టొరంటో: వైద్యం చేసే మెదడు కణాల్ని ప్రయోగశాల్లో పెంచే విధానానికి శాస్త్రవేత్తలు మరింత చేరువయ్యారు. ప్రయోగశాలల్లో వృద్ధిచేసే వీటిని రోగులకు మార్పిడి చేయడం ద్వారా ఎన్నో నాడీసంబంధ సమస్యలకు చికిత్స అందించే అవకాశం ఉందని భావిస్తున్నారు. తాజా అధ్యయనం ప్రకారం.. సూక్ష్మ బయాప్సీ విధానం ద్వారా సేకరించిన మెదడు కణాలను భారీ సంఖ్యలో వ్యక్తిగత కణాలుగా ప్రయోగశాలలో పెంచుతారు. ఇవి ఆరోగ్యకరమే కాకుండా, నిల్వ ఉండి, భవిష్యత్తులో గాయాలు, విషప్రభావం, వ్యాధుల నుంచి మెదడును కాపాడే సాధనాలుగా ఉపయోగపడతాయని పరిశోధకులు పేర్కొన్నారు. ప్రయోగశాల నుంచి అవసరమైన వారికి మార్పిడి చేసే అవకాశం పెరుగుతుందని పేర్కొన్నారు. ఈ పరిశోధన విజయంతో ప్రస్తుతం చికిత్స లేని నాడీసంబంధ మొండిజబ్బులకు సైతం భవిష్యత్తులో వ్యక్తిగత పరమైన, కణ ఆధార వైద్యం అందించే అవకాశాలు అందుబాటులోకి వస్తాయిని విశ్వసిస్తున్నట్లు వెస్టరన్ ఒంటారియో విశ్వవిద్యాలయ పరిశోధకులు మాథ్యూ ఒ. హెబ్ పేర్కొన్నారు.(5:53 AM 10/2/2013)
- ===========================
No comments:
Post a Comment
Thanks for your Comment . Your feedback is important for improvement of this blog.