ముంబయి: దంతాల నుంచి సేకరించిన మూలకణాలతో పలురకాల వ్యాధులను నయం చేయవచ్చని వైద్య నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా.. కణజాల, అవయవ సంబంధిత రుగ్మతలైన మధుమేహం, కీళ్లనొప్పులకు వీటితో చికిత్సను అందించవచ్చని తెలిపారు. ముంబయిలోని స్టిమేడ్ ప్రైవేట్ డెంటల్ స్టెమ్సెల్స్ బ్యాంక్కు చెందిన ఈ నిపుణులు.. మూడేళ్లుగా దంత మూలకణాలను సేకరించి భద్రపరుస్తున్నారు. వాటిని మైనస్ 150 డిగ్రీల వద్ద క్రయోజెనిక్ ట్యాంకుల్లో భద్రపరుస్తామని తెలిపారు. వ్యాధుల చికిత్సకు అవసరమైనప్పుడు.. ఆయావ్యక్తులు తమ దంతమూలకణాలను తిరిగి తీసుకొని వ్యాధుల నుంచి విముక్తి పొందుతున్నారని పేర్కొన్నారు.
- ===========================
No comments:
Post a Comment
Thanks for your Comment . Your feedback is important for improvement of this blog.