25 July 2015

Glucoma medicine helps to treat resistence TB-మొండి క్షయకు నీటికాసుల మందు

  •  

  •  
నీటికాసుల (గ్లకోమా) చికిత్సలో వాడే ఎథాగ్జోలమైడ్‌ మందు క్షయను నిలువరించటానికీ తోడ్పడుతున్నట్టు మిచిగన్‌ స్టేట్‌ విశ్వవిద్యాలయం (ఎంఎస్‌యూ) పరిశోధకులు గుర్తించారు. ఇది రోగనిరోధక వ్యవస్థలోకి క్షయ చొరబడే సామర్థ్యాన్ని నిర్వీర్యం చేస్తుండటం గమనార్హం. ''క్షయ కారక బ్యాక్టీరియా రోగనిరోధక వ్యవస్థలోని కొన్ని తెల్ల రక్త కణాల్లో వృద్ధి చెందటానికి అవసరమైన సామర్థ్యాన్ని ఎథాగ్జోలమైడ్‌ పూర్తిగా తగ్గిస్తోంది'' అని ఎంఎస్‌యూ శాస్త్రవేత్త రాబర్ట్‌ అబ్రామోవిచ్‌ తెలిపారు. శరీరంలో ఆమ్ల స్థాయుల వంటి అనువైన పరిస్థితులను పసిగడుతూ క్షయ కారక బ్యాక్టీరియా వాటికి అనుగుణంగా మారుతుంది. ఈ సామర్థ్యాన్ని ఎథాగ్జోలమైడ్‌ నిలువరిస్తున్నట్టు గుర్తించామని అబ్రామోవిచ్‌ పేర్కొన్నారు. ఇది క్షయ వ్యాప్తిని నివారించటానికే కాదు. చికిత్స సమయాన్ని తగ్గించటానికి, క్షయ కారక క్రిమి మందులను తట్టుకునేలా మారటాన్ని ఆలస్యం చేయటానికీ తోడ్పడగలదన్నారు. ఈ మందు ఎలుకల్లో క్షయ లక్షణాలను తగ్గించినట్టు గుర్తించామని తెలిపారు.

Root of over-eating is in brain!-అతి తిండికి మూలం మెదడులో!

  •  

  •  
కొందరు కేవలం ఆనందం కోసమే అతిగా తింటుంటారు. దీనికి గ్లుకాగోన్‌ తరహా పెప్త్టెడ్‌-1 (జీఎల్‌పీ-1) హార్మోన్‌ మెదడులో లేకపోవటం పాక్షికంగా కారణమవుతున్నట్టు తాజా అధ్యయనంలో బయటపడింది. ఇది వూబకాయానికి తక్కువ దుష్ప్రభావాలతో ప్రత్యేకమైన చికిత్సలను రూపొందించటానికి దారితీయగలదని ఆశిస్తున్నారు. కేంద్ర నాడీవ్యవస్థలో జీఎల్‌పీ-1 హార్మోన్‌ తగ్గినపుడు అతిగా.. అదీ ఎక్కువ కొవ్వుతో కూడిన ఆహారాన్ని తినటానికి దారితీస్తున్నట్టు రాబర్ట్‌ వుడ్‌ జాన్సన్స్‌ మెడికల్‌ స్కూల్‌ పరిశోధకులు గుర్తించారు. ఎలుకల మెదడులో జీఎల్‌పీ-1 హార్మోన్‌ సంకేతాలను ప్రేరేపించగా అధిక కొవ్వు పదార్థాలను ఎంచుకోవటం ఆగిపోయిందని సహ అధ్యయన కర్త విన్సెంట్‌ మిరాబెల్లా తెలిపారు. అమైనో ఆమ్లాల అమరికతో కూడిన జీఎల్‌పీ-1 పెప్త్టెడ్లు మన ఆహార అలవాట్లను నియంత్రించటం వంటి రకరకాల పనుల్లో పాలు పంచుకుంటాయి. చిన్న పేగులు, మెదడులోని కణాల నుంచి పుట్టుకొచ్చే ఇవి భోజనం చేస్తున్నప్పుడు కడుపు నిండిందనే విషయాన్ని మెదడుకు చేరవేస్తాయి. నిజానికి అతిగా తినటానికి ఇవొక్కటే కారణం కాకపోయినప్పటికీ.. మెదడులో మెసోలింబిక్‌ డొపమైన్‌ వ్యవస్థలోని నాడీ కణాలపై మాత్రమే పనిచేసే చికిత్సలతో అతిగా తినటాన్ని నియంత్రించొచ్చని తాజా అధ్యయనం సూచిస్తోంది. తక్కువ దుష్ప్రభావాలతో వూబకాయానికి చికిత్స చేసే అవకాశముందని పరిశోధకులు భావిస్తున్నారు

