న్యూయార్క్: దెబ్బతిన్న లేదా జబ్బు బారిన పడిన అవయవాలను రక్తనాళ కణాలతో మరమ్మతు చేయవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అవయవ దానం, అవయవ మార్పిడి వంటివి అవసరం లేకుండానే ఈ పద్ధతిలో చికిత్స జరిపే వీలుంది. రక్తకణాల నిర్మాణాన్ని తీర్చిదిద్దే ఎండోలీథియల్ కణాలు శక్తిమంతమైన జీవ యంత్రాల్లాంటివి. ఇవి ప్రయోజనకరమైన, అవయవ సంబంధ పరమాణువులను విడుదల చేయడం ద్వారా అవయవాల కణజాల పునరుత్పాదనను ప్రేరేపిస్తాయని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఎండోలీథియల్ కణాల్లోని క్రియాశీలక జన్యువులను డీకోడింగ్ చేయడం ద్వారా ఈ అంశాన్ని గుర్తించారు. అవయవాలు తమ రక్తనాళాలు, వాటి మరమ్మతు పరమాణువులను నిర్దేశిస్తాయన్న విషయాన్నీ ఈ పరిశోధనలో గుర్తించారు. తీర్చిదిద్దిన ఎండోలీథియల్ కణాలను ఇంజక్షన్ ద్వారా శరీరంలోకి అవసరమైన చోట ఎక్కించినప్పుడు గాయపడిన కణజాలంలోకి వెళ్లి, అవయవానికి మరమ్మతు సామర్థ్యాన్ని పెంచుతాయని అన్సారీ స్టెమ్సెల్ ఇనిస్టిట్యూట్, ట్రైసై స్టెమ్ సెంటర్కు చెందిన పరిశోధకులు ప్రొఫెసర్ షహీన్ రఫీ పేర్కొన్నారు.(6:05 PM 10-Oct-13)
- ===========================
Visit my website at ->
Dr.Seshagirirao.com/
No comments:
Post a Comment
Thanks for your Comment . Your feedback is important for improvement of this blog.