయట. వృద్ధాప్యంలోనూ మిగతావాటికంటే ఎక్కువ మేధస్సుతో, చురుగ్గానే ఉన్నాయట. అయితే.. జన్యుమార్పిడితో సమస్యలు లేకపోలేదు. సాధారణ చిట్టెలుకలకంటే వీటి ఆకారం కొద్దిగా చిన్నగానే ఉందట. వృద్ధాప్యంలో మేధోపరంగా మంచి చురుకుదనం ఉన్నా.. వీటి ఎముకలు తొందరగా క్షీణించాయని పరిశోధకులు చెబుతున్నారు.
- ===========================
Visit my website at ->
Dr.Seshagirirao.com/