29 May 2015

skin allergic probles with Tatoo marks,పచ్చబొట్టుతో చర్మ సమస్యల ముప్పు!






skin allergic probles with Tatoo marks,పచ్చబొట్టుతో చర్మ సమస్యల ముప్పు!
న్యూయార్క్‌: పచ్చబొట్టుతో దద్దు, వాపు వంటివి తలెత్తొచ్చని.. ఇవి దీర్ఘకాలం వేధించే అవకాశముందని తాజా అధ్యయనం హెచ్చరించింది. వీటికి లేజర్‌ శస్త్రచికిత్స చేయాల్సిన అవసరమూ ఉండొచ్చని పేర్కొంది. పచ్చబొట్టు వేయించుకున్నవారిలో సుమారు 6% మందికి దద్దు, తీవ్రమైన దురద లేదా వాపు వంటి సమస్యలు ఎదురవుతున్నట్టు ఎన్‌వైయూ ల్యాంగోన్‌ మెడికల్‌ సెంటర్‌ పరిశోధకులు గుర్తించారు. పచ్చబొట్టు ప్రభావాలు నాలుగు నెలల నుంచి నాలుగేళ్ల పాటు కొనసాగుతుండటం గమనార్హం. పచ్చబొట్టు వేయించుకోవటానికి ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో దీని మూలంగా తలెత్తే ముప్పులపైనా వైద్యులు, ప్రజారోగ్య అధికారులు, వినియోగదారులు అవగాహన పెంచుకోవాల్సిన అవసరముందని అధ్యయన నేత మేరీ లెగెర్‌ తెలిపారు. కొన్ని చర్మ రియాక్షన్లను స్టీరాయిడ్‌ మందులతో నయం చేయొచ్చని, కానీ మరికొన్నింటికి లేజర్‌ శస్త్రచికిత్స అవసరమవుతుందని వివరించారు

  • =========================== 
Visit my website at -> Dr.Seshagirirao.com/

Blood sugar detecting chip,రక్తంలో గ్లూకోజును గుర్తించే బయో చిప్‌ సృష్టి




జెనీవా: శరీర ఉష్ణోగ్రత, ఆమ్ల స్థాయులతో పాటు రక్తంలో గ్లూకోజు, కొలెస్ట్రాల్‌ స్థాయులను పసిగట్టే బయోసెన్సర్‌ చిప్‌ను స్విట్జర్లాండ్‌ శాస్త్రవేత్తలు రూపొందించారు. కేవలం చదరపు సెంటీమీటరు పొడవుండే దీన్ని చర్మం కింద అమర్చితే చాలు. ఎప్పటికప్పుడు గ్లూకోజు, కొలెస్ట్రాల్‌ వంటి వాటి స్థాయులను గుర్తించి.. బ్లూటూత్‌ ద్వారా ఆ సమాచారాన్ని మొబైల్‌ ఫోన్‌కు చేరవేస్తుంది. ఇది రక్తంలో మందుల ఉనికినీ పసిగడుతుండటం గమనార్హం. ఇందులో ఆరు సెన్సర్లతో కూడిన సర్క్యూట్‌, సంకేతాలను విశ్లేషించే విభాగం, రేడియో ట్రాన్స్‌మిషన్‌ మాడ్యూల్‌ ఉంటాయి. చర్మం మీద అతికించే పట్టీలో ఉండే బ్యాటరీ నుంచి శక్తిని తీసుకోవటానికి ఇందులో ఒక ఇండక్షన్‌ కాయిల్‌ కూడా ఉంటుంది. ఎలుకలపై పరీక్షించి చూడగా.. ఇది గ్లూకోజు స్థాయులను నిరంతరం పర్యవేక్షించినట్టు తేలింది. ఫలితాలు కచ్చితంగా ఉండటంతో దీన్ని 3-5 ఏళ్లలో మనుషులపై పరీక్షించే అవకాశముందని పరిశోధకులు తెలిపారు.
  • ===========================
 Visit my website at -> Dr.Seshagirirao.com/

