వాషింగ్టన్: ఆందోళన తదితర మానసిక రుగ్మతలకు సమర్థమైన రీతిలో కొత్త తరహా చికిత్స మార్గాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ బృందంలో భారత సంతతికి చెందిన శాస్త్రవేత్త పటేల్ కూడా ఉన్నారు. రసాయనాలతో మెరుగుపరిచిన కాక్స్-2 ఎంజైమ్ ఇన్హిబిటర్లు ఆందోళన లక్షణాల నుంచి ఉపశమనం కలిగిస్తాయని గుర్తించారు. సహజసిద్ధమైన ఎండోకానాబినాయిడ్స్ను ప్రేరేపించడం ద్వారా ఇవి ఉపశమనాన్ని కలుగజేస్తాయని పరిశోధకులు పేర్కొన్నారు. ఆందోళన, మానసిక రుగ్మతల చికిత్సల్లో ఇవి కొత్త తరహా పద్ధతులకు నాంది పలుకుతాయని భావిస్తున్నారు. వీటికి సంబంధించిన క్లినికల్ ట్రయల్స్ రాబోయే కొన్నేళ్లలో మొదలవుతాయని పరిశోధకులు లారెన్స్ మార్నెట్ పేర్కొన్నారు.
- ===========================
Visit my website at ->
Dr.Seshagirirao.com/
No comments:
Post a Comment
Thanks for your Comment . Your feedback is important for improvement of this blog.