వాషింగ్టన్: పుస్తకాలు ఎక్కువగా చదవడం, రాయడం, బుర్రకు పనిపెట్టే పనుల్లో పాలుపంచుకోవడం వంటి చర్యల ద్వారా వృద్ధాప్యంలోనూ జ్ఞాపకశక్తిని పదిలపరచుకోవచ్చని అమెరికాలో నిర్వహించిన అధ్యయనంలో తేలింది. షికాగోలోని రష్ విశ్వవిద్యాలయ వైద్య కేంద్రానికి చెందిన పరిశోధకులు దీన్ని నిర్వహించారు. ''చిన్నతనం నుంచి వృద్ధాప్యం వరకూ ఇలాంటి చర్యలు చేపట్టడం వల్ల వార్ధక్యంలో మెదడు ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది'' అని పరిశోధనకు నాయకత్వం వహించిన రాబర్ట్ ఎస్ విల్సన్ తెలిపారు. అధ్యయనంలో భాగంగా 294 మందికి జ్ఞాపకశక్తి, ఆలోచనశక్తికి సంబంధించిన పరీక్షలు నిర్వహించారు.
- ===========================
No comments:
Post a Comment
Thanks for your Comment . Your feedback is important for improvement of this blog.