18 May 2015

More sleep may lead to paralysis,అతి నిద్రతో పక్షవాతం

  •  




నిద్రలేమితో శరీరంలో ఒత్తిడి హార్మోన్ల స్థాయులు ఎక్కువవుతాయి. దీంతో అధిక రక్తపోటు, పక్షవాతం వంటి రకరకాల సమస్యల ముప్పూ పెరుగుతుంది. కానీ ఎక్కువసేపు నిద్రపోవటం కూడా అనర్థం తెచ్చిపెడుతుందని మీకు తెలుసా? రాత్రి పూట రోజుకి 8 గంటల కన్నా ఎక్కువసేపు నిద్రపోయే పెద్దవాళ్లకు పక్షవాతం ముప్పు పొంచి ఉంటున్నట్టు తాజాగా బయటపడింది. సాధారణంగా రోజుకి రాత్రి పూట 6-8 గంటల సేపు నిద్రపోవాలన్నది నిపుణుల సూచన. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇలా నిర్ణీత సమయం మేరకు నిద్రించేవారితో పోలిస్తే 8 గంటల కన్నా ఎక్కువసేపు నిద్రపోయేవారికి పక్షవాతం ముప్పు 46% అధికంగా ఉంటున్నట్టు కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయ అధ్యయనంలో బయటపడింది. ఇందులో భాగంగా పరిశోధకులు 42-81 ఏళ్లకు చెందిన 9,700 మందిని ఎంచుకొని నిద్ర తీరు తెన్నులను నమోదు చేశారు. తొమ్మిదేళ్ల తర్వాత పరిశీలించగా.. 346 మంది పక్షవాతం బారినపడినట్టు తేలింది. వీరిలో రోజుకి 8 గంటల కన్నా ఎక్కువసేపు నిద్రపోయేవారికి ఈ ముప్పు మరింత ఎక్కువగా ఉంటున్నట్టు బయటపడింది. అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్‌ స్థాయులు, శరీర ఎత్తు బరువుల నిష్పత్తి, శారీరక శ్రమ వంటి వాటిని పరిగణనలోకి తీసుకొని చూసినా అతి నిద్రతో ముప్పు పొంచి ఉంటుండటం గమనార్హం. తరచుగా నిద్ర పద్ధతులు మారిపోవటం.. అంటే కొన్నిరోజులు 6 గంటల కన్నా తక్కువ సేపు మరికొన్ని రోజులు 8 గంటల కన్నా ఎక్కువసేపు నిద్రపోవటమూ మంచిది కాదని పరిశోధకులు చెబుతున్నారు. ఇలాంటివారికి పక్షవాతం ముప్పు నాలుగు రెట్లు అధికంగా ఉంటోందనీ వివరిస్తున్నారు. అతిగా నిద్రపోవటం పక్షవాతానికి హెచ్చరిక సంకేతమే కావొచ్చు గానీ నిద్ర పద్ధతులు మారిపోవటం మరింత ప్రమాదరకరంగా పరిణమిస్తోందని పరిశోధకులు పేర్కొంటున్నారు. నిజంగా అతి నిద్రే పక్షవాతానికి కారణమవుతోందా? అతి నిద్ర ఫలితంగా పక్షవాతం సంభవిస్తోందా? లేకపోతే ఏదైనా అనారోగ్యానికి ఇది ముందస్తు సూచికా? అనేవి ఇంకా బయటపడలేదు. దీనిపై మరింత అధ్యయనం చేయాల్సి ఉందని, అందువల్ల పక్షవాతం ముప్పును తగ్గించుకోవటానికి నిద్రించే సమయాన్ని తప్పకుండా తగ్గించుకోవాలని ఇప్పుడప్పుడే చెప్పలేమని అధ్యయన నేత యూ లెంగ్‌ చెబుతున్నారు. అయితే తగినంత నిద్రపోవటం మంచి ఆరోగ్యానికి కీలకమన్న విషయాన్ని గుర్తించాలని సూచిస్తున్నారు.

