వాషింగ్టన్: ఒక సమస్య మరో సమస్యకు దారితీయవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. మధుమేహంతో అల్జీమర్స్ ముప్పు పెరిగే ముప్పుంటుందని స్పష్టం చేశారు. జార్జిటౌన్ విశ్వవిద్యాలయం పరిశోధకులు స్కాట్ టర్నర్ తమ అధ్యయనంలో భాగంగా పలువురు అల్జీమర్స్ బాధితుల్ని పరిశీలించగా, వారిలో చాలామందిలో ముందస్తు మధుమేహం లక్షణాలు బయటపడ్డాయి. మధుమేహం అల్జీమర్స్ ముప్పును పెంచుతోందనీ, గ్లూకోజ్ సున్నితత్వాన్ని మెరుగుపరిస్తే.. మధుమేహం, అల్జీమర్స్ రెండింటినీ మరికొంత ఆలస్యం చేయవచ్చని టర్నర్ పేర్కొన్నారు. అల్జీమర్స్ బాధితులందరికీ గ్లూకోజ్ టాలరెన్స్ పరీక్ష చేయించడం మేలని తమ అధ్యయనం ద్వారా అవగతమవుతోందని టర్నర్ స్పష్టం చేశారు.v
- ===========================
Visit my website at ->
Dr.Seshagirirao.com/
No comments:
Post a Comment
Thanks for your Comment . Your feedback is important for improvement of this blog.