లండన్: కేన్సర్కు మందు ఇస్తే ఎయిడ్స్ నయమైన విచిత్ర ఘటన అమెరికాలోని బోస్టన్లో జరిగింది. ఎయిడ్స్ బారిన పడిన ఇద్దరు వ్యక్తులు (పురుషులు) చాలాకాలంగా ఆ వ్యాధికి చికిత్స తీసుకుంటున్నారు. ఈ క్రమంలో వారిలో లింఫొమా అనే రకం రక్తకేన్సర్ కూడా బయటపడటంతో వైద్యులు.. మూలకణాల మార్పిడి చికిత్స జరిపారు. దీని తర్వాత కొన్నిరోజులకు చూస్తే కేన్సర్ నయమవటమే కాదు.. ఏయిడ్స్ బారి నుంచీ వారు విముక్తి పొందినట్లు తెలిసింది. వారిద్దరి రక్తంలో హెచ్ఐవీ వైరస్ కనిపించలేదు. ఒక వ్యాధిగ్రస్థుడికి 15 వారాల నుంచి ఎయిడ్స్ మందులు ఇవ్వటం మానివేయగా, మరొకరికి ఏడువారాల నుంచి నిలిపివేశారు. ఈ వివరాలను కౌలాలంపూర్లో ఏర్పాటైన అంతర్జాతీయ ఏయిడ్స్ సొసైటీ సమావేశంలో.. బోస్టన్లోని హార్వర్డ్ మెడికల్ స్కూల్, బ్రిగమ్ అండ్ విమెన్స్ హాస్పిటల్కు చెందిన తిమోతి హెన్రిచ్ వెల్లడించారు. బాధితుల నుంచి ఏయిడ్స్ వైరస్ పూర్తిగా తొలగిపోయిందా అన్న విషయాన్ని ఇప్పుడే చెప్పలేమన్నారు.(5:23 PM 06-Oct-13)
- ===========================
No comments:
Post a Comment
Thanks for your Comment . Your feedback is important for improvement of this blog.