  • =========================== 
 Visit my website at -> Dr.Seshagirirao.com/

15 April 2015

Whim syndrome treatment with gene mutation, జన్యు ఉత్పరివర్తనంతో అరుదైన వ్యాధి 'విమ్‌ సిండ్రోమ్ నయం


  • జన్యు ఉత్పరివర్తనంతో మహిళలో అరుదైన వ్యాధి  'విమ్‌ సిండ్రోమ్ నయం--

లండన్‌: వైద్య చరిత్రలోనే ఆశ్చర్యకరమైన అంశం ఇది. రోగ నిరోధక శక్తి క్షీణించి, నియంత్రణ లేకుండా కణతులు వచ్చే అరుదైన వ్యాధి ఉన్న ఒక మహిళలో అదృష్టవశాత్తూ జరిగిన డీఎన్‌ఏ ఉత్పరివర్తనం ఆ వ్యాధిని నయం చేసింది. దాదాపు 50 ఏళ్ల క్రితం ఒక మహిళ రోగ నిరోధక శక్తిలో లోపం వల్ల శరీరం మొత్తం కణతులు వ్యాపించాయి. ఈ వ్యాధిని 'విమ్‌ సిండ్రోమ్‌'గా వైద్యులు నిర్ధరించారు. డీఎన్‌ఏలోని ఒక భాగంలో లోపం వల్ల ఇది వస్తుంది. ప్రస్తుతం 58 ఏళ్ల వయసున్న సదరు మహిళ ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్న తన ఇద్దరు కుమార్తెలను పరీక్షించాల్సిందిగా అమెరికాలోని 'నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ అలెర్జీ అండ్‌ ఇన్‌ఫెక్చువస్‌ డిసీజెస్‌' పరిశోధకులను ఇటీవల సంప్రదించింది. తన కణతులు 20 ఏళ్ల క్రితమే తగ్గిపోయాయని ఆమె తెలిపింది. దీంతో ఆమె డీఎన్‌ఏను పరీక్షించిన వైద్యులు అవాక్కయ్యారు. ఆమెకు 30 ఏళ్ల వయసులో ఎముక మజ్జలోని ఒక కణంలో జరిగిన డీఎన్‌ఏ ఉత్పరివర్తనం వల్ల వ్యాధి పూర్తిగా నయమైందని వైద్యులు తేల్చారు. ఉత్పరివర్తనంలో భాగంగా వ్యాధికారక జన్యువు తొలగిపోయిందని తెలిపారు.---09-Feb-2015

  • =========================== 
Visit my website at -> Dr.Seshagirirao.com/

New technic to detect heat-attack-గుండెపోటును గుర్తించే కొత్త పద్ధతి




  • New technic to detect heat-attack-గుండెపోటును గుర్తించే కొత్త పద్ధతి
జెనీవా: ఒక వ్యక్తి గుండెపోటుకు లోనైన సంగతిని గంట వ్యవధిలో వేగంగా గుర్తించే సరికొత్త పద్ధతిని రూపొందించినట్లు శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. దీనివల్ల వేగంగా, నిక్కచ్చిగా చికిత్స అందించే అవకాశం మెరుగవుతుందని చెబుతున్నారు. గుండెపోటుగా వ్యవహరించే అక్యూట్‌ మయోకార్డియల్‌ ఇన్‌ఫార్‌క్షన్‌ (ఎంఐ) ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా మరణాలకు కారణమవుతున్న సమస్య. ప్రాథమిక స్థాయిలో సమస్యను గుర్తించడమే కీలకం. ఈ అధ్యయనంలో భాగంగా.. ఎంఐ వచ్చిందనే అనుమానంతో ఆస్పత్రిని సందర్శించిన 1320 మంది రోగుల్ని ఎంచుకుని రక్తనమూనాలను అత్యంత సున్నితమైన కార్డియాక్‌ ట్రోపోనిన్‌-టీ అల్గారిథమ్‌ ద్వారా పరిశీలించారు. అల్గారిథం సాయంతో 60 శాతం మంది రోగులకు ఎంఐ బారినపడలేదనీ, 16 శాతంమంది ముప్పు బారిన పడినట్లు గుర్తించారు. ప్రస్తుతం వైద్యులు గుండెపోటును గుర్తించేందుకు ఈకేజీ, రక్తపరీక్షలు, యాంజియోగ్రఫీ వంటివి నిర్వహిస్తున్నారు. కాకపోతే ఇవన్నీ గంటలకొద్దీ సమయం తీసుకునే ప్రక్రియలు. ------ 15/April/2015
  • =========================== 
 Visit my website at -> Dr.Seshagirirao.com/