వాషింగ్టన్: వారసత్వంగా వచ్చే ఓ నేత్ర వ్యాధికి కారణమయ్యే జన్యు ఉత్పరివర్తనాన్ని మూత్రపరీక్ష ద్వారా గుర్తించవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ వ్యాధితో దృష్టిలోపం, అంధత్వం వంటి సమస్యలూ తలెత్తుతాయి. ఫ్లోరిడాలోని బాస్కామ్ పామర్ నేత్ర కేంద్రానికిచెందిన పరిశోధకులు డాక్టర్ రాంగ్ వెన్, డాక్టర్ బైరాన్ ల్యామ్ డ్యూక్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు జిక్వియాంగ్ గువాన్తో కలిసి ఈ పరిశోధన చేపట్టారు. ఈ పరిశోధనలో భాగంగా.. రెటినైటిస్ పిగ్మెంటోసా (ఆర్పీ) అనే కంటి వ్యాధితో బాధపడుతున్న కుటుంబం నుంచి సేకరించిన కణాలను విశ్లేషించారు. ఈ కుటుంబానికి చెందిన జీనోమ్ సీక్వెన్స్ను అంతకుముందే పూర్తిచేసి ఉండటంతో వాటితో పోల్చిచూశారు. ఈ విషయంలో రక్తపరీక్షలకన్నా మూత్రపరీక్షలు మెరుగైన ఫలితాలను ఇచ్చాయనీ, 'డోలికాల్ ప్రొఫైలింగ్'లో మూత్రపరీక్ష మంచి ఫలితం ఇస్తున్నట్లు పరిశోధకులు స్పష్టం చేశారు.
- ===========================
No comments:
Post a Comment
Thanks for your Comment . Your feedback is important for improvement of this blog.