15 April 2015

Whim syndrome treatment with gene mutation, జన్యు ఉత్పరివర్తనంతో అరుదైన వ్యాధి 'విమ్‌ సిండ్రోమ్ నయం


  • జన్యు ఉత్పరివర్తనంతో మహిళలో అరుదైన వ్యాధి  'విమ్‌ సిండ్రోమ్ నయం--

లండన్‌: వైద్య చరిత్రలోనే ఆశ్చర్యకరమైన అంశం ఇది. రోగ నిరోధక శక్తి క్షీణించి, నియంత్రణ లేకుండా కణతులు వచ్చే అరుదైన వ్యాధి ఉన్న ఒక మహిళలో అదృష్టవశాత్తూ జరిగిన డీఎన్‌ఏ ఉత్పరివర్తనం ఆ వ్యాధిని నయం చేసింది. దాదాపు 50 ఏళ్ల క్రితం ఒక మహిళ రోగ నిరోధక శక్తిలో లోపం వల్ల శరీరం మొత్తం కణతులు వ్యాపించాయి. ఈ వ్యాధిని 'విమ్‌ సిండ్రోమ్‌'గా వైద్యులు నిర్ధరించారు. డీఎన్‌ఏలోని ఒక భాగంలో లోపం వల్ల ఇది వస్తుంది. ప్రస్తుతం 58 ఏళ్ల వయసున్న సదరు మహిళ ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్న తన ఇద్దరు కుమార్తెలను పరీక్షించాల్సిందిగా అమెరికాలోని 'నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ అలెర్జీ అండ్‌ ఇన్‌ఫెక్చువస్‌ డిసీజెస్‌' పరిశోధకులను ఇటీవల సంప్రదించింది. తన కణతులు 20 ఏళ్ల క్రితమే తగ్గిపోయాయని ఆమె తెలిపింది. దీంతో ఆమె డీఎన్‌ఏను పరీక్షించిన వైద్యులు అవాక్కయ్యారు. ఆమెకు 30 ఏళ్ల వయసులో ఎముక మజ్జలోని ఒక కణంలో జరిగిన డీఎన్‌ఏ ఉత్పరివర్తనం వల్ల వ్యాధి పూర్తిగా నయమైందని వైద్యులు తేల్చారు. ఉత్పరివర్తనంలో భాగంగా వ్యాధికారక జన్యువు తొలగిపోయిందని తెలిపారు.---09-Feb-2015

  • =========================== 
Visit my website at -> Dr.Seshagirirao.com/

New technic to detect heat-attack-గుండెపోటును గుర్తించే కొత్త పద్ధతి




  • New technic to detect heat-attack-గుండెపోటును గుర్తించే కొత్త పద్ధతి
జెనీవా: ఒక వ్యక్తి గుండెపోటుకు లోనైన సంగతిని గంట వ్యవధిలో వేగంగా గుర్తించే సరికొత్త పద్ధతిని రూపొందించినట్లు శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. దీనివల్ల వేగంగా, నిక్కచ్చిగా చికిత్స అందించే అవకాశం మెరుగవుతుందని చెబుతున్నారు. గుండెపోటుగా వ్యవహరించే అక్యూట్‌ మయోకార్డియల్‌ ఇన్‌ఫార్‌క్షన్‌ (ఎంఐ) ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా మరణాలకు కారణమవుతున్న సమస్య. ప్రాథమిక స్థాయిలో సమస్యను గుర్తించడమే కీలకం. ఈ అధ్యయనంలో భాగంగా.. ఎంఐ వచ్చిందనే అనుమానంతో ఆస్పత్రిని సందర్శించిన 1320 మంది రోగుల్ని ఎంచుకుని రక్తనమూనాలను అత్యంత సున్నితమైన కార్డియాక్‌ ట్రోపోనిన్‌-టీ అల్గారిథమ్‌ ద్వారా పరిశీలించారు. అల్గారిథం సాయంతో 60 శాతం మంది రోగులకు ఎంఐ బారినపడలేదనీ, 16 శాతంమంది ముప్పు బారిన పడినట్లు గుర్తించారు. ప్రస్తుతం వైద్యులు గుండెపోటును గుర్తించేందుకు ఈకేజీ, రక్తపరీక్షలు, యాంజియోగ్రఫీ వంటివి నిర్వహిస్తున్నారు. కాకపోతే ఇవన్నీ గంటలకొద్దీ సమయం తీసుకునే ప్రక్రియలు. ------ 15/April/2015
  • =========================== 
 Visit my website at -> Dr.Seshagirirao.com/

19 November 2014

Less sleep leads to more obesity,నిద్రలేమి బరువు ముప్పు

  •  


Less sleep leads to more obesity,నిద్రలేమి బరువు ముప్పు

ఎదిగే వయసులో తగినంత నిద్ర తప్పనిసరి. లేకపోతే ఇది చదువుల పైనా ప్రభావం చూపుతుంది. ఇది మున్ముందు వూబకాయం బారిన పడకుండా కూడా కాపాడుతున్నట్టు తాజాగా బయటపడింది. రాత్రిపూట తగినంత సేపు నిద్రపోని యుక్తవయసు పిల్లలకు వూబకాయం ముప్పు పెరుగుతున్నట్టు తేలింది. ఇటీవల పరిశోధకులు సుమారు 10వేల మంది నుంచి సేకరించిన సమాచారాన్ని విశ్లేషించారు. 16 ఏళ్ల వయసులో ఉండగా వీరిలో ప్రతి ఐదుగురిలో ఒకరు రాత్రిపూట 6 గంటల కన్నా తక్కువసేపు నిద్రపోయినట్టు గుర్తించారు. రాత్రిపూట 8 గంటల కన్నా ఎక్కువసేపు నిద్రపోయినవారితో పోలిస్తే.. వీరికి వూబకాయం ముప్పు 20% ఎక్కువగా ఉంటున్నట్లు, అదీ 21 ఏళ్లు వచ్చేసరికే దీని ప్రభావం కనబడుతున్నట్టు తేలింది. ''యుక్తవయసులో తగినంత నిద్రపోకపోతే మున్ముందు వూబకాయం బారినపడే అవకాశముంది. ఒకసారిబకాయులైతే ఆ తర్వాత బరువు తగ్గించుకోవటం చాలా కష్టమవుతుంది. ఇది గుండెజబ్బు, మధుమేహం, క్యాన్సర్‌ వంటి సమస్యలకూ దారితీస్తుంది'' అని అధ్యయన నేత, కొలంబియా విశ్వవిద్యాలయానికి చెందిన షకీరా సుగిలా హెచ్చరిస్తున్నారు. తల్లిదండ్రులు కూడా ఈ విషయాన్ని గుర్తించి పిల్లలు రాత్రిపూట 8 గంటల కన్నా ఎక్కవసేపు నిద్రపోయేలా జాగ్రత్త తీసుకోవాలని సూచిస్తున్నారు. ఇది చదువులో రాణించటానికే కాదు. పెద్దయ్యాక ఆరోగ్యవంతులుగా ఉండటానికీ తోడ్పడుతుందని వివరిస్తున్నారు. యుక్తవయసు పిల్లలకు రాత్రిపూట దాదాపు 10 గంటల నిద్ర అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. నిద్రలేమితో సతమతమయ్యేవారు కేలరీలు అధికంగా ఉండే ఫాస్ట్‌ఫుడ్‌లను ఎక్కువగా ఇష్టపడుతుంటారు. ఇలాంటి ఆహార అలవాట్లు బరువు పెరగటానికి దోహదం చేసేవే కావటం గమనార్హం.

బకాయులైతే ఆ తర్వాత బరువు తగ్గించుకోవటం చాలా కష్టమవుతుంది. ఇది గుండెజబ్బు, మధుమేహం, క్యాన్సర్‌ వంటి సమస్యలకూ దారితీస్తుంది'' అని అధ్యయన నేత, కొలంబియా విశ్వవిద్యాలయానికి చెందిన షకీరా సుగిలా హెచ్చరిస్తున్నారు. తల్లిదండ్రులు కూడా ఈ విషయాన్ని గుర్తించి పిల్లలు రాత్రిపూట 8 గంటల కన్నా ఎక్కవసేపు నిద్రపోయేలా జాగ్రత్త తీసుకోవాలని సూచిస్తున్నారు. ఇది చదువులో రాణించటానికే కాదు. పెద్దయ్యాక ఆరోగ్యవంతులుగా ఉండటానికీ తోడ్పడుతుందని వివరిస్తున్నారు. యుక్తవయసు పిల్లలకు రాత్రిపూట దాదాపు 10 గంటల నిద్ర అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. నిద్రలేమితో సతమతమయ్యేవారు కేలరీలు అధికంగా ఉండే ఫాస్ట్‌ఫుడ్‌లను ఎక్కువగా ఇష్టపడుతుంటారు. ఇలాంటి ఆహార అలవాట్లు బరువు పెరగటానికి దోహదం చేసేవే కావటం గమనార్హం.

వేపుళ్లతో గర్భిణి మధుమేహం ,Gestational Diabetes with Fried foods

  •  

  • వేపుళ్లతో గర్భిణి మధుమేహం ,Gestational Diabetes with Fried foods

గర్భధారణకు ప్రయత్నిస్తున్నారా? అయితే వేపుళ్లను తినకుండా చూసుకోండి. ఇలాంటి తిండితో గర్భిణి మధుమేహం (జెస్టేషనల్‌ డయాబెటీస్‌) ముప్పు పెరుగుతోందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. గర్భధారణకు ముందు అధికంగా తిన్న మహిళలకు గర్భిణి మధుమేహం ముప్పు 13 రెట్లు ఎక్కువగా ఉంటున్నట్టు తాజా అధ్యయనంలో తేలింది మరి. వారానికి 4-6 సార్లు వేపుళ్లను తినేవారికి ఈ ముప్పు 31% అధికంగా ఉంటుండగా.. 7, అంతకన్నా ఎక్కువసార్లు తినేవారికైతే రెండింతలు ఎక్కువగా ముప్పు పొంచి ఉంటుండటం గమనార్హం. శరీర బరువు, ఎత్తుల నిష్పత్తిని (బాడీమాస్‌ ఇండెక్స్‌) పరిగణనలోకి తీసుకొని చూసినా వేపుళ్లను తినేవారికి గర్భిణి మధుమేహం వచ్చే అవకాశం అధికంగానే ఉంటోందని.. ఇలాంటి ఆహారాన్ని ఇంట్లో వండుకొని తినేవారి కన్నా హోటళ్లలో తినేవారికి ముప్పు మరింత పెరుగుతోందని పరిశోధకులు చెబుతున్నారు. వేపుళ్లు తినటాన్ని అదుపు చేస్తే జెస్టేషనల్‌ డయాబెటీస్‌ ముప్పు తగ్గటానికి తోడ్పడగలదని సూచిస్తున్నారు. కాబట్టి వేపుళ్ల విషయంలో కాస్త జాగ్రత్త గా ఉండటం మంచిది.

Atopic dermatitis treatment with vit.D,అటోపిక్‌ డెర్మటైటిస్‌ (ఎగ్జిమా) విటన్‌'D'తో చికిత్స .

  •  

  • Atopic dermatitis treatment with vit.D,అటోపిక్‌ డెర్మటైటిస్‌ (ఎగ్జిమా) విటన్‌'D'తో చికిత్స .

అటోపిక్‌ డెర్మటైటిస్‌ (ఎగ్జిమా) దీర్ఘకాలం వేధించే సమస్య. ఇది పిల్లల్లో ఎక్కువ. ఒళ్లంతా ఎర్రటి దద్దు, దురదతో బాధపెట్టే ఈ సమస్య చలికాలంలో మరింత ఉద్ధృతం అవుతుంటుంది కూడా. ఇలాంటి పిల్లలకు విటమిన్‌ డి మేలు చేస్తున్నట్టు, ఎగ్జిమా లక్షణాలను గణనీయంగా తగ్గిస్తున్నట్టు తాజాగా బయట పడింది. సాధారణంగా అటోపిక్‌ డెర్మటైటిస్‌కు అల్ట్రావయొలెట్‌ (యూవీ) కాంతి చికిత్స కూడా చేస్తుంటారు. ఇది చర్మంలో విటమిన్‌ డి ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని చలికాలంలో ఎగ్జిమా ఉద్ధృతం కావటానికీ విటమిన్‌ డి లోపానికీ సంబంధం ఉండొచ్చనే అనుమానంతో పరిశోధకులు ఇటీవల మంగోలియాలో ఒక అధ్యయనం చేశారు. ఆ దేశంలో పిల్లల్లో విటమిన్‌ డి లోపం అధికం. కాబట్టి అటోపిక్‌ డెర్మటైటిస్‌తో బాధపడుతున్న 2-17 ఏళ్ల పిల్లలను ఎంచుకొని.. వీరిలో కొందరికి రోజుకి 1,000 ఐయూ మోతాదులో విటమిన్‌ డి మాత్రలను, మరికొందరికి ఎలాంటి మందులేని మాత్రలను (ప్లాసిబో) ఇచ్చారు. నెల తర్వాత పరిశీలించగా.. విటమిన్‌ డి మాత్రలను వేసుకున్నవారిలో 29% మందిలో అటోపిక్‌ డెర్మటైటిస్‌ లక్షణాలు మెరుగుపడినట్టు తేలింది. అందువల్ల పిల్లల్లో చలికాలంలో అటోపిక్‌ డెర్మటైటిస్‌ లక్షణాలు తీవ్రమవుతుంటే కొన్ని వారాల పాటు విటమిన్‌ డి మాత్రలను ఇచ్చి చూసి, ఫలితాలు బాగుంటే మరికొంత కాలం కొనసాగించటం మేలని పరిశోధకులు సూచిస్తున్నారు.

16 November 2014

Running is better than walking?, నడవడం కంటే పరుగు మంచి వ్యాయామమా?

  •  

  •  
Running is better than walking?, నడవడం కంటే పరుగు మంచి వ్యాయామమా?

ఆరోగ్యానికి వ్యాయామం మంచిదని తెలిసిందే. అందుకే చాలామంది ఉదయమో, సాయంత్రమో నడవడం అలవాటు చేసుకున్నారు. అయితే దైనందిన వ్యాయామంతోపాటు వారానికి ఐదురోజులపాటు రోజుకి ఐదు నిమిషాల చొప్పున పరిగెత్తితే ఇంకా ఎక్కువ ఫలితం ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. వూబకాయం, మధుమేహం, హృద్రోగాలు, బీపీ, పక్షవాతం, క్యాన్సర్‌... వంటి వాటిని నియంత్రించవచ్చంటున్నారు.
* పరుగువల్ల ఎండొకెనాబినాయిడ్లు అనే హార్మోన్లు విడుదలవడంతో ఆనందం లభిస్తుందని పరిశోధనలో తేలింది.
* పరిగెత్తితే మోకాళ్ల పనితీరు మరింత మెరుగవుతుంది. ఉదాహరణకు పరుగు ఆపాక కూడా చాలామంది అథ్లెట్లను పరిశీలిస్తే వాళ్లలో ఆస్టియో ఆర్త్థ్రెటిస్‌ రావడం తక్కువని తేలింది.
* రోజూ ఐదు నిమిషాలు పరిగెత్తడంవల్ల జీవితకాలం కనీసం ఓ ఐదేళ్లు పెరుగుతుందన్నది మరో కొత్త పరిశోధన. తెలిసిందిగా మరి... పరిగెత్తండి!

Bacteria is cause for Obesity?,వూబకాయం కు బ్యాక్టీరియానే కారణమం?

  •  


Bacteria is cause for Obesity?,వూబకాయం కు బ్యాక్టీరియానే కారణమం?

తగిన వ్యాయామం లేకపోవడం, అతిగా తినడం... వల్ల బరువు పెరగడం సాధారణం. అయితే కొందరు అసలేం తినకున్నా కొంచెం తిన్నా వూబకాయంతో బాధపడుతుంటారు. అందుకే దీనిగురించి నిరంతరం పరిశోధనలు చేస్తూనే ఉన్నారు నిపుణులు. ఇటీవల లండన్‌లోని కింగ్స్‌ కాలేజ్‌కి చెందిన 'డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ట్విన్‌ రిసెర్చ్‌' చేసిన ఓ పరిశోధనలో ఓ కొత్తవిషయం తెలిసింది. తక్కువ బరువున్నవారి పొట్టలో క్రిస్టెన్‌సెనెల్లేసే కుటుంబానికి చెందిన ఒక రకమైన బ్యాక్టీరియా ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. ఈ బ్యాక్టీరియా తక్కువగా ఉన్నవాళ్లు ఎక్కువ బరువున్నట్లు తెలిసింది. దీన్నిబట్టి ఈ బ్యాక్టీరియా ఎంత ఎక్కువ ఉంటే వాళ్లు అంత సన్నగా ఉంటారని తేలింది. అయితే బ్యాక్టీరియా ఎక్కువ ఉండటం, తక్కువ ఉండటం అనేది మాత్రం జన్యుప్రభావమే. అంటే అది వంశపారంపర్యంగానే సంక్రమిస్తుంది. అయినప్పటికీ ఈ బ్యాక్టీరియాను కొన్ని ఎలుకల పొట్టలోకి ఇంజెక్ట్‌ చేయగా అవి సన్నబడ్డాయట. దాంతో ఈ పరిశో ధన ఆధారంగా వూబకాయాన్ని నిరోధించే కొత్త చికిత్సావిధానాలమీద దృష్టిపెట్టబోతున్నారు పరిశోధకులు.