న్యూయార్క్: మహిళలు విడాకులు, భర్తను కోల్పోవడం, ఉద్యోగం పోగొట్టుకోవడం వంటి ఒత్తిడి కలిగించే పరిణామాలకు లోనైనప్పుడు.. తర్వాతి కాలంలో డిమెన్షియా బారిన పడతారని తాజా అధ్యయనంలో గుర్తించారు. స్వీడన్లో 800 మంది మహిళలపై చేపట్టిన అధ్యయనంలో.. మధ్యవయసులో ఈ తరహా ఒత్తిడికి గురైన వారిలో తర్వాతి నాలుగు దశాబ్దాల కాలంలో డిమెన్షియా, అల్జీమర్స్ వంటి మానసిక సమస్యలు పెరిగే ముప్పు అధికంగా ఉన్నట్లు గుర్తించారు. మానసికపరమైన ఒత్తిడికి లోనయ్యే వారిలో.. కుంగుబాటు, ఆందోళన, భయం, ఉద్రేకం, నిద్రసమస్యలు వంటి సమస్యలకు లోనయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. అయితే.. వీటికి ఇతరత్రా కారణాలు కూడా తోడవ్వచ్చని చెబుతున్నారు. మానసిక ఒత్తిడికీ మెదడులో ఇన్ఫ్లమేటరీ కారకాల ఉత్పత్తి పెరిగేందుకు సంబంధం ఉంటుందని వివరించారు. గుండెజబ్బు ముప్పు కూడా పెరుగుతుందనీ, ఇవన్నీ కలిసి డిమెన్షియా ముప్పును పెంచుతాయని పేర్కొన్నారు.(5:55 AM 10/2/2013)
- ===========================
No comments:
Post a Comment
Thanks for your Comment . Your feedback is important for improvement of this blog.