వాషింగ్టన్: అమెరికాకు చెందిన నానో టెక్నాలజీ సంస్థ తక్కువ ఖర్చుతో గంట వ్యవధిలోనే ఎయిడ్స్ నిర్ధరించే పరికరాన్నీ, యాప్ను రూపొందించింది. ఈ సంస్థకు భారత సంతతికి చెందిన శాస్త్రవేత్త నేతృత్వం వహించడం విశేషం. రక్తం, లాలాజలం లేదా శరీరంలోని ఇతర ద్రవాలను ఒక్క బొట్టు తీసుకుని నానోచిప్పై వేసి, 'జీన్-రీడర్'గా పిలిచే ఈ పరికరంలో పెడితే సరిపోతుంది. డాక్టర్ అనితాగోయెల్ ఛైర్మన్, సీఈవోగా వ్యవహరిస్తున్న బోస్టన్లోని 'నానోబయోసిమ్' సంస్థ ఈ పరికరాన్ని రూపొందించింది. తమ పరికరం 'గోల్డ్స్టాండర్డ్' పరీక్షను నిర్వహిస్తుందన్నారు. అమెరికాలో ఈ పరీక్షకు కనీసం రెండు వారాలు పట్టడమే కాకుండా, వ్యయం కూడా ఎక్కువే. జీన్-రీడర్ పరికరంతో చేపట్టే పరీక్ష తక్కువ ఖర్చుతో పూర్తవుతుందని అనిత చెప్పారు
source : Eenadu new paper 24.Oct.2013
- ===========================
No comments:
Post a Comment
Thanks for your Comment . Your feedback is important for improvement of this blog.