గర్భం దాల్చిన సమయంలో కొందరు స్త్రీలకు రక్తంలో గ్లూకోజు మోతాదు పెరుగుతుంటుంది. ముఖ్యంగా మూడో నెలలో ఈ సమస్య మొదలవుతుంది. కాన్పు తర్వాత గ్లూకోజు తిరిగి మామూలు స్థాయికి వస్తుంది. అయితే ఇలా గర్భిణి మధుమేహం బారినపడ్డవారికి నిద్రలో శ్వాస సమస్య (స్లీప్ అప్నియా) ముప్పు ఏడు రెట్లు ఎక్కువగా ఉంటున్నట్టు తాజాగా బయటపడింది. గర్భిణి మధుమేహం గలవారిలో 75% మంది స్లీప్ అప్నియాతోనూ బాధపడుతున్నట్టు షికాగోలోని రష్ విశ్వవిద్యాలయం పరిశోధకులు గుర్తించారు. స్లీప్ అప్నియా మూలంగా నిద్రలో శ్వాస సరిగా ఆడక తరచుగా మెలకువ వస్తూ.. ఇబ్బందికర పరిస్థితులు తలెత్తొచ్చు.
- ===========================
No comments:
Post a Comment
Thanks for your Comment . Your feedback is important for improvement of this